115 మంది ఖైదీల విడుదల
అన్నా జయంతి, 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్రంలో 115 మంది ఖైదీలను విడుదల చేసినట్లు జైలుశాఖ తెలిపింది. పదేళ్లకుపైగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను నిబంధనల ప్రకారం
ప్యారిస్, న్యూస్టుడే: అన్నా జయంతి, 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్రంలో 115 మంది ఖైదీలను విడుదల చేసినట్లు జైలుశాఖ తెలిపింది. పదేళ్లకుపైగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను నిబంధనల ప్రకారం విడుదల చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సూచనలు ఇచ్చింది. ఈ మేరకు ఖైదీలను విడుదల చేయడానికి అర్హులను గుర్తించడానికి విధివిధానాలను విడుదల చేశారు. 10 ఏళ్లు జైల్లో ఉన్న ఖైదీల్లో సత్ప్రవర్తనతో ఉన్న వారిని విడుదల చేయవచ్చని పేర్కొన్నారు. అత్యాచారం, ఉగ్రవాద నేరాలు, కిడ్నాప్ మొదలైన కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న వారు అనర్హులని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపికైన ఖైదీలను విడుదల చేస్తున్నారు. అన్నా జయంతి సందర్భంగా 96 మంది ఖైదీలను, 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని 19 మంది మొత్తం 115 మంది ఖైదీలను విడుదల చేశారు. క్రమంగా ఖైదీలను విడుదల చేస్తామని జైలుశాఖ అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.