200 ఎకరాల్లో మూలికల సాగు
దిండుక్కల్లో 200 ఎకరాల్లో మూలికలు సాగు చేయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్ తెలిపారు. తాంబరం జాతీయ సిద్ధ వైద్య సంస్థలో కేంద్ర సిద్ధ వైద్య పరిశోధన
మంత్రి మా.సుబ్రమణియన్
రిబ్బన్ కత్తిరిస్తున్న కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్
ఆర్కేనగర్, న్యూస్టుడే: దిండుక్కల్లో 200 ఎకరాల్లో మూలికలు సాగు చేయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్ తెలిపారు. తాంబరం జాతీయ సిద్ధ వైద్య సంస్థలో కేంద్ర సిద్ధ వైద్య పరిశోధన గ్రూప్ ప్రధాన కార్యాలయం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆప్ సిద్ధ మెడిసిన్, అయోధ్య పండిట్ హాస్పిటల్ కొత్త అవుట్ పెషెంట్ డిపార్ట్మెంట్ భవనాన్ని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ శనివారం అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్ పాల్గొని మాట్లాడుతూ.. కొత్త బ్లాక్లో 32 అవుట్ పేషెంట్ చికిత్సా సదుపాయాలు, 20 మందులు ఇచ్చే కౌంటర్లు, 30 మానసిక కౌన్సిలింగ్ గదులు ఉన్నాయని చెప్పారు. యోగాకు 500 సీట్లతో కూడిన బహుళ ప్రయోజన గది అదనంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏడాదిలో 365 రోజులు ఈ ఆస్పత్రి పనిచేస్తుందన్నారు. ఇక్కడి అవుట్ పెషెంట్ల బ్లాక్ ద్వారా రోజుకు 2500 మంది రోగులు చికిత్స పొందే వీలుందన్నారు. మూలికల పంట సాగులో రైతులను ప్రోత్సహించేందుకు వర్క్షాప్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు మూలికలు, మూలికా పంటల సాగు గురించి అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఒకే చోట నడుస్తున్న ఏడు సిద్ధ ఆయుష్ సంక్షేమ కేంద్రాలు, ఒక జాతీయ గ్రామీణ సంక్షేమ పథకం సిద్ధ యూనిట్ని ఎనిమిది చోట్లకు మార్చేందుకు ఏర్పాటు చేస్తామన్నారు. టామ్కాల్ కంపెనీ ద్వారా సౌందర్య ఉత్పత్తులను తయారుచేయనున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్టీలు మంచి చేస్తే రాజకీయాల్లోకి రాను: నటుడు విశాల్
[ 23-04-2024]
రాజకీయ పార్టీలు ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తే, తనలాంటి వారు ఎల్లప్పుడూ ఓటర్లగానే మిగిలిపోతారని నటుడు విశాల్ తెలిపారు. -
వారి చొరవ స్ఫూర్తిదాయకం
[ 23-04-2024]
గత నాలుగు లోక్సభ ఎన్నికల్లో అత్యంత తక్కువ పోలింగ్ ఈసారి రాష్ట్రంలో నమోదైంది. చాలా స్థానాల్లో 60శాతం పోలింగ్ దాటేందుకూ అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. -
ఓటేయడాన్ని అడ్డుకున్న ఘటనపై దర్యాప్తు
[ 23-04-2024]
కాంచీపురం జిల్లా పరందూర్ సమీపంలో చెన్నై గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం కోసం భూసేకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. -
దక్షిణాది నుంచే భాజపాకు పతనం ఆరంభం
[ 23-04-2024]
భారతీయ జనతా పార్టీ (భాజపా)కు దక్షిణాది నుంచే పతనం ప్రారంభమైందని పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. -
తగ్గిన ఎక్స్ప్రెస్ రైళ్ల వేగం
[ 23-04-2024]
మెట్రో రెండో దశలో చేట్పేట్, కీల్పాక్ మెట్రో స్టేషన్ల మధ్య భూగర్భంలో జరుగుతున్న పనులు చేట్పేట్ చెరువు కింద సబర్బన్ స్టేషను ప్రాంతానికి చేరుకున్నాయి. -
20 రోజుల్లో రూ.190 కోట్లు
[ 23-04-2024]
చెన్నై కార్పొరేషన్లో ఏప్రిల్ 20 వరకు రూ.190 కోట్ల ఆస్తిపన్ను వసూలైంది. ఈ నెలాఖరులోపు చెల్లిస్తే 5శాతం రాయితీ పొందొచ్చని కార్పొరేషన్ ప్రకటించింది. -
త్యాగానికి చిహ్నం కాషాయం
[ 23-04-2024]
కాషాయ రంగు త్యాగానికి చిహ్నమని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. దూరదర్శన్ లోగోను కాషాయ రంగులోకి మార్చడాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ ఖండించిన నేపథ్యంలో తమిళిసై తన ఎక్స్ పేజీలో స్పందించారు. -
12 జిల్లాల సరిహద్దుల్లో సోదాలు
[ 23-04-2024]
తమిళనాడులో 12 జిల్లాల సరిహద్దుల్లో ఫ్ల్లయింగ్స్క్వాడ్ సోదాలు జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రద సాహు తెలిపారు. -
ఆర్కేనగర్ ఉప ఎన్నికలో టోకెన్ ఇచ్చి గెలవలేదు
[ 23-04-2024]
ఆర్కేనగర్ ఉప ఎన్నికలో టోకెన్ ఇచ్చి గెలవలేదని ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ తెలిపారు. తేని జిల్లా కంభంలో జరిగిన గోపాలన్ ఆలయ చిత్తిరై తిరునాళ్లలో పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు. -
మాణిక్కం ఠాగూర్పై అనర్హతవేటు వేయాలన్న పిటిషన్ కొట్టివేత
[ 23-04-2024]
విరుదునగర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మాణిక్కం ఠాగూర్పై అనర్హత వేటు వేయాలని కోరిన పిటిషన్ను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. -
తండ్రిని చంపిన కుమారుడు
[ 23-04-2024]
తూత్తుక్కుడి సెలసీని కాలనీకి చెందిన సత్యమూర్తి, అనుసూయ భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు. మద్యానికి బానిసైన సత్యమూర్తి రోజూ భార్యను, పిల్లలను హింసించేవాడు. -
ప్రధానోపాధ్యాయుడికి 47 ఏళ్ల జైలు
[ 23-04-2024]
లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రధానోపాధ్యాయుడికి 47 ఏళ్ల జైలు శిక్ష పడింది. శివగంగై జిల్లా కాలైయార్కోవిల్ పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా 2014లో మురుగన్ (54) పనిచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా