‘స్మార్ట్ సిటీ పనులు త్వరగా ముగిస్తాం’
‘స్మార్ట్ సిటీ’ పనులు త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కేఎన్ నెహ్రూ పేర్కొన్నారు. ఈరోడ్ కలెక్టర్ కార్యాలయంలో అభివృద్ధి పథకాల అమలుపై శనివారం మంత్రి నేతృత్వంలో పట్టణ స్థానిక సంస్థల
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేఎన్ నెహ్రూ
విల్లివాక్కం, న్యూస్టుడే: ‘స్మార్ట్ సిటీ’ పనులు త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కేఎన్ నెహ్రూ పేర్కొన్నారు. ఈరోడ్ కలెక్టర్ కార్యాలయంలో అభివృద్ధి పథకాల అమలుపై శనివారం మంత్రి నేతృత్వంలో పట్టణ స్థానిక సంస్థల అధికారులతో సమావేశం జరిగింది. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ‘స్మార్ట్ సిటీ’ పథక పనులు పరిశీలించేందుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి దేవిదార్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీ విచారణ చేపడుతోందని, స్థానిక సంస్థల్లో చోటుచేసుకున్న అవినీతిపై నివేదిక అందిన వెంటనే తగిన చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి నెహ్రూ పేర్కొన్నారు. హొగినేకల్ ఉమ్మడి తాగునీటి పథక పనులకు గాను నివేదిక అందిన వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. పట్టణ స్థానిక సంస్థల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రూ.1,000 కోట్లు కేటాయించారని హర్షం వ్యక్తం చేశారు. ఈరోడ్లో ఊరాట్చిక్కోట్టై తాగునీటి పథకానికి పైపులు అమర్చడంలో జరిగిన సమస్యలను సరిచేస్తామన్నారు. కరోనా సమయంలో నగరపాలక సంస్థ దుకాణాలకు అద్దె చెల్లింపులో మినహాయింపు లేదని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరూరులో.. 4 ఈవీఎంలు!
[ 18-04-2024]
లోక్సభ సమరంలో ఓటువేసే తేదీ వచ్చేసింది. 19.. అంటే రేపే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకు తగ్గ ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ పూర్తిచేసింది. ఓటింగ్ యంత్రాల తరలింపు ప్రక్రియలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. -
ఓటు భావితరాన్ని కాపాడాలి: స్టాలిన్
[ 18-04-2024]
ప్రజల ఓటు భావితరాన్ని కాపాడాలంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. డీఎంకే ఎంపీ అభ్యర్థులు కళానిధి వీరాసామి(ఉత్తర చెన్నై), దయానిధి మారన్(మధ్య చెన్నై), తమిళచ్చి తంగపాండియన్(దక్షిణ చెన్నై)కు మద్దతుగా.. -
సమస్యలు పరిష్కరించండి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలకు కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. అన్నానగర్లోని ‘ఫెడరేషన్ ఆఫ్ అన్నానగర్ రెసిడెంట్్స అసోసియేషన్స్’ (ఎఫ్ఏఎన్ఆర్ఏ) తమ డిమాండ్లను సెంట్రల్ చెన్నై లోక్సభ అభ్యర్థుల ముందుంచారు. -
తెన్కాశిలో నెగ్గేదెవరు?
[ 18-04-2024]
పశ్చిమ కనుమల్లోని తెన్కాశి నియోజకవర్గం పునర్విభజనకు ముందు పూర్తిగా తిరునెల్వేలి జిల్లాలో ఉండేది. ఆ తర్వాత తెన్కాశి, కడైయనల్లూర్, వాసుదేవనల్లూర్(రిజర్వు), శంకరన్కోవిల్(రిజర్వు), విరుదునగర్లోని శ్రీవిల్లిపుత్తూర్(రిజర్వు), -
దూరదృష్టితో అభివృద్ధి ప్రణాళికలు
[ 18-04-2024]
దూరదృష్టితో అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తానని అన్నాడీఎంకే దక్షిణ చెన్నై అభ్యర్థి జయవర్ధన్ తెలిపారు. శ్రీరామనవమి పురస్కరించుకుని అయోధ్యకుప్పంలోని రాముడి ఆలయంలో పూజల అనంతరం బుధవారం ప్రచారం చేశారు. -
ప్రజాసేవకు వచ్చాం: ప్రేమలత
[ 18-04-2024]
ప్రజలకు సేవ చేసేందుకు తాము వచ్చామని ప్రేమలతా విజయకాంత్ అన్నారు. విరుదునగర్ లోక్సభ స్థానంలో పోటీచేస్తున్న కుమారుడు విజయ ప్రభాకరన్కి మద్దతుగా డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలతా బుధవారం -
ఇండియా కూటమిని గెలిపిస్తే అందరికీ సమాన విద్య
[ 18-04-2024]
అందరికీ సమానమైన విద్య అందించేందుకు ఇండియా కూటమికి ఓటు వేయాలని కనిమొళి తెలిపారు. డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి, తూత్తుక్కుడి అభ్యర్థి కనిమొళి బుధవారం తిరుచ్చెందూర్ ప్రచారంలో మాట్లాడుతూ. -
మూడో ప్రయత్నంలో 871వ ర్యాంకు
[ 18-04-2024]
సివిల్ సర్వీసెస్ పరీక్షలో పీఎఫ్ కార్యాలయంలో సహాయకురాలిగా పనిచేస్తున్న ఇన్బ 851వ ర్యాంకు సాధించారు. ఆమె మాట్లాడుతూ.. నా సొంతూరు తెన్కాశి జిల్లా వాసుదేవనల్లూర్. -
డీఎంకే, భాజపాకు ఓటు వేయటం ఒకటే: ఈపీఎస్
[ 18-04-2024]
డీఎంకే, భాజపాలకు ఓటేయటం ఒకటేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో...