75 వసంతాల్లో ‘ఆర్థిక’ పురోభివృద్ధి!
చోళులు, పాండ్యులు, పల్లవులు ఇలా ఎంతోమంది మహామహులు తమిళ ప్రాంతాన్ని పరిపాలించారు. ఆ ఆనవాళ్లూ ఇప్పటికీ బయటపడుతూనే ఉన్నాయి.
కీలక ప్రభావం చూపిన నేతలు
రాష్ట్రానికి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు
ఈనాడు, చెన్నై: చోళులు, పాండ్యులు, పల్లవులు ఇలా ఎంతోమంది మహామహులు తమిళ ప్రాంతాన్ని పరిపాలించారు. ఆ ఆనవాళ్లూ ఇప్పటికీ బయటపడుతూనే ఉన్నాయి. తమిళుల నాగరికతకు ఆధారాలూ కనిపిస్తున్నాయి. స్వాతంత్య్ర పోరాటం అనంతరం బ్రిటిష్ చెర నుంచి విముక్తి పొందాక ఈ ప్రాంతంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. 1947 నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రధాన ఘటన సమాహారం ఇదీ...
* స్వాతంత్య్రం వచ్చాక ఈ ప్రాంతంలో వివిధ సామాజిక వర్గాల మధ్య శాంతినెలకొంది. మద్రాస్ ప్రెసిడెన్సీగా ఏర్పడ్డాక.. సి.రాజగోపాలాచారి (రాజాజీ) తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ పరిధిలో ఆంధ్రా ప్రాంతాలూ కలిసి ఉన్నాయి.
* పొట్టిశ్రీరాములు పోరాటం ఫలితంగా 1953లో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు కలిశాయి. ఈ ప్రాంతం తమిళనాడు రాష్ట్రంగా అవతరించింది.
* 1947 తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంది. తర్వాత ద్రావిడర్ కళగం నుంచి వేరై.. ద్రావిడ మున్నేట్ర కళగాన్ని 1949లో అన్నాదురై స్థాపించారు. ప్రత్యేకించి హిందీ నేపథ్య సంస్కృతిని ఈ పార్టీ వ్యతిరేకించింది. ద్రావిడులకు ప్రత్యేక ప్రాంతం కావాలనే డిమాండ్ పెరిగింది.
* ప్రత్యేక ద్రావిడనాడు కావాలని ఉద్యమాలు జరిగాయి. తర్వాత 1962లో చైనా, భారత్ మధ్య జరిగిన యుద్ధం కారణంగా ఈ డిమాండ్ కాస్తా వెనకబడింది.
* 1963లో రాజ్యాంగంలోని 16వ సవరణ ప్రకారం వేర్పాటువాద రాజకీయ పార్టీల్ని ఎన్నికల్లో పోటీచేయకుండా నిరోధించారు. దీంతో డీఎంకే స్వతంత్ర ప్రతిపత్తిపై దృష్టిపెట్టింది. ఆ తర్వాత ద్రావిడ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరిగాయి.
* అన్నాదురై, కరుణానిధి లాంటి రచయితలు తమ కలం ద్వారా ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేశారు. పలు మాధ్యమాల్లో ఉద్యమ సందేశాల్ని పంపడం ద్వారా ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు.
* 1967లో డీఎంకే రెండుగా చీలిపోయింది. అన్నాడీఎంకే పేరుతో ఎంజీఆర్ ప్రత్యేక పార్టీని తెచ్చారు. ఈ రెండు పార్టీల ప్రభావం రాష్ట్రమ్మీద ఎక్కువగా ఉందనే చెప్పాలి. తర్వాత జయలలిత తెరమీదకి వచ్చి ప్రభావం చూపిన మహిళానేతగా ఎదిగారు.
* రాష్ట్ర అభివృద్ధిలో ఎంతోమంది నేతలు తమదైన ముద్ర వేశారు. రాజాజీ, కామరాజ్ విద్యావ్యవస్థ వృద్ధి చెందడానికి తోడ్పడ్డారు. అన్నాదురై తమిళనాడులో బలమైన ఉద్యమనేతగా ఎదిగారు. కరుణానిధి సామాజిక వ్యవస్థ బలీయానికి తోడ్పడ్డారు. ఎంజీఆర్, జయలలిత సాధికారత కోసం కృషి చేశారు. ప్రస్తుతం కరుణానిధి కుమారుడు ఎం.కె.స్టాలిన్ ముఖ్యమంత్రిగా ప్రజాకర్షక పథకాలు అమలు చేస్తున్నారు.
* 2004లో సునామీ ప్రభావంతో 8 వేల మంది చనిపోయినట్లు అంచనాలున్నాయి. ఈ విషాదం నుంచి బయటపడి రాష్ట్రం మరింత పురోభివృద్ధి దిశగా కదిలింది. వాస్తవానికి 1990 నుంచే దేశంలోనే ఆర్థికంగా బలమైన రాష్ట్రంగా ఎదిగేందుకు ప్రయత్నాలు జరిగాయి.
* ప్రస్తుతం 180 దేశాల్లో తమిళులు విస్తరించారు. దేశంలో తమిళనాడు సాంకేతిక, పారిశ్రామిక, తయారీ తదితర రంగాల్లో తిరుగులేని ప్రగతిని సాధిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గవర్నర్ పదవి త్యజించడం మంచిదే: తమిళిసై
[ 28-03-2024]
తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడం మంచిదే అనిపిస్తోందని దక్షిణ చెన్నై భాజపా అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. కోయంబేడు శివాలయం నుంచి బుధవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడారు. -
రాష్ట్రంలో అగ్రనేతల సుడిగాలి ప్రచారం
[ 28-03-2024]
నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. ఎన్నికల కమిషన్ నుంచి అభ్యర్థుల అధికారిక ప్రకటనే మిగిలింది. వాటిని పట్టించుకోకుండా ముందే ప్రచారాన్ని మొదలుపెట్టాయి కూటమి పార్టీలు. తమ అభ్యర్థుల విజయం కోసం అగ్రనేతలు ప్రచారంలో దూసుకెళుతున్నారు. -
మెట్రో రెండోదశ మార్గంలో వసతుల కల్పనకు కసరత్తు
[ 28-03-2024]
మెట్రో రెండో దశ పనులు నగరంలో మూడు ప్రాంతాల నుంచి చురుగ్గా జరుగుతున్నాయి. ప్రయాణికులకు చక్కటి సేవలతో పాటు వసతుల కల్పనకు సీఎంఆర్ఎల్ ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతోంది. -
తిరువణ్ణామలైలో విజయ పతాకమెవరిది?
[ 28-03-2024]
తిరువణ్ణామలై ఆలయాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. పంచభూత లింగాల్లో అగ్నిలింగం ఇక్కడి ఉన్నాములై సమేత అరుణాచలేశ్వర్ ఆలయంలో ఉంది. ఆలయం సుమారు 1100 ఏళ్ల కిందట నిర్మితమైంది. -
88 సవర్ల నగలు, రూ.36 లక్షలు స్వాధీనం
[ 28-03-2024]
కాంచీపురంలో గతనెల జరిగిన నగల చోరీకి సంబంధించి 80 కేసుల్లో సంబంధం ఉన్న ఆంధ్ర వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాంచీపురం డీఎస్పీ మురళి తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. -
చేజారిన సెంటిమెంట్ స్థానం
[ 28-03-2024]
దిండుక్కల్ నియోజకవర్గంలో అన్నాడీఎంకే మాజీ మంత్రులు ఇద్దరు ఉన్నా.. వారిని పక్కన పెట్టేసి ఎస్డీపీఐకు టికెట్ కేటాయించడంతో కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
మళ్లీ అవకాశం ఇస్తారని నమ్ముతున్నా
[ 28-03-2024]
మధ్య చెన్నై నియోజకవర్గ ప్రజలు మళ్లీ తనకు అవకాశం కల్పిస్తారని నమ్ముతున్నట్లు డీఎంకే అభ్యర్థి దయానిధి మారన్ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన నామపత్రాన్ని షెనాయ్నగర్లోని కార్పొరేషన్ ప్రాంతీయ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో సమర్పించారు. -
నామినేషన్ దాఖలు చేసిన అన్నామలై
[ 28-03-2024]
భాజపా తరపున కోయంబత్తూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
వేరే చిహ్నంతో పోటీ: దురైవైగో
[ 28-03-2024]
బొంగరం గుర్తు దొరక్కపోతే వేరే చిహ్నంతో పోటీ చేస్తామని తిరుచ్చి ఎండీఎంకే అభ్యర్థి దురైవైగో అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడారు. గుర్తు కేటాయింపున వ్యవహారంలో ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. -
దేవేంద్ర కుల వెల్లలార్లకు ప్రత్యేక రిజర్వేషన్
[ 28-03-2024]
దేవేంద్ర కుల వెల్లలార్లకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తామని పీఎంకే మేనిఫెస్టోలో పేర్కొన్నారు. వ్యవస్థాపకుడు రామదాస్ బుధవారం చెన్నై టీనగర్లోని పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. -
పార్టీలు కొత్త గుర్తులతో పోటీ చేయాలి: సీమాన్
[ 28-03-2024]
నామ్ తమిళర్ కట్చి(ఎన్టీకే)కి జాతీయ మృగమైన పులిని తమ ఎన్నికల గుర్తుగా కేటాయించాలని కోరనున్నామని ఆ పార్టీ చీఫ్ కన్వీనర్ సీమాన్ తెలిపారు. చెన్నై ప్రెస్క్లబ్లో బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. -
చెన్నై సహా ఐదుచోట్ల ఎన్ఐఏ సోదాలు
[ 28-03-2024]
బెంగళూరులో బాంబు దాడి వ్యవహారమై రాష్ట్రంలో ఐదుచోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితులు చెన్నై ట్రిప్లికేన్లో నెల రోజులకి పైగా ఉండి కుట్ర పన్నిన నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం