ఐఐటీఎం ఇంటర్న్షిప్లో పెరిగిన అవకాశాలు
2022-23 బ్యాచ్ విద్యార్థులకు ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ మద్రాస్ (ఐఐటీఎం) ప్రాంగణ నియామకంలో మొదటి రోజు జరిగిన ఇంటర్న్షిప్లో 32 శాతం ఆధికంగా అవకాశాలు దక్కాయి. ఈ నెల 6, 13 తేదీల్లో రెండు రోజుల పాటు ఇంటర్న్షిప్ జరిగిందని ఐఐటీ గురువారం
ఇంటర్న్షిప్లో పాల్గొన్న విద్యార్థులు
వడపళని, న్యూస్టుడే: 2022-23 బ్యాచ్ విద్యార్థులకు ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ మద్రాస్ (ఐఐటీఎం) ప్రాంగణ నియామకంలో మొదటి రోజు జరిగిన ఇంటర్న్షిప్లో 32 శాతం ఆధికంగా అవకాశాలు దక్కాయి. ఈ నెల 6, 13 తేదీల్లో రెండు రోజుల పాటు ఇంటర్న్షిప్ జరిగిందని ఐఐటీ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. మొదటిసారి ఆన్లైన్లో (హైబ్రిడ్ మోడ్), ప్రత్యక్ష విధానంలో ఇంటర్వ్యూలు జరిగాయి. ఈ విధానంలో కెనడాకు చెందిన విద్యార్థి కూడా పాల్గొనడం గమనార్హం. యూఎస్, యూకే, హాంగ్కాంగ్, సింగపూర్, నెదర్లాండ్స్ వంటి దేశాల నుంచి ఉన్నత ప్రతినిధులు విచ్చేసి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఏడు సంస్థల నుంచి 15 అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశాలు దక్కడంతో 48 శాతం వరకు పెరిగింది. ఇంటర్న్షిప్ కోసం ఐఐటీఎంకు విచ్చేసిన సంస్థల సంఖ్య 28 శాతానికి పెరిగింది. ఇంటర్న్షిప్ విభాగ అడ్వైజర్, ఆచార్యులు పి.మురుగవేల్ మాట్లాడుతూ.. ‘ప్రొఫెషనల్ ఇంటర్న్షిప్ విద్యార్థుల జీవితంలో ఓ అంతర్భాగం’ లాంటిదన్నారు. టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ 40, అమెరికన్ ఎక్స్ప్రెస్ 20, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ 17, గోల్డ్మెన్ శాక్స్ 16 మందికి అవకాశాలు కల్పించాయి. విద్యార్థి అకడమిక్ అఫైర్స్ కార్యదర్శి, టీబీ రామ్కమల్ ఇంటర్న్షిప్ డ్రైవ్ను సమన్వయం చేయడంలో ఐఐటీఎం విద్యార్థి బృందం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నటుడు విజయ్ కుమారుడు కొత్త సినిమా.. హీరోగా కాదు!
[ 29-03-2024]
నటుడు విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ 2009లో విడుదలైన ‘వేట్టైక్కారన్’ చిత్రంలోని ‘నా అడిచ్చా తంగమాట్ట’ పాటలో తన డ్యాన్స్ ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. -
అంతు చిక్కని ఓటరు నాడి!
[ 29-03-2024]
ఎన్నికల ఫలితాలు దేశమంతా ఒకలా ఉంటే.. తమిళనాడులో మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి. లోక్సభ ఎన్నికల్లో ఓ తరహా తీర్పు, అసెంబ్లీ ఎన్నికల్లో మరో రకమైన తీర్పు ఇక్కడే కనిపిస్తుంటుంది. -
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
[ 29-03-2024]
రామనాథపురంలో ఐదుగురు ఓ పన్నీర్సెల్వంల నామినేషన్లు ఆమోదించారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కృతుడైన మాజీ సీఎం ఓ.పన్నీర్సెల్వం అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పునరుద్ధరణ కమిటీ పేరుతో పనిచేస్తున్నారు. -
ప్రాణస్నేహితుల్లా మెలిగాం
[ 29-03-2024]
డీఎంకేపై వ్యరేతికతతో పార్టీలో చేరిన గణేశమూర్తి ఎంపీ అయ్యారని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో గుర్తు చేశారు. ఆయన కోవై విమానాశ్రయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. -
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె శివగంగైలో నామినేషన్
[ 29-03-2024]
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె స్వతంత్ర అభ్యర్థిగా శివగంగై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు నామినేషన్ దాఖలు చేయడం కలకలం సృష్టించింది. -
ప్రధాని నాటకాలు ప్రజలకు తెలుసు
[ 29-03-2024]
ప్రధాని మోదీ ఎన్నికల నాటకాలు ప్రజలకు తెలుసని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్లో డీఎంకే ఎన్నికల ప్రచార సమావేశం బుధవారం రాత్రి జరిగింది. -
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదు : కనిమొళి
[ 29-03-2024]
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదని డీఎంకే ఎంపీ కనిమొళి పేర్కొన్నారు. కరూర్ వెంగమేడు అన్నా విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జ్యోతిమణికి మద్దతుగా గురువారం ఆమె ప్రచారం చేశారు. -
కవిన్ డబ్బింగ్ పూర్తి
[ 29-03-2024]
బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి ‘టాటా’ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన నటుడు కవిన్. ఆ చిత్రం విజయం తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఇళనుడన్ దర్శకత్వంలోని ‘స్టార్’ చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు