మోటావర్స్ చదువు..ఎంతో ప్రత్యేకం!
చెన్నైలోని 3 ప్రభుత్వ బడులు, 2 గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పాఠశాలల్లో ‘మెటా కల్వి (మెటావర్స్ చదువులు)’ పేరుతో ప్రత్యేక ప్రాజెక్టు తెచ్చారు. జులైలో మొదలైన దీనిపై విద్యాశాఖ సమీక్షలు నిర్వహించింది. ఈ పద్ధతిలో బోధించడంతో విద్యార్థులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. వారి నైపుణ్యాల్లోనూ పెరుగుదల
చెన్నై సర్కారు బడుల్లో ప్రయోగం
ఈనాడు, చెన్నై
వీఆర్ కిట్లతో చెన్నైలోని లేడీ విల్లింగ్టన్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు
తరగతులు కాస్తా స్మార్ట్గా మారిపోయాయి. పుస్తకాలూ డిజిటల్లోకి వెళ్లాయి. ఇప్పుడు విద్యాబోధనలో సరికొత్త అధ్యాయం.. మెటావర్స్ చదువులు. కృత్రిమ 3డీ దృశ్యరూపకాన్ని వర్చువల్ రియాలటీ (వీఆర్) పద్ధతిలో బోధించే వినూత్న సాంకేతికత విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభుత్వ బడుల్లో ప్రయోగాత్మకంగా తెచ్చిన ఈ ప్రాజెక్టుతో మంచి ఫలితాలు వస్తున్నాయి.
చెన్నైలోని 3 ప్రభుత్వ బడులు, 2 గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పాఠశాలల్లో ‘మెటా కల్వి (మెటావర్స్ చదువులు)’ పేరుతో ప్రత్యేక ప్రాజెక్టు తెచ్చారు. జులైలో మొదలైన దీనిపై విద్యాశాఖ సమీక్షలు నిర్వహించింది. ఈ పద్ధతిలో బోధించడంతో విద్యార్థులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. వారి నైపుణ్యాల్లోనూ పెరుగుదల వచ్చిందని అధికారులు చెప్పారు. విడతలవారీగా గ్రేటర్ చెన్నై కార్పొరేషన్, తర్వాత రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దీన్ని అమలుపరిచేలా ప్రత్యేక కార్యచరణపై ఆలోచిస్తున్నారు.
నిపుణుల పర్యవేక్షణలో..
ఈ విధానంలో విద్యార్థుల తలకు వీఆర్ సెట్, చేతిలో జాయ్స్టిక్, పక్కనే పాఠాల్ని వివరించేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులు ఉంటారు. ఒక్కో పాఠశాలకు ఒక్కో మెటా కల్వి వీఆర్ ల్యాబొరేటరీని కేటాయించారు. రోజూ విద్యార్థుల్ని విడతలవారీగా ఈ గదిలో పాఠాలు వినేందుకు, 3డీ దృశ్యమాధ్యమంలో అర్థం చేసుకునేందుకు అవకాశమిస్తున్నారు. ఈ ప్రాజెక్టును చేపడుతున్న మేనికార సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ప్రత్యేక నిపుణులు వీరికి సాంకేతికత సాయం అందిస్తున్నారు. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ప్రస్తుతం సైన్స్, గణితం, సాంఘిక శాస్త్రాల్ని ఈ సాంకేతితతో బోధిస్తున్నారు.
పాఠం.. అద్భుతం
చెన్నై నగరం ట్రిప్లికేన్లోని లేడీ విల్లింగ్టన్ ఉన్నత పాఠశాల, చెన్నై మిడిల్ స్కూల్, ప్రభుత్వ మోడల్ స్కూల్, చింతాద్రిపేటలోని చెన్నై ఉన్నత పాఠశాల, అన్నాసాలైలోని ప్రభుత్వ మదర్సా-ఎ-ఆజం హయ్యర్ సెకండరీ స్కూల్లలో ఈ ల్యాబ్లను తెరిచారు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాల్ని ఈ ల్యాబ్ల్లో వర్చువల్ రియాలిటీలో అర్థం చేసుకోవడంతో అద్భుత అనుభూతికి విద్యార్థులు లోనవుతున్నారు. అంతరిక్షంలోని గ్రహాలు, నక్షత్రాలు, రాకెట్ ప్రయోగాలు ఇవన్నీ చాలా దగ్గరగా చూస్తున్న అనుభూతిని పొందామని విద్యార్థులు చెప్పారు. క్లిష్టమైన రసాయనశాస్త్ర పాఠాల్లోని పరమాణువులకు సంబంధించిన చర్యల్ని 3డీలో చూసి అర్థం చేసుకోగలుగుతున్నామని వెల్లడించారు. నాగరిత, చారిత్రక అంశాలు తమకు కళ్లకు కట్టినట్లుగా ఉన్నాయని చెప్పారు. వర్చువల్ పాఠాలకు గ్రాఫిక్స్ను కూడా అన్వయిస్తున్నారు.
పెరిగిన ఆసక్తి
చదువులపై పేద పిల్లలు, తల్లిదండ్రుల్లో ఆసక్తిని పెంచడంతోపాటు హాజరు పెంచడం, సాంకేతికత పాఠాలు నేర్చుకోవడంపై తాము ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా తెచ్చామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. తద్వారా పాఠాల్ని అర్థం చేసుకునే తీరులో చాలా మార్పులొచ్చాయని, సాంకేతిక పరికరాలపై అవగాహన పెరుగుతోందని తెలిపారు. పాఠశాలలో ప్రతి విద్యార్థికి సంబంధించి ఆన్లైన్ ఖాతా తెరవడమేకాక వారిలో పెరుగుతున్న నైపుణ్యాల్ని ఆన్లైన్లోనే పాయింట్లవారీగా తెలుసుకునే విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతుచిక్కని ఓటరు నాడి!
[ 29-03-2024]
ఎన్నికల ఫలితాలు దేశమంతా ఒకలా ఉంటే.. తమిళనాడులో మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి. లోక్సభ ఎన్నికల్లో ఓ తరహా తీర్పు, అసెంబ్లీ ఎన్నికల్లో మరో రకమైన తీర్పు ఇక్కడే కనిపిస్తుంటుంది. -
ప్రాణస్నేహితుల్లా మెలిగాం
[ 29-03-2024]
డీఎంకేపై వ్యరేతికతతో పార్టీలో చేరిన గణేశమూర్తి ఎంపీ అయ్యారని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో గుర్తు చేశారు. ఆయన కోవై విమానాశ్రయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. -
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు
[ 29-03-2024]
రామనాథపురంలో ఐదుగురు ఓ పన్నీర్సెల్వంల నామినేషన్లు ఆమోదించారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కృతుడైన మాజీ సీఎం ఓ.పన్నీర్సెల్వం అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పునరుద్ధరణ కమిటీ పేరుతో పనిచేస్తున్నారు. -
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె శివగంగైలో నామినేషన్
[ 29-03-2024]
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె స్వతంత్ర అభ్యర్థిగా శివగంగై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు నామినేషన్ దాఖలు చేయడం కలకలం సృష్టించింది. -
ప్రధాని నాటకాలు ప్రజలకు తెలుసు
[ 29-03-2024]
ప్రధాని మోదీ ఎన్నికల నాటకాలు ప్రజలకు తెలుసని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్లో డీఎంకే ఎన్నికల ప్రచార సమావేశం బుధవారం రాత్రి జరిగింది. -
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదు : కనిమొళి
[ 29-03-2024]
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదని డీఎంకే ఎంపీ కనిమొళి పేర్కొన్నారు. కరూర్ వెంగమేడు అన్నా విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జ్యోతిమణికి మద్దతుగా గురువారం ఆమె ప్రచారం చేశారు. -
కవిన్ డబ్బింగ్ పూర్తి
[ 29-03-2024]
బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి ‘టాటా’ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన నటుడు కవిన్. ఆ చిత్రం విజయం తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఇళనుడన్ దర్శకత్వంలోని ‘స్టార్’ చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్