logo

‘మహిళలు ఆర్థికంగా ఎదగాలి’

ప్రభుత్వ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని అరక్కోణం ఎమ్మెల్యే ఎస్‌.రవి అన్నారు. పట్టణ 22వ వార్డు పరిధిలో పేద మహిళలకు సంక్షేమ ఫలాలను శనివారం అందచేశారు.

Published : 14 Aug 2022 00:16 IST

లబ్ధిదారులకు కుట్టుయంత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్యే రవి

అరక్కోణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని అరక్కోణం ఎమ్మెల్యే ఎస్‌.రవి అన్నారు. పట్టణ 22వ వార్డు పరిధిలో పేద మహిళలకు సంక్షేమ ఫలాలను శనివారం అందచేశారు. కుట్టు మిషన్లు, టీ దుకాణాలు కొత్తగా ఏర్పాటు చేసుకొనేందుకు టీ స్టాండ్‌, కిరోసిన్‌ స్టౌలు అందించారు. 22వ వార్డు ప్రతినిధి సుగంది వినోధిని ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. అబిషేక్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి వైద్యపరీక్షలు చేశారు. కార్యక్రమంలో పట్టణ కోఆపరేటీవ్‌ బ్యాంక్‌ అద్యక్షుడు శ్యామ్‌ కుమార్‌ ,మున్సిపాలిటీ కౌన్సిలర్‌ నరసింహన్‌, పార్టీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని