తమిళ విద్వాంసుడు నెల్లై కణ్ణన్ కన్నుమూత
ప్రముఖ తమిళ విద్యాంసుడు, సాహితీవేత్త నెల్లై కణ్ణన్ (77) తిరునెల్వేలి టౌన్ అమ్మన్ సన్నది వీధిలో ఉన్న తన ఇంట్లో వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా గురువారం మృతిచెందారు. రైతు కుటుంబలో పుట్టిన ఆయన తమిళంపై ప్రత్యేకంగా ఆసక్తి చూపేవారు. భారతీ పాటలు, తమిళ సాహిత్య గ్రంథాల్లో మంచి ప్రావీణ్యం ఉంది.
నెల్లై కణ్ణన్ భౌతికకాయం
తిరునెల్వేలి, న్యూస్టుడే: ప్రముఖ తమిళ విద్యాంసుడు, సాహితీవేత్త నెల్లై కణ్ణన్ (77) తిరునెల్వేలి టౌన్ అమ్మన్ సన్నది వీధిలో ఉన్న తన ఇంట్లో వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా గురువారం మృతిచెందారు. రైతు కుటుంబలో పుట్టిన ఆయన తమిళంపై ప్రత్యేకంగా ఆసక్తి చూపేవారు. భారతీ పాటలు, తమిళ సాహిత్య గ్రంథాల్లో మంచి ప్రావీణ్యం ఉంది. అనర్గళంగా మాట్లాడే వ్యక్తి కావడంతో పలు చర్చల్లో పాల్గొనే వారు. కాంగ్రెస్లో చిన్నవయస్సు నుంచే పనిచేశారు. టీఎన్సీసీ ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యాక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం జరగనున్నాయి. నెల్లై కణ్ణన్ మృతదేహానికి అన్నాడీఎంకే కార్యదర్శి సుధా పరమశివన్, జిల్లా ప్రిసిడీయం ఛైర్మన్ భరణి శంకరలింగం తదితర నేతలు సంతాపం తెలిపారు.
సీఎం సంతాపం..
చెన్నై: నెల్లై కణ్ణన్ మృతికి ముఖ్యమంత్రి స్టాలిన్ సంతాపం తెలిపారు. రాష్ట్రంలోని సీనియర్ నేతలతో సన్నిహితంగా మెలిగే ఆయన మృతికి ఆవేదన చెందుతున్నానని తెలిపారు. గత ఏడాది వీసీకే అందించిన కామరాజర్ కదిర్ పురస్కారం పొందిన సందర్భంగా వేదికపై తనతో ఆప్యాయంగా మాట్లాడారని, ఇళంగోవడిగళ్ పురస్కారంతో ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం సత్కరించిందని గుర్తు చేశారు. ఆయన్ను కోల్పోయి బాధపడుతున్న కుటుంబానికి సానుభూతి తెలిపారు.
నివాళులర్పిస్తున్న మంత్రులు
తిరునెల్వేలి: నెల్లై కణ్ణన్ భౌతికకాయానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు రామచంద్రన్, ఆర్ఎస్ రాజకన్నప్పన్, మాజీ స్పీకరు ఆవుడైయప్పన్, జిల్లా కలెక్టరు విష్ణు, మేయర్ శరవణన్, డిప్యూటీ మేయర్ రాజు స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అంజలి ఘటించారు.
సీపీఎం తరఫున..: నెల్లై కణ్ణన్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్ తెలిపారు. 60ఏళ్లకు పైగా సాహిత్య వేదికలపై ఉపన్యాసాలు చేశారని, న్యాయనిర్ణేతగా వ్యవహరించారని పేర్కొన్నారు. వామపక్షాలపై అపార గౌరవం కలిగిన ఆయన సీపీఎం నిర్వహించిన పలు సదస్సుల్లో పాల్గొన్నారని తెలిపారు. మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారని పేర్కొన్నారు. ఆయన మృతి తీరని లోటు అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతలు ఏం చేస్తున్నారో!
[ 24-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఫలితాలు వచ్చి ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేసేవరకు ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుంది. అప్పటి వరకు రాజకీయ నేతల సందడి పెద్దగా ఉండకపోవచ్చు. -
అత్యాశతోనే భాజపాలోకి విజయధరణి
[ 24-04-2024]
అత్యాశతోనే విజయధరణి భాజపాలో చేరారని తమిళనాడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు హసీనా సయ్యద్ ఆరోపించారు. దిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఆమెకు సోమవారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో పార్టీ మహిళా విభాగం తరఫున ఘనస్వాగతం పలికారు. -
ఓట్ల కోసం మతవిద్వేష ప్రచారాలు తగదు
[ 24-04-2024]
రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఓట్ల కోసం మత విద్వేష ప్రసంగాలు చేయరాదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. -
కన్నగికి ప్రభుత్వ నివాళి
[ 24-04-2024]
తమిళుల సాంస్కృతిక చిహ్నంగా విరాజిల్లుతున్న కన్నగి విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నివాళులర్పించింది. -
పుస్తకాలను ప్రేమించండి : ముఖ్యమంత్రి పిలుపు
[ 24-04-2024]
పుస్తకాలు చదవాలని, ప్రేమించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఆయన ఓ సందేశ ప్రకటన విడుదల చేశారు. -
వర్షపాతం పెరిగినా భూమిలో నీరేది!
[ 24-04-2024]
ఈ ఏడాది రాష్ట్రంలో వర్షపాతం పెరిగినా భూమిలో నీరు మాత్రం అప్పుడే అడుగంటింది. చెన్నైలో రుతుపవనాల వర్షాల తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో భూగర్భ జలాలు 8 అడుగుల మేర తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి
[ 24-04-2024]
పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని తమిళనాడు ప్రజా సంబంధాల శాఖ తెలిపింది. -
‘ఇంగ నాన్తాన్ కింగు’ మోషన్ పోస్టర్ విడుదల
[ 24-04-2024]
ఆనంద్ నారాయణ్ దర్శకత్వంలో నటుడు సంతానం నటించిన చిత్రం ‘ఇంగ నాన్తాన్ కింగు’. కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు ఎళిచ్చుర్ అరవిందన్. గోపురం ఫిలిం ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రంలో మనోబాలా, తంబి రామయ్య, మునిశ్కాంత్, బాల శరవణన్ తదితరులు నటించారు. -
అన్నాడీఎంకే నేత ఎస్టేట్లో వన్యప్రాణుల వేట
[ 24-04-2024]
అన్నాడీఎంకే నేత సజీవన్కు చెందిన సిల్వర్ క్లైవ్డ్ ఎస్టేట్ కూడలూర్లో ఉంది. ఇక్కడ వన్యప్రాణులను వేటాడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఎస్టేట్లో పనిచేస్తున్న ఫైజల్, సాబు జాకబ్ అనే వ్యక్తుల వద్ద దర్యాప్తు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్