తమిళనాడు ఆధ్యాత్మిక రాజధాని
చెన్నపురి గోవింద నామస్మరణలతో మారుమోగింది.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వెళ్లే గొడుగుల ఉత్సవంతో భక్తిపారవశ్యం వెల్లువిరిసింది. ఎటుచూసినా శ్రీవారి నామ గానాలే.. ఉత్తర చెన్నైలోని ముఖ్యమైన ప్రాంతాలన్నీ భక్తులతో కిటకిటలాడింది..
స్వాత్మానందేంద్ర స్వామి
భక్తజనసందోహం నడుమ గొడుగులు తీసుకెళ్తున్న దృశ్యం
కోడంబాక్కం, న్యూస్టుడే: చెన్నపురి గోవింద నామస్మరణలతో మారుమోగింది.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వెళ్లే గొడుగుల ఉత్సవంతో భక్తిపారవశ్యం వెల్లువిరిసింది. ఎటుచూసినా శ్రీవారి నామ గానాలే.. ఉత్తర చెన్నైలోని ముఖ్యమైన ప్రాంతాలన్నీ భక్తులతో కిటకిటలాడింది.. తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం ఇక్కడ నుంచి ఏటా ఛత్రాలు (గొడుగులు) వెళ్లడం సంప్రదాయంగా కొనసాగుతోంది. హిందూ ధర్మార్థ సమితి ఆధ్వర్యంలో ఏటా జరిగే ఈ కార్యక్రమం ఆదివారం ఫ్లవర్ బజార్లోని చెన్నకేశవపెరుమాళ్ ఆలయంలో జరిగింది. విశాఖ శ్రీ శారదపీఠం ఉత్తర పీఠాధికారి స్వాత్మానందేంద్ర స్వామి పాల్గొని ఛత్రాల ఉత్సవాన్ని ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక సలహా మండలి అధ్యక్షుడు శేఖర్రెడ్డి, సమితి ట్రస్టీ ఆర్ఆర్ గోపాల్జీ, వేదాంతం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర స్వామి మాట్లాడుతూ.. ‘తిరుమల తిరుపతి గొడుగుల ఉత్సవం ఇంత భక్తిశ్రద్ధలతో, కోలాహలంగా జరగడం ఆనందంగా ఉంది. తమిళనాడు నుంచి ఆంధ్రాలోని తిరుమలకు గొడుగులు తీసుకెళ్లడం చాలా గొప్ప విషయం. ఆదిశేషుడి అవతారం ఇక్కడ నుంచి తిరుమలకు వెళ్తున్నట్టు ఉంది. ఈ దర్శనభాగ్యం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు సమానం. దేశంలో పలురకాల పూజా విధానాలు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ తమిళనాడు సంప్రదాయం అన్నింటికన్నా గొప్పగా భాసిల్లుతోంది. దేశానికి రాజధాని దిల్లీనే అయినప్పటికీ, ఆధ్యాత్మిక రాజధాని తమిళనాడే. తిరుమలకు వెళ్లే భక్తుల్లో 90 శాతం మంది తమిళులే. విశాఖ శ్రీ శారద పీఠం గత 30 ఏళ్లుగా హిందూమత ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తోంది. మతమార్పిడి చేసుకున్న వారి వద్దకు వెళ్లి హిందూ మతంలో చేర్చే పనులను పీఠం చేస్తోంది. నవరాత్రి ఉత్సవాలు ఆరంభమైనందువల్ల శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఇక్కడకు రాలేకపోయార’ని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నటుడు విజయ్ కుమారుడు కొత్త సినిమా.. హీరోగా కాదు!
[ 29-03-2024]
నటుడు విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ 2009లో విడుదలైన ‘వేట్టైక్కారన్’ చిత్రంలోని ‘నా అడిచ్చా తంగమాట్ట’ పాటలో తన డ్యాన్స్ ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. -
అంతు చిక్కని ఓటరు నాడి!
[ 29-03-2024]
ఎన్నికల ఫలితాలు దేశమంతా ఒకలా ఉంటే.. తమిళనాడులో మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి. లోక్సభ ఎన్నికల్లో ఓ తరహా తీర్పు, అసెంబ్లీ ఎన్నికల్లో మరో రకమైన తీర్పు ఇక్కడే కనిపిస్తుంటుంది. -
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
[ 29-03-2024]
రామనాథపురంలో ఐదుగురు ఓ పన్నీర్సెల్వంల నామినేషన్లు ఆమోదించారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కృతుడైన మాజీ సీఎం ఓ.పన్నీర్సెల్వం అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పునరుద్ధరణ కమిటీ పేరుతో పనిచేస్తున్నారు. -
ప్రాణస్నేహితుల్లా మెలిగాం
[ 29-03-2024]
డీఎంకేపై వ్యరేతికతతో పార్టీలో చేరిన గణేశమూర్తి ఎంపీ అయ్యారని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో గుర్తు చేశారు. ఆయన కోవై విమానాశ్రయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. -
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె శివగంగైలో నామినేషన్
[ 29-03-2024]
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె స్వతంత్ర అభ్యర్థిగా శివగంగై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు నామినేషన్ దాఖలు చేయడం కలకలం సృష్టించింది. -
ప్రధాని నాటకాలు ప్రజలకు తెలుసు
[ 29-03-2024]
ప్రధాని మోదీ ఎన్నికల నాటకాలు ప్రజలకు తెలుసని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్లో డీఎంకే ఎన్నికల ప్రచార సమావేశం బుధవారం రాత్రి జరిగింది. -
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదు : కనిమొళి
[ 29-03-2024]
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదని డీఎంకే ఎంపీ కనిమొళి పేర్కొన్నారు. కరూర్ వెంగమేడు అన్నా విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జ్యోతిమణికి మద్దతుగా గురువారం ఆమె ప్రచారం చేశారు. -
కవిన్ డబ్బింగ్ పూర్తి
[ 29-03-2024]
బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి ‘టాటా’ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన నటుడు కవిన్. ఆ చిత్రం విజయం తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఇళనుడన్ దర్శకత్వంలోని ‘స్టార్’ చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి