logo

పోలీసు స్టేషనులో వ్యక్తి అనుమానాస్పద మృతి

విచారణకు తీసుకెళ్లిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన తిరుచ్చిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తిరుచ్చి జిల్లా సమయపురం ఆలయంలో భక్తుడి సెల్‌ఫోన్‌ దొంగిలించినట్లు ఆరోపిస్తూ మురుగానందం అనే వ్యక్తిని

Published : 29 Sep 2022 02:23 IST

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: విచారణకు తీసుకెళ్లిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన తిరుచ్చిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తిరుచ్చి జిల్లా సమయపురం ఆలయంలో భక్తుడి సెల్‌ఫోన్‌ దొంగిలించినట్లు ఆరోపిస్తూ మురుగానందం అనే వ్యక్తిని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. కాసేపటికే మరుగుదొడ్డిలో అతడు చనిపోయాడు. మురుగానందం తన నడుముకు కట్టుకొని ఉన్న తాడుతో ఉరేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై సీబీసీఐడీ దర్యాప్తు జరపనుందనని తిరుచ్చి డీఐజీ శరవణన్‌ సుందర్‌ తెలిపారు. ఆ సమయంలో విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న సమయపురం పోలీస్‌ రాంకీని సస్పెండ్‌ చేస్తూ తిరుచ్చి ఎస్పీ సుజిత్‌కుమార్‌ ఆదేశించారు. ఇదే పోలీస్‌స్టేషన్‌లో మూడేళ్లకు ముంందు మురుగన్‌ అనే విచారణ ఖైదీని పోలీసులు కొట్టి చంపారనే కేసు విచారణలో ఉండడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని