వరుస సెలవులతో పెరిగిన విమాన ఛార్జీలు
చెన్నై నుంచి ఇతర నగరాలు, పట్టణాలకు విమాన ఛార్జీలు బాగా పెరిగాయి. రక్షాబంధన్, వారాంతపు సెలవులు, స్వాతంత్య్ర దినం కలిసి రావడం, వరుస సెలవులతో పలు ప్రాంతాలకు డిమాండు కూడా తోడైంది.
వడపళని, న్యూస్టుడే: చెన్నై నుంచి ఇతర నగరాలు, పట్టణాలకు విమాన ఛార్జీలు బాగా పెరిగాయి. రక్షాబంధన్, వారాంతపు సెలవులు, స్వాతంత్య్ర దినం కలిసి రావడం, వరుస సెలవులతో పలు ప్రాంతాలకు డిమాండు కూడా తోడైంది. శుక్రవారం సాయంత్రం, శనివారం ఉదయం కొన్ని ప్రాంతాలకు ఒక సారి వెళ్లేందుకు రూ. 10వేల వరకు టిక్కెట్టు ఛార్జీగా ఉంది. ముంబైకి రూ. 8,000 - 9,600, దిల్లీకి రూ. 9,500 - 10,000/-, బెంగళూరుకు రూ. 6,000 - రూ. 9,000గా ఉంది. రాష్ట్రంలోని మదురై, ట్యుటికోరిన్లకు రూ. 10 వేలు ఛార్జీ కింద వసూలు చేస్తున్నారు. కృష్ణజయంతి, వినాయక చవితి, వారాంతపు సెలవులు కలిసి రావడంతో ఆగస్టు నెలంతా ఛార్జీలు ఇంకా పెరిగే అవకాశాలున్నాయని పలువురు ట్రావెల్ ఏజెంట్లు పేర్కొన్నారు. డిమాండు బాగా ఎక్కువగా ఉండటంతో వచ్చే నెలలో రాయితీ కల్పించేందుకు కొన్ని విమాన సంస్థలు ఆలోచిస్తున్నాయి. ఈజ్ మై ట్రిప్ ట్రావెల్ సంస్థ సహ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టి మాట్లాడుతూ వారాంతంలో 70 శాతం వరకు బుకింగులు ఎక్కువయ్యాయన్నారు. గోవా, రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్, కూర్గ్, కేరళ ప్రాంతాలకు ఎక్కువమంది టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. హోటళ్ల రిజర్వేషన్లు కూడా డిమాండుగా ఉన్నాయి. బుకింగ్ డాట్ కామ్లో ఆగస్టులో ముంబైకి సమీపంలో ఉన్న లోనావాలా, కొచ్చికి విశ్రాంతి, తీర్థయాత్రల కోసం తిరుపతి, షిర్డి, రిషికేష్, వారసత్వ యాత్ర (హెరిటేజ్ ట్రిప్)గా జైపూర్, ఉదయ్పూర్, ఆగ్రా, బీచ్ సందర్శించేందుకు పుదుచ్చేరి, గోవా, పురి, కొండ ప్రాంతాలైన ఊటీ, కొడైక్కెనాల్, మున్నార్ వంటి ప్రాంతాలకు రిజర్వేషన్లు జోరుగా ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు విమానాలు, హోటళ్లు నిండి పోయాయని మదురై ట్రావెల్స్ ప్రతినిధి శ్రీహరన్ బాలన్ పేర్కొన్నారు. చివరి క్షణాల్లో బుకింగ్ కోసం వచ్చే వారికి ఇబ్బందులు తప్పవని, సీట్లు బాగా తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఆగ్నేయాసియా దేశాల నుంచి పర్యాటకుల రాక కూడా ఎక్కువ కావడంతో డొమెస్టిక్ విమాన ఛార్జీలు, హోటల్ రూము అద్దెలు కూడా పెరిగాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
[ 25-04-2024]
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. -
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
[ 25-04-2024]
శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. -
మహిళల పాలిట రక్తపోటు
[ 25-04-2024]
అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి. -
ఆధారాలున్నా ఓటరు పేర్లు గల్లంతు
[ 25-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బర్డ్ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక బృందాలు
[ 25-04-2024]
తమిళనాడులో బర్డ్ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. -
జూన్లో కొత్త రోడ్లు
[ 25-04-2024]
కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
తమిళ అభిమానులకు కృతజ్ఞతలు
[ 25-04-2024]
ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష
[ 25-04-2024]
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్ బిస్కెట్ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. -
మత ఘర్షణలు సృష్టించేలా ప్రధాని ప్రచారం
[ 25-04-2024]
మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
మోదీ పాలనలో మైనారిటీలు ఇబ్బంది పడలేదు: ఓ పన్నీర్సెల్వం
[ 25-04-2024]
మోదీ పాలనలో మైనారిటీ ప్రజలు ఇబ్బంది పడలేదని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం తెలిపారు. మదురై తిరుప్పరకుండ్రం సుబ్రమణిస్వామి ఆలయంలో మంగళవారం మురుగన్ను దర్శించుకున్నారు. -
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ చర్యలు: స్టాలిన్
[ 25-04-2024]
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
[ 25-04-2024]
హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు