తిరుచ్చెందూర్ ఆలయాభివృద్ధికి ప్రాధాన్యం
తిరుమలకు దీటుగా తిరుచ్చెందూర్ ఆలయాన్ని తీర్చిదిద్దేందుకు పనులు ప్రారంభమయ్యాయని దేవదాయశాఖ మంత్రి శేఖర్బాబు తెలిపారు. తూత్తుకుడి జిల్లా శ్రీవైకుంఠం సమీపంలోని ఆళ్వార్ తిరునగరి, ఆదినాథర్ ఆళ్వార్ ఆలయాలలో ఆదినాయకి అనే ఏనుగు, తిరుకొళ్లూర్ వైద్దమానిది ఆలయంలో కుముదవల్లి అనే ఏనుగు, దేవర్ప్రాణ ఆలయంలో లక్ష్మి అనే ఏనుగు ఉన్నాయి.
మంత్రి శేఖర్బాబు
ఆలయంలో పరిశీలిస్తున్న మంత్రులు శేఖర్బాబు
ఆర్కేనగర్, న్యూస్టుడే: తిరుమలకు దీటుగా తిరుచ్చెందూర్ ఆలయాన్ని తీర్చిదిద్దేందుకు పనులు ప్రారంభమయ్యాయని దేవదాయశాఖ మంత్రి శేఖర్బాబు తెలిపారు. తూత్తుకుడి జిల్లా శ్రీవైకుంఠం సమీపంలోని ఆళ్వార్ తిరునగరి, ఆదినాథర్ ఆళ్వార్ ఆలయాలలో ఆదినాయకి అనే ఏనుగు, తిరుకొళ్లూర్ వైద్దమానిది ఆలయంలో కుముదవల్లి అనే ఏనుగు, దేవర్ప్రాణ ఆలయంలో లక్ష్మి అనే ఏనుగు ఉన్నాయి. ఈ ఏనుగులు ఉత్సవాల సమయాల్లో పాల్గొంటాయి. ఈ నేపథ్యంలో ఈ ఏనుగులను సంరక్షించేందుకు శ్రీవైకుంఠం వద్ద ఆళ్వార్తోప్పు ఏకాంత లింగేశ్వరర్స్వామి ఆలయానికి సొంతమైన స్థలంలో ఏనుగుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇందులో టీవీఎస్ కంపెనీ శ్రీనివాస సేవా ఛారిటబుల్ ట్రస్టు తరఫున రూ.86 లక్షల వ్యయంతో ఏనుగులు ఉండేందుకు, స్నానం చేసేందుకు ప్రత్యేకంగా స్థలం కేటాయించారు. ఈ ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని శుక్రవారం మంత్రి శేఖర్బాబు ప్రారంభించారు. కేటాయించిన స్థలం చిన్నదిగా ఉండడంతో విస్తరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఏకాంతలింగేశ్వరుని ఆయన దర్శించుకున్నారు. అనంతరం తిరుచ్చెందూర్ ఆలయంలో మంత్రులు శేఖర్బాబు, అనితారాధాకృష్ణన్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శేఖర్బాబు విలేకరులతో మాట్లాడుతూ... తిరుచ్చెందూర్ ఆలయాన్ని తిరుమలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ సహకారంతో రూ.300 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్ పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కులశేఖరపట్టిణం ముత్తారమ్మన్ ఆలయంలో జరిగే దసరా ఉత్సవాల సందర్భంగా ముందస్తు ఏర్పాట్ల గురించి చర్చించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతలు ఏం చేస్తున్నారో!
[ 24-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఫలితాలు వచ్చి ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేసేవరకు ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుంది. అప్పటి వరకు రాజకీయ నేతల సందడి పెద్దగా ఉండకపోవచ్చు. -
అత్యాశతోనే భాజపాలోకి విజయధరణి
[ 24-04-2024]
అత్యాశతోనే విజయధరణి భాజపాలో చేరారని తమిళనాడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు హసీనా సయ్యద్ ఆరోపించారు. దిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఆమెకు సోమవారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో పార్టీ మహిళా విభాగం తరఫున ఘనస్వాగతం పలికారు. -
ఓట్ల కోసం మతవిద్వేష ప్రచారాలు తగదు
[ 24-04-2024]
రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఓట్ల కోసం మత విద్వేష ప్రసంగాలు చేయరాదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. -
కన్నగికి ప్రభుత్వ నివాళి
[ 24-04-2024]
తమిళుల సాంస్కృతిక చిహ్నంగా విరాజిల్లుతున్న కన్నగి విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నివాళులర్పించింది. -
పుస్తకాలను ప్రేమించండి : ముఖ్యమంత్రి పిలుపు
[ 24-04-2024]
పుస్తకాలు చదవాలని, ప్రేమించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఆయన ఓ సందేశ ప్రకటన విడుదల చేశారు. -
వర్షపాతం పెరిగినా భూమిలో నీరేది!
[ 24-04-2024]
ఈ ఏడాది రాష్ట్రంలో వర్షపాతం పెరిగినా భూమిలో నీరు మాత్రం అప్పుడే అడుగంటింది. చెన్నైలో రుతుపవనాల వర్షాల తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో భూగర్భ జలాలు 8 అడుగుల మేర తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి
[ 24-04-2024]
పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని తమిళనాడు ప్రజా సంబంధాల శాఖ తెలిపింది. -
‘ఇంగ నాన్తాన్ కింగు’ మోషన్ పోస్టర్ విడుదల
[ 24-04-2024]
ఆనంద్ నారాయణ్ దర్శకత్వంలో నటుడు సంతానం నటించిన చిత్రం ‘ఇంగ నాన్తాన్ కింగు’. కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు ఎళిచ్చుర్ అరవిందన్. గోపురం ఫిలిం ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రంలో మనోబాలా, తంబి రామయ్య, మునిశ్కాంత్, బాల శరవణన్ తదితరులు నటించారు. -
అన్నాడీఎంకే నేత ఎస్టేట్లో వన్యప్రాణుల వేట
[ 24-04-2024]
అన్నాడీఎంకే నేత సజీవన్కు చెందిన సిల్వర్ క్లైవ్డ్ ఎస్టేట్ కూడలూర్లో ఉంది. ఇక్కడ వన్యప్రాణులను వేటాడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఎస్టేట్లో పనిచేస్తున్న ఫైజల్, సాబు జాకబ్ అనే వ్యక్తుల వద్ద దర్యాప్తు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం