logo

విద్యుత్తు టవర్‌ ఎక్కిన వృద్ధుడు

తిరుపత్తూర్‌ జిల్లా నాట్రంపల్లి సమీప గుండురెడ్డిమేడు పరిధికి చెందిన సామ్రాజ్‌ భార్య లక్ష్మి. వీరి కుమారులు విజయన్‌(60), పాండురంగన్‌(64). సామ్రాజ్‌ కొద్ది సంవత్సరాల క్రితం మృతి చెందగా కొద్ది రోజుల క్రితం లక్ష్మి చనిపోయింది.

Published : 18 Aug 2022 00:44 IST

టవరుపై విజయన్‌

వేలూర్‌, న్యూస్‌టుడే: తిరుపత్తూర్‌ జిల్లా నాట్రంపల్లి సమీప గుండురెడ్డిమేడు పరిధికి చెందిన సామ్రాజ్‌ భార్య లక్ష్మి. వీరి కుమారులు విజయన్‌(60), పాండురంగన్‌(64). సామ్రాజ్‌ కొద్ది సంవత్సరాల క్రితం మృతి చెందగా కొద్ది రోజుల క్రితం లక్ష్మి చనిపోయింది. పాండురంగన్‌ కుమారుడు అరుల్‌ విదేశాల్లో పనిచేస్తూ లక్ష్మి మృతి చెందిన విషయం తెలిసి సొంత ఊరుకు వచ్చాడు. లక్ష్మికి చెందిన 12 సవర్ల బంగారు నగలు, రూ.40 వేల నగదు తీసుకెళ్లాడు. అవి తనకే చెందాలని  అరుల్‌ వద్ద అడిగాడు. దీంతో ఇరువురి మధ్య గొడవలు జరిగాయి. మనస్తాపానికి గురైన విజయన్‌ బుధవారం ఉదయం గుండురెడ్డిమేడు పరిధిలోని విద్యుత్తు టవర్‌ను ఎక్కాడు. నగలు, నగదు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించాడు. స్థానికులు ఈ విషయాన్ని నాట్రంపల్లి అగ్నిమాక సిబ్బందికి తెలిపారు. అక్కడికి చేరుకొని విజయన్‌ను సమాధానపరడంతో కిందకు దిగి వచ్చాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని