logo

‘డీఎంకే పాలన ఐదేళ్లు కొనసాగదు’

డీఎంకే పాలన ఐదేళ్లు కొనసాగే అవకాశం లేదని మాజీ ఎమ్మెల్యే విజయకుమార్‌ తెలిపారు. అన్నాదురై 115వ జయంతి సందర్భంగా పెరియపాళ్యంలో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో శనివారం రాత్రి భారీ బహిరంగ సభ నిర్వహించారు.

Published : 26 Sep 2022 02:04 IST

మాట్లాడుతున్న విజయకుమార్‌

పెరియపాళ్యం, న్యూస్‌టుడే: డీఎంకే పాలన ఐదేళ్లు కొనసాగే అవకాశం లేదని మాజీ ఎమ్మెల్యే విజయకుమార్‌ తెలిపారు. అన్నాదురై 115వ జయంతి సందర్భంగా పెరియపాళ్యంలో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో శనివారం రాత్రి భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవిన్‌ పాల ధర, విద్యుత్తు ఛార్జీలు పెంచి డీఎంకే రాష్ట్ర ప్రజల వ్యతిరేకతను సంపాదించుకుందన్నారు. పాలకపక్ష ఎమ్మెల్యేలు కొందరు స్టాలిన్‌ వ్యవహార శైలిని నచ్చక పార్టీ ఫిరాయింపు యత్నాల్లో ఉన్నట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. కాబట్టి డీఎంకే సర్కారు త్వరలో కూలిపోయే అవకాశంలేకపోలేదని పేర్కొన్నారు. రాష్ట్ర మాజీ మంత్రి చిన్నయ్య, మాజీ ఎమ్మెల్యే బలరామన్‌, ఊత్తుకోట పట్టణ అన్నాడీఎంకే కార్యదర్శి షేక్‌దావూద్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని