logo

వరద నీటి పారుదల పనులు దాదాపు పూర్తి

చెన్నైలో జరుగుతున్న వరదనీటి పారుదల పనులు దాదాపు పూర్తి అయ్యాయని చెన్నై మేయర్‌ ప్రియ తెలిపారు. మాజీ మేయర్‌ శివరాజ్‌ జయంతి సందర్భంగా చెన్నై మరలా తంగసాలైలోని ఆయన విగ్రహం వద్ద మంత్రి శేఖర్‌బాబు, మేయర్‌ ప్రియ, డిప్యూటీ మేయర్‌ మహేష్‌కుమార్‌

Published : 30 Sep 2022 02:08 IST

నివాళులర్పిస్తున్న మేయర్‌ ప్రియ, మంత్రి శేఖర్‌బాబు తదితరులు

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: చెన్నైలో జరుగుతున్న వరదనీటి పారుదల పనులు దాదాపు పూర్తి అయ్యాయని చెన్నై మేయర్‌ ప్రియ తెలిపారు. మాజీ మేయర్‌ శివరాజ్‌ జయంతి సందర్భంగా చెన్నై మరలా తంగసాలైలోని ఆయన విగ్రహం వద్ద మంత్రి శేఖర్‌బాబు, మేయర్‌ ప్రియ, డిప్యూటీ మేయర్‌ మహేష్‌కుమార్‌ నివాళులర్పించారు. అనంతరం ప్రియ విలేకరులతో మాట్లాడుతూ.... వాననీటి కాలువ పనులపై దృష్టి పెట్టామన్నారు. అక్టోబర్‌ 10వ తేదీలోపు పనులన్నీ పూర్తి అవుతాయని తెలిపారు. 15 మండలాలకు 17 మంది ఐఏఎస్‌ అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు.  
కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశం
ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: చెన్నై కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశం మేయర్‌ ప్రియ అధ్యక్షతన గురువారం రిబ్బన్‌ భవనంలో జరిగింది. అప్పుడు కౌన్సిలర్లు తమ వార్డులలో సమస్యల గురించి ప్రస్తావించారు. 97 తీర్మానాలను ఆమోదించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని