logo

రోడ్డు ప్రమాదంలో 20 మంది పోలీసులకు గాయాలు

వాహనం బోల్తాపడి 20 మంది పోలీసులకు గాయాలైన ఘటన తిరుప్పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు....కోయంబత్తూర్‌లో పెట్రోల్‌ బాంబ్ తదితర సంఘటనలు జరుగుతుండంతో

Published : 27 Sep 2022 01:24 IST

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: వాహనం బోల్తాపడి 20 మంది పోలీసులకు గాయాలైన ఘటన తిరుప్పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు....కోయంబత్తూర్‌లో పెట్రోల్‌ బాంబ్ తదితర సంఘటనలు జరుగుతుండంతో కోవైలో అదనపు భద్రతకి వెళ్లేందుకు కడలూర్‌ నుంచి కోవైకు 30 మంది పోలీసులు వ్యాన్‌లో బయలుదేరారు. అవినాశి పళంగారై వద్ద వీరిని లారీ ఢీకొంది. వాహనం బోల్తాపడటంతో 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. చికిత్స కోసం తిరుప్పూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పారిపోయిన లారీ డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని