కలిసి పని చేద్దాం రండి..!
అన్నాడీఎంకేలో కలిసి పని చేద్దామని ఎడప్పాడి పళనిస్వామికి అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్సెల్వం పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి చెన్నైలో అతని నివాసంలో పన్నీర్సెల్వం విలేకర్లతో మాట్లాడుతూ... పార్టీలో తమ మధ్య కొన్ని అభిప్రాయ బేధాలు వచ్చాయని, దీంతో పార్టీలో అసాధారణ పరిస్థితి నెలకొందని తెలిపారు.
ఎడప్పాడికి ఓపీఎస్ పిలుపు
తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతున్న ఓపీఎస్
సైదాపేట, న్యూస్టుడే: అన్నాడీఎంకేలో కలిసి పని చేద్దామని ఎడప్పాడి పళనిస్వామికి అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్సెల్వం పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి చెన్నైలో అతని నివాసంలో పన్నీర్సెల్వం విలేకర్లతో మాట్లాడుతూ... పార్టీలో తమ మధ్య కొన్ని అభిప్రాయ బేధాలు వచ్చాయని, దీంతో పార్టీలో అసాధారణ పరిస్థితి నెలకొందని తెలిపారు. అభిప్రాయ బేధాలు మరిచి పార్టీ మంచి కోసం అందరితో కలిసి పని చేయడమే తమ వైఖరని చెప్పారు. అన్నింటినీ పక్కన పెట్టి పార్టీ విజయమే లక్ష్యంగా పని చేద్దామని ఎడప్పాడికి సూచించారు. ఆ సమయంలో ఎడప్పాడి పళనిస్వామిని ప్రియమైన సోదరుడని పన్నీర్ పదేపదే సంబోధించడం గమనార్హం. మరోవైపు శశికళ, దినకరన్లతో కలిసి పని చేసే అవకాశం ఉందా? అని అడిగిన విలేకర్ల ప్రశ్నకు బదులుగా.. ఎవరైనా పార్టీ నియమ నిబంధనలకు లోబడి పని చేస్తే వారిని పార్టీలో చేర్చుకుంటామన్నారు. అందులో శశికళ, దినకరన్లకు మినహాయింపు లేదన్నారు. అందరం అన్నాడీఎంకేలో కలిసి పని చేయాలన్నదే తమ అభిప్రాయమని స్పష్టం చేశారు.
ఆ ప్రసక్తే లేదు: పళనిస్వామి
ఓపీఎస్తో కలిసే ప్రసక్తే లేదని శాసనసభ ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి తెలిపారు. పళనిస్వామి నేతృత్వంలో జులై 11న జరిగిన సర్వసభ్య సమావేశం చెల్లదని హైకోర్టు బుధవారం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ ఎడప్పాడి తరఫున అప్పీలుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఓపీఎస్ విలేకర్లతో మాట్లాడుతూ... పార్టీని కైవసం చేసుకునేందుకు యత్నించటమే ప్రస్తుతం అన్నాడీఎంకేలో నెలకొన్న పరిస్థితులకు కారణమని తెలిపారు. సర్వసభ్య సభ్యుల చేతే సమన్వయకర్త, సంయుక్త సమన్వయకర్తల పదవులు సృష్టించబడ్డాయన్నారు. ప్రధాన కార్యదర్శికి సమానంగా ద్వంద్వ పదవులు తీసుకొచ్చి పార్టీలో అన్నాడీఎంకే చట్ట విధానాల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. 2663 మంది సభ్యులు పార్టీ సంస్థాగత ఎన్నికల ద్వారా ఎన్నుకున్నవారన్నారు. ఏక నాయకత్వం కావాలని కార్యకర్తలు, నిర్వాహకులు కోరారని చెప్పారు. రౌడీల ద్వారా పార్టీ ప్రధాన కార్యాలయం, మా తరఫు వారిపై ఓపీఎస్ దాడి చేశారన్నారు. అన్న ఓపీఎస్, నేను విడిపోయామని, 2017లో ఒక్కటయ్యామని పేర్కొన్నారు. సర్వసభ్య సమావేశానికి మేము పిలుపునిచ్చినప్పుడు నిరాకరించిన ఓపీఎస్ ఎందుకు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారని ప్రశ్నించారు. పార్టీ ఉన్నత బాధ్యతల్లో ఉన్న ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పార్టీని ఎలా నడపుతామని తెలిపారు. కలిసి పని చేద్దామన్న ఓపీఎస్ పిలుపును ఎడప్పాడి పళనిస్వామి వర్గం నిరాకరించింది.
కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా అప్పీలు
అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం చెల్లదన్న మద్రాసు హైకోర్టు ప్రత్యేక న్యాయమూర్తి తీర్పును వ్యతిరేకిస్తూ ఎడప్పాడి పళనిస్వామి తరఫున అప్పీలు చేశారు. చెన్నై వానగరంలో జులై 11న జరిగిన సర్వసభ్య సమావేశం చెల్లదని బుధవారం ప్రత్యేక న్యాయమూర్తి తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దురైస్వామి, జస్టిస్ సుందరమోహన్ ధర్మాసనం ముందు ఈపీఎస్ తరఫున అప్పీలు పిటిషన్ గురువారం దాఖలు చేశారు. ఈ పిటిషన్ను సోమవారం విచారణకు స్వీకరించనున్నట్లు న్యాయమూర్తులు తెలిపారు.
ఓమందూరార్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని వినాయక ఆలయంలో పూజలు చేస్తున్న పన్నీర్సెల్వం
ఇద్దరికీ చిక్కులు తెచ్చిన ఆదేశాలు
సర్వసభ్య సభ్యుల్లో ఐదింట ఒక వంతు మంది లేఖ సమర్పించి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని కోరితే సమన్వయకర్తో, సంయుక్త సమన్వయకర్తో నిరాకరించకూడదని హైకోర్టు తీర్పులో ఉంది. ఒకవేళ ఇందులో సమస్య ఉంటే కమిషనర్ను నియమించాలని కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. పళనిస్వామి వర్గం దీన్ని అమలు చేయాలనుకుంటే పన్నీర్కు సమస్యలు తప్పవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 2 వేల మందికిపైగా సర్వసభ్య సభ్యులు ఎడప్పాడికి మద్దతుగా ఉన్నారు. వారితో సమావేశం ఏర్పాటు చేయాలని తనతోపాటు ఓపీఎస్కు ఆహ్వానం పంపించి పన్నీర్ను చిక్కుల్లో పడేయొచ్చని భావిస్తున్నారు. దీనికి పన్నీర్ నిరాకరిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించి కమిషనర్ను నియమించడం ద్వారా సమావేశం జరిపే అవకాశం కూడా తీర్పులో ఉందని గుర్తుచేస్తున్నారు. తీర్పు వ్యతిరేకంగా రావడంతో ఇప్పటికే పళనిస్వామి వర్గంలో నిరాశ నెలకొంది.
‘కార్యాలయం’ కేసులో స్టే నిరాకరణ
సైదాపేట, న్యూస్టుడే: అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయ తాళాలను ఎడప్పాడి పళనిస్వామికి అప్పగించాలన్న మద్రాసు హైకోర్టు ఆదేశాలకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అన్నాడీఎంకే కార్యాలయానికి వేసిన సీలు తొలగించి, ఆ తాళాలు ఎడప్పాడి పళనిస్వామి దగ్గర అప్పగించాలన్న హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా పన్నీర్సెల్వం దాఖలు చేసిన అప్పీలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ఎదుట గురువారం విచారణకు వచ్చింది. విచారించిన ధర్మాసనం సమగ్ర దర్యాప్తు చేయకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం కుదరదని, కేసును వారం తర్వాత విచారిస్తామని ఆదేశించారు. ఇంకా ప్రతివాదులు, సీలు వేసిన రెవెన్యూశాఖకు బదులివ్వాలని సుప్రీం నోటీసులు పంపింది.
నిస్వార్థపరులు ఆహ్వానిస్తారు: టీటీవీ
విల్లివాక్కం, న్యూస్టుడే: ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నవారు, నిస్వార్థపరులు పన్నీర్సెల్వం అభిప్రాయాన్ని ఆహ్వానిస్తారని ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం తన ట్విట్టర్లో.. డీఎంకేని కూల్చడానికి అమ్మ మద్దతుదారులంతా కలిసి పనిచేయాలని ఓ పన్నీర్సెల్వం పిలుపునిచ్చారని గుర్తు చేశారు. స్వార్థం తలకెక్కి పదవీ వ్యామోహంతో ఉన్న ఓ ముఠా మంచి విషయాలను ఆమోదించదన్నది తెలిసిందేనన్నారు. ఎంజీఆర్, జయలలిత కాలం నుంచి పార్టీ కోసం సేవలందించిన శశికళ, దినకరన్ సహా అందరూ కలిసి పనిచేయాలని ఓపీఎస్ పేర్కొనడంలో దురుద్దేశం లేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళల పాలిట రక్తపోటు
[ 25-04-2024]
అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి. -
ఆధారాలున్నా ఓటరు పేర్లు గల్లంతు
[ 25-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బర్డ్ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక బృందాలు
[ 25-04-2024]
తమిళనాడులో బర్డ్ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. -
జూన్లో కొత్త రోడ్లు
[ 25-04-2024]
కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
తమిళ అభిమానులకు కృతజ్ఞతలు
[ 25-04-2024]
ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష
[ 25-04-2024]
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్ బిస్కెట్ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. -
మత ఘర్షణలు సృష్టించేలా ప్రధాని ప్రచారం
[ 25-04-2024]
మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
మోదీ పాలనలో మైనారిటీలు ఇబ్బంది పడలేదు: ఓ పన్నీర్సెల్వం
[ 25-04-2024]
మోదీ పాలనలో మైనారిటీ ప్రజలు ఇబ్బంది పడలేదని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం తెలిపారు. మదురై తిరుప్పరకుండ్రం సుబ్రమణిస్వామి ఆలయంలో మంగళవారం మురుగన్ను దర్శించుకున్నారు. -
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?
[ 25-04-2024]
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. -
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ చర్యలు: స్టాలిన్
[ 25-04-2024]
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. -
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
[ 25-04-2024]
శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
[ 25-04-2024]
హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!