బాలికకు మెరుగైన చికిత్స అందిస్తాం: మంత్రి నాజర్
అరుదైన ముఖ వైకల్యంతో బాధపడుతున్న బాలికకు చికిత్స అందించడానికి 9 వైద్య బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి నాజర్ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి వీరాపురానికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారికి అరుదైన ముఖ వైకల్యంతో బాధపడుతోంది. ఇందుకు సంబంధించి వార్తా పత్రికల్లో వార్త ప్రచురితమైంది.
బాలికను పరామర్శిస్తున్న నాజర్
ప్యారిస్, న్యూస్టుడే: అరుదైన ముఖ వైకల్యంతో బాధపడుతున్న బాలికకు చికిత్స అందించడానికి 9 వైద్య బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి నాజర్ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి వీరాపురానికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారికి అరుదైన ముఖ వైకల్యంతో బాధపడుతోంది. ఇందుకు సంబంధించి వార్తా పత్రికల్లో వార్త ప్రచురితమైంది. దీంతో బాధిత బాలికను జిల్లా కలెక్టరు అల్ఫిజాన్వర్గీస్ కలిశారు. బాలికకు వైద్య చికిత్స ఖర్చులు భరించడానికి సిద్ధంగా ఉన్నట్లు, చికిత్స ముగిసిన తరువాత బాలిక కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఇల్లు కేటాయిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సకు చేరిన బాలికను మంత్రి నాజర్, కలెక్టరు అల్ఫిజాన్ వర్గీస్, ఎమ్మెల్యే సుదర్శనం తదితరులు పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. బాలిక వేదనను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి చికిత్స అందించడానికి చర్యలు చేపట్టారన్నారు. ప్రస్తుతం బాలికకు కలైజ్ఞర్ బీమా పథకం కింద అన్ని వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారన్నారు. ఇందుకుగాను ప్రత్యేకంగా తొమ్మిది వైద్య బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. త్వరలో బాలిక కోలుకుంటుందని, బాలిక తల్లిదండ్రులకు ఉద్యోగం, ఉండేందుకు స్థలం కేటాయించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతు చిక్కని ఓటరు నాడి!
[ 29-03-2024]
ఎన్నికల ఫలితాలు దేశమంతా ఒకలా ఉంటే.. తమిళనాడులో మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి. లోక్సభ ఎన్నికల్లో ఓ తరహా తీర్పు, అసెంబ్లీ ఎన్నికల్లో మరో రకమైన తీర్పు ఇక్కడే కనిపిస్తుంటుంది. -
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
[ 29-03-2024]
రామనాథపురంలో ఐదుగురు ఓ పన్నీర్సెల్వంల నామినేషన్లు ఆమోదించారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కృతుడైన మాజీ సీఎం ఓ.పన్నీర్సెల్వం అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పునరుద్ధరణ కమిటీ పేరుతో పనిచేస్తున్నారు. -
ప్రాణస్నేహితుల్లా మెలిగాం
[ 29-03-2024]
డీఎంకేపై వ్యరేతికతతో పార్టీలో చేరిన గణేశమూర్తి ఎంపీ అయ్యారని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో గుర్తు చేశారు. ఆయన కోవై విమానాశ్రయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. -
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె శివగంగైలో నామినేషన్
[ 29-03-2024]
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె స్వతంత్ర అభ్యర్థిగా శివగంగై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు నామినేషన్ దాఖలు చేయడం కలకలం సృష్టించింది. -
ప్రధాని నాటకాలు ప్రజలకు తెలుసు
[ 29-03-2024]
ప్రధాని మోదీ ఎన్నికల నాటకాలు ప్రజలకు తెలుసని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్లో డీఎంకే ఎన్నికల ప్రచార సమావేశం బుధవారం రాత్రి జరిగింది. -
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదు : కనిమొళి
[ 29-03-2024]
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదని డీఎంకే ఎంపీ కనిమొళి పేర్కొన్నారు. కరూర్ వెంగమేడు అన్నా విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జ్యోతిమణికి మద్దతుగా గురువారం ఆమె ప్రచారం చేశారు. -
కవిన్ డబ్బింగ్ పూర్తి
[ 29-03-2024]
బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి ‘టాటా’ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన నటుడు కవిన్. ఆ చిత్రం విజయం తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఇళనుడన్ దర్శకత్వంలోని ‘స్టార్’ చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం