2,500 పాఠశాలల్లో చెట్ల కిందే చదువులు: మంత్రి
రాష్ట్రంలో 2,500 పాఠశాలల్లో చెట్ల కిందనే విద్యార్థులు విద్యనభ్యసించే పరిస్థితిలో ఉన్నాయని మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యామొళి తెలిపారు. తిరుచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తిరుచ్చి, కరూర్, అరియలూర్,
విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి అన్బిల్ మహేష్
ఆర్కేనగర్, న్యూస్టుడే: రాష్ట్రంలో 2,500 పాఠశాలల్లో చెట్ల కిందనే విద్యార్థులు విద్యనభ్యసించే పరిస్థితిలో ఉన్నాయని మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యామొళి తెలిపారు. తిరుచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తిరుచ్చి, కరూర్, అరియలూర్, పెరంబలూర్, పుదుకోట్టై, దిండుక్కల్ తదితర జిల్లాలో విద్యాశాఖల సమీక్షా సమావేశం మంత్రి నేతృత్వంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...పాఠశాల విద్యాశాఖకు టీవీ చానల్ను గత పాలనలో తీసుకొచ్చారని తెలిపారు. దానిని మరింతగా అభివృద్ధి చేయాలని సమావేశంలో చర్చించామని చెప్పారు. రెండో టీవీ చానల్ కావాలని దానిని నిర్వహించేందుకు అధికారపూర్వక ఆదేశాలు జారీ చేశామన్నారు. 79 మంది దీని కోసం ధరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. అర్హత ప్రకారం 11 మందిని తీసుకొని ముగ్గురిని ఎంపిక చేస్తామన్నారు. ఇందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2,500 పాఠశాలల్లో చెట్ల కిందనే విద్యార్థులు చదువుకునే పరిస్థితిలో ఉన్నాయన్నారు. కొత్తభవనాలు, తరగతి గదులు, గోడలు నిర్మించేందుకు నిధులు కోరామని చెప్పారు. కొత్తగా 2,500 మంది ఉపాధ్యాయులు ఎంపికై ఉద్యోగంలో త్వరలో చేరనున్నారని తెలిపారు. అదనంగా అవసరమైన ఉపాధ్యాయుల కోసం టెట్ జరిపి ఉద్యోగాల్లో చేర్చుకుంటామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు శివశంకర్, రఘుపతి, అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నటుడు విజయ్ కుమారుడు కొత్త సినిమా.. హీరోగా కాదు!
[ 29-03-2024]
నటుడు విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ 2009లో విడుదలైన ‘వేట్టైక్కారన్’ చిత్రంలోని ‘నా అడిచ్చా తంగమాట్ట’ పాటలో తన డ్యాన్స్ ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. -
అంతు చిక్కని ఓటరు నాడి!
[ 29-03-2024]
ఎన్నికల ఫలితాలు దేశమంతా ఒకలా ఉంటే.. తమిళనాడులో మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి. లోక్సభ ఎన్నికల్లో ఓ తరహా తీర్పు, అసెంబ్లీ ఎన్నికల్లో మరో రకమైన తీర్పు ఇక్కడే కనిపిస్తుంటుంది. -
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
[ 29-03-2024]
రామనాథపురంలో ఐదుగురు ఓ పన్నీర్సెల్వంల నామినేషన్లు ఆమోదించారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కృతుడైన మాజీ సీఎం ఓ.పన్నీర్సెల్వం అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పునరుద్ధరణ కమిటీ పేరుతో పనిచేస్తున్నారు. -
ప్రాణస్నేహితుల్లా మెలిగాం
[ 29-03-2024]
డీఎంకేపై వ్యరేతికతతో పార్టీలో చేరిన గణేశమూర్తి ఎంపీ అయ్యారని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో గుర్తు చేశారు. ఆయన కోవై విమానాశ్రయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. -
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె శివగంగైలో నామినేషన్
[ 29-03-2024]
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె స్వతంత్ర అభ్యర్థిగా శివగంగై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు నామినేషన్ దాఖలు చేయడం కలకలం సృష్టించింది. -
ప్రధాని నాటకాలు ప్రజలకు తెలుసు
[ 29-03-2024]
ప్రధాని మోదీ ఎన్నికల నాటకాలు ప్రజలకు తెలుసని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్లో డీఎంకే ఎన్నికల ప్రచార సమావేశం బుధవారం రాత్రి జరిగింది. -
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదు : కనిమొళి
[ 29-03-2024]
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదని డీఎంకే ఎంపీ కనిమొళి పేర్కొన్నారు. కరూర్ వెంగమేడు అన్నా విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జ్యోతిమణికి మద్దతుగా గురువారం ఆమె ప్రచారం చేశారు. -
కవిన్ డబ్బింగ్ పూర్తి
[ 29-03-2024]
బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి ‘టాటా’ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన నటుడు కవిన్. ఆ చిత్రం విజయం తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఇళనుడన్ దర్శకత్వంలోని ‘స్టార్’ చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్