మా చెల్లి ఇక్కడ ఉండుంటే బాగుండేది!
మా సోదరి సిమ్లాలో ఇల్లు కట్టుకుంది. అది చాలా అందంగా ఉంది. కానీ ఆమె ఇప్పుడు గుడలూరులో ఉండుంటే బాగుండు. దేశంలోనే అత్యంత అందమైన ప్రాంతం ఇదని ఆమె తెలుసుకుని ఉండాల్సింది. ఇక్కడి కొండలు, సహజ ప్రకృతి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి’ అని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ
గుడలూరులో కొండలు, ప్రకృతే ఆకర్షణ
కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ
యువత సందడి..
ఈనాడు-చెన్నై, న్యూస్టుడే-ఆర్కేనగర్: ‘మా సోదరి సిమ్లాలో ఇల్లు కట్టుకుంది. అది చాలా అందంగా ఉంది. కానీ ఆమె ఇప్పుడు గుడలూరులో ఉండుంటే బాగుండు. దేశంలోనే అత్యంత అందమైన ప్రాంతం ఇదని ఆమె తెలుసుకుని ఉండాల్సింది. ఇక్కడి కొండలు, సహజ ప్రకృతి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి’ అని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ అన్నారు. గురువారం కేరళలో భారత్జోడో యాత్రను ముగించుకుని రాష్ట్రంలోని నీలగిరి జిల్లా గుడలూరులో అడుగుపెట్టారు. రాత్రి అక్కడే బసచేశారు. ఈ సందర్భంగా బహిరంగసభలో ప్రసంగించారు. గుడలూరుకు ఓ ప్రత్యేకత ఉందన్నారు. తమిళం, కన్నడ, మలయాళం భాషలకు నిలయంగా, 3 రాష్ట్రాల సంగమంగా ఉంటుందని చెప్పారు. భాషలు, సంస్కృతులపై తమకెంతో గౌరవం ఉందని తెలిపారు. వాటిపై మమకారం ఉందని చెప్పారు. ఇక్కడ నడక సాగించడం ఆనందం, సంతృప్తిని ఇస్తోందన్నారు. దేశం ఐక్యంగా ఉండేందుకు ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకే యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. తిరిగి రాష్ట్రంలో అడుగుపెట్టడం పెద్ద నదే పారుతున్నట్లుగా ఉందని చెప్పారు. వీటిమధ్య పారుతున్న నది మానవతాహృదయంతో వెళ్తున్నట్లుగా ఉందన్నారు. ఇందులో అన్ని భాషలు, సంస్కృతులతో పాటు పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ ఉన్నారని వివరించారు. ఈ నది ప్రతీ ఒక్కరినీ గౌరవిస్తోందని తెలిపారు. విద్వేషం, కోపం, అగౌరవం అనేదే లేదని గుర్తుచేశారు. తమిళ, మలయాళం, కన్నడ మాట్లాడొద్దని కూడా ఎవరూ చెప్పడంలేదని అన్నారు. కొంతమంది, కొన్ని సంస్థలు.. ఈ నదిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆ అలజడుల ప్రభావం పడకుండా యాత్రను చేపట్టామని తెలిపారు. సభలో రాహుల్ ప్రసంగిస్తుండగా మధ్యలో ఓ మసీదు నుంచి అజాన్ వినిపించడంతో ప్రసంగానికి విరామం ఇచ్చారు. రాత్రికి గుడలూరులోనే బసచేశారు. శుక్రవారం యాత్ర కర్ణాటకలోకి ప్రవేశిస్తుంది. ఈ యాత్రకోసం తమిళనాడు పీసీసీ యంత్రాంగం ఏర్పాట్లుచేసింది. దారిపొడవునా పోలీసులు భద్రత కల్పించారు.
రాహుల్ బస చేసిన ప్రాంతం బయట నేతలు, కార్యకర్తలు
తనని కలిసేందుకు వచ్చిన ఓ వృద్ధుడు, యువకుడితో రాహుల్గాంధీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
[ 25-04-2024]
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. -
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
[ 25-04-2024]
శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. -
మహిళల పాలిట రక్తపోటు
[ 25-04-2024]
అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి. -
ఆధారాలున్నా ఓటరు పేర్లు గల్లంతు
[ 25-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బర్డ్ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక బృందాలు
[ 25-04-2024]
తమిళనాడులో బర్డ్ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. -
జూన్లో కొత్త రోడ్లు
[ 25-04-2024]
కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
తమిళ అభిమానులకు కృతజ్ఞతలు
[ 25-04-2024]
ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష
[ 25-04-2024]
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్ బిస్కెట్ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. -
మత ఘర్షణలు సృష్టించేలా ప్రధాని ప్రచారం
[ 25-04-2024]
మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
మోదీ పాలనలో మైనారిటీలు ఇబ్బంది పడలేదు: ఓ పన్నీర్సెల్వం
[ 25-04-2024]
మోదీ పాలనలో మైనారిటీ ప్రజలు ఇబ్బంది పడలేదని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం తెలిపారు. మదురై తిరుప్పరకుండ్రం సుబ్రమణిస్వామి ఆలయంలో మంగళవారం మురుగన్ను దర్శించుకున్నారు. -
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ చర్యలు: స్టాలిన్
[ 25-04-2024]
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
[ 25-04-2024]
హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్