logo

పళని కొండపైకి రైలు సేవలు

పళని దండాయుధపాణి ఆలయ కొండపైకి విద్యుత్తు రైలు సేవలు బుధవారం అందుబాటులోకి వచ్చాయి. కొండ కింది నుంచి పైకి మూడు విద్యుత్తు రైళ్లు నడుస్తున్నాయి.

Published : 29 Sep 2022 02:23 IST

రైలుపై సౌర విద్యుత్తు పలకలు అమర్చిన దృశ్యం

విల్లివాక్కం, న్యూస్‌టుడే: పళని దండాయుధపాణి ఆలయ కొండపైకి విద్యుత్తు రైలు సేవలు బుధవారం అందుబాటులోకి వచ్చాయి. కొండ కింది నుంచి పైకి మూడు విద్యుత్తు రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లలో విద్యుత్తు దీపాలు, ఫ్యాన్‌లు, భక్తి పాటలు వినిపించడానికి స్పీకర్లు ఉన్నాయి. ఇవి పనిచేయడానికి గతేడాది ఓ రైలు పైభాగంలో సౌర విద్యుత్తు పలకలు అమర్చారు. ప్రస్తుతం రెండో రైలుకు కూడా ఏర్పాటు చేశారు. దీనిని బుధవారం నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆలయంలో వచ్చే ఏడాది జనవరిలో కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఇందుకుగాను బాలాలయ పనులు పూర్తయ్యాయి. ఆలయంలో మరమ్మతులు చేసి సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మూలవిరాట్టు సన్నిధి చుట్టూ రూ.కోటి వ్యయంతో 10 టన్నుల ఇత్తడితో గ్రిల్‌ ఏర్పాటు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని