విస్తృతంగా విదేశీ పెట్టుబడులు
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎఫ్డీఐ పెట్టుబడుల నివేదిక ఆధారంగా.. తమిళనాడులో గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.196 కోట్లు అదనంగా ఎఫ్డీఐ పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రం తాజా ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ జూన్ మధ్య రూ.5836 కోట్ల పెట్టుబడులు పెట్టారు.
అధికంగా సింగపూర్, మారిషస్ నుంచి
సేవారంగాలపైనే ఎక్కువ
మరిన్ని తెచ్చేందుకు తమిళనాడు కసరత్తు
కొవిడ్ లాంటి క్లిష్ట సమయాల్ని చూసిన తర్వాత గట్టిగా నిలుదొక్కుకున్న తమిళనాడులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ర్యాంకుల్లో కూడా తమిళనాడు 5వ స్థానంలో నిలిచింది. ఎఫ్డీఐలను మరింత పెంచేందుకు ఇప్పుడు ప్రభుత్వం వివిధ రంగాల్లో వసతుల్ని ఏర్పాటుచేస్తోంది.
ఈనాడు-చెన్నై, న్యూస్టుడే, సైదాపేట: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎఫ్డీఐ పెట్టుబడుల నివేదిక ఆధారంగా.. తమిళనాడులో గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.196 కోట్లు అదనంగా ఎఫ్డీఐ పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రం తాజా ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ జూన్ మధ్య రూ.5836 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల,్ జూన్ మధ్య రూ.5640 కోట్లు వచ్చాయి. అదే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్య రూ.8364 కోట్లు వసూలయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇవే మాసాల మధ్య రూ.7062 కోట్లకు చేరింది. దీన్నిబట్టి పెట్టుబడుల రాక పెరుగుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
రాష్ట్రమే టాప్
తమిళనాడు అధికారులు మాత్రం దేశంలోనే రాష్ట్రానికి ఎక్కువగా ఎఫ్డీఐలు వస్తున్నాయని చెబుతున్నారు. చాలా కంపెనీల ప్రధాన కార్యాలయాలు దిల్లీ, ముంబయి కేంద్రంగా నడుస్తున్నాయి. కానీ వాటి పెట్టుబడులు మాత్రం చాలావరకు తమిళనాడుకు వస్తున్నాయని అంటున్నారు. అప్పుడు అవి కూడా పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రం మరింత పురోభివృద్ధి చెందినట్లు అంచనాకు రావొచ్చని వివరిస్తున్నారు. దీనికి సంబంధించిన గణాంకాలు ప్రాంతీయంగా ఆర్బీఐ కార్యాలయాల్లో రికార్డ్ అవుతాయని కూడా వెల్లడిస్తున్నారు. అధికారులు చెప్పేదాన్ని బట్టి.. గతేడాది మార్చి 31వ తేదీ దాకా రాష్ట్రానికి రూ.81,722 కోట్ల విదేశీపెట్టుబడులు వచ్చాయని గుర్తుచేశారు.
50 శాతం అక్కడి నుంచే..
గత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్డీఐ తగ్గడానికి పలు కారణాల్ని చూపుతున్నారు. గతేడాదే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రావడం, దీనికి తోడు కోవిడ్ తీవ్రత ఉండటం ప్రధాన కారణాలుగా చూపుతున్నారు. కొవిడ్ పరిస్థితుల్ని సైతం రాష్ట్రం దీటుగా ఎదుర్కొందని చెబుతున్నారు. ప్రస్తుతం సింగపూర్, మారిషస్ నుంచి అత్యధికంగా ఎఫ్డీఐ పెట్టుబడులు వస్తున్నాయని అంటున్నారు. ఈ రెండు దేశాల నుంచి.. 50 శాతం పెట్టుబడులున్నట్లు అంచనా ఉంది. ఆ తర్వాత యూఎస్, జపాన్, నెదర్లాండ్స్ నుంచి వస్తున్నాయి.
సేవలకే ప్రాధాన్యం..
తమిళనాడుకు వచ్చే పెట్టుబడుల్లో అగ్రస్థానంలో సేవారంగానికి సంబంధించిన సంస్థలున్నాయి. ఆర్థిక, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, బిజినెస్ ఔట్సోర్సింగ్, పరిశోధన, కొరియర్, సాంకేతిక పరీక్షలు, విశ్లేషణ నేపథ్య రంగాల్లో పనిచేసే సంస్థలకు విదేశీ పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయి. ఆ తర్వాత కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్లున్నాయి. మరోవైపు ఇతర రంగాల్లోనూ ఎఫ్డీఐలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం విదేశాల్లోనూ పెట్టుబడి సదస్సులు నిర్వహిస్తోంది. తాజాగా రాష్ట్రం నుంచి మరో బృందం కూడా విదేశాలకు వెళ్లేందుకు సమాయత్తమవుతోంది. తమిళనాడు నుంచి ఎగుమతులు ఎక్కువగా ఉన్న టాప్-3 సెక్టార్లు చూస్తే.. 2021 నివేదిక ప్రకారం పత్తి ఆధారిత ఉత్పత్తులు, మోటార్వాహనాలు, ఆటోమొబైల్ విడిభాగాలు ఉన్నాయి.
పేరుకు తగ్గట్లు లేవు: రామదాసు
దేశంలో, ప్రపంచంలో తమిళనాడుకు క్రేజ్ ఎక్కువగా ఉందని, దాంతో పోల్చుకుంటే ఇక్కడున్న వసతులకు తక్కువ ఎఫ్డీఐ పెట్టుబడులు వస్తున్నాయని పీఎంకే అధ్యక్షులు అన్బుమణి రామదాస్ ఇదివరకే గళం విప్పారు. రాష్ట్రానికున్న సత్తాకు తగ్గట్లు పెట్టుబడులు తేవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని గుర్తుచేశారు. మరింత సులువుగా విదేశీ మారకాన్ని ఆకర్షించేలా.. రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించి.. అక్కడ వసతుల్ని మరింతగా పెంచి ఇంకా పెట్టుడుల్ని తీసుకురావచ్చని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతలు ఏం చేస్తున్నారో!
[ 24-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఫలితాలు వచ్చి ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేసేవరకు ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుంది. అప్పటి వరకు రాజకీయ నేతల సందడి పెద్దగా ఉండకపోవచ్చు. -
అత్యాశతోనే భాజపాలోకి విజయధరణి
[ 24-04-2024]
అత్యాశతోనే విజయధరణి భాజపాలో చేరారని తమిళనాడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు హసీనా సయ్యద్ ఆరోపించారు. దిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఆమెకు సోమవారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో పార్టీ మహిళా విభాగం తరఫున ఘనస్వాగతం పలికారు. -
ఓట్ల కోసం మతవిద్వేష ప్రచారాలు తగదు
[ 24-04-2024]
రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఓట్ల కోసం మత విద్వేష ప్రసంగాలు చేయరాదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. -
కన్నగికి ప్రభుత్వ నివాళి
[ 24-04-2024]
తమిళుల సాంస్కృతిక చిహ్నంగా విరాజిల్లుతున్న కన్నగి విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నివాళులర్పించింది. -
పుస్తకాలను ప్రేమించండి : ముఖ్యమంత్రి పిలుపు
[ 24-04-2024]
పుస్తకాలు చదవాలని, ప్రేమించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఆయన ఓ సందేశ ప్రకటన విడుదల చేశారు. -
వర్షపాతం పెరిగినా భూమిలో నీరేది!
[ 24-04-2024]
ఈ ఏడాది రాష్ట్రంలో వర్షపాతం పెరిగినా భూమిలో నీరు మాత్రం అప్పుడే అడుగంటింది. చెన్నైలో రుతుపవనాల వర్షాల తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో భూగర్భ జలాలు 8 అడుగుల మేర తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి
[ 24-04-2024]
పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని తమిళనాడు ప్రజా సంబంధాల శాఖ తెలిపింది. -
‘ఇంగ నాన్తాన్ కింగు’ మోషన్ పోస్టర్ విడుదల
[ 24-04-2024]
ఆనంద్ నారాయణ్ దర్శకత్వంలో నటుడు సంతానం నటించిన చిత్రం ‘ఇంగ నాన్తాన్ కింగు’. కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు ఎళిచ్చుర్ అరవిందన్. గోపురం ఫిలిం ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రంలో మనోబాలా, తంబి రామయ్య, మునిశ్కాంత్, బాల శరవణన్ తదితరులు నటించారు. -
అన్నాడీఎంకే నేత ఎస్టేట్లో వన్యప్రాణుల వేట
[ 24-04-2024]
అన్నాడీఎంకే నేత సజీవన్కు చెందిన సిల్వర్ క్లైవ్డ్ ఎస్టేట్ కూడలూర్లో ఉంది. ఇక్కడ వన్యప్రాణులను వేటాడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఎస్టేట్లో పనిచేస్తున్న ఫైజల్, సాబు జాకబ్ అనే వ్యక్తుల వద్ద దర్యాప్తు చేశారు.