logo

ఎండీఎంకే నిర్వాహకుల మూకుమ్మడి రాజీనామా

కాంచీపురం జిల్లా ఎండీఎంకే నిర్వాహకులు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నట్లు శనివారం సాయంత్రం ప్రకటించి రాజీనామ పత్రాలను పార్టీ కార్యాలయానికి పంపారు. కాంచీపురం ఎండీఎంకే జిల్లా కార్యదర్శిగా ఇ.వలైయాపతి ఉన్నారు.

Published : 03 Oct 2022 00:36 IST

రాజీనామా చేసిన నాయకులు

కాంచీపురం, న్యూస్‌టుడే: కాంచీపురం జిల్లా ఎండీఎంకే నిర్వాహకులు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నట్లు శనివారం సాయంత్రం ప్రకటించి రాజీనామ పత్రాలను పార్టీ కార్యాలయానికి పంపారు. కాంచీపురం ఎండీఎంకే జిల్లా కార్యదర్శిగా ఇ.వలైయాపతి ఉన్నారు. రెండు రోజుల క్రితం తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎండీఎంకే కార్యదర్శి దురై వైగో మాట్లాడుతూ... పార్టీకి నిజమైన విశ్వాసపాత్రులుగా ఉన్న వారు పార్టీలో కొనసాగవచ్చని, పనిచేయడానికి సీనియర్లు వెనకాడుతున్నారని, అలాంటి వారు రాజీనామా చేయవచ్చని పేర్కొన్నారు. దీంతో ఇ.వలైయాపతి తన పదవికి రాజీనామా చేస్తూ పార్టీ కార్యకర్తగా కొనసాగుతానని ప్రకటించారు. ఆయనతో పాటు 16 మంది జిల్లా నిర్వాహకులు మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామాలు చేసి పత్రాలను పార్టీ కార్యాలయానికి శనివారం సాయంత్రం పంపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని