‘మెరీనా లైఫ్గార్డ్ యూనిట్’ ప్రారంభం
‘మెరీనా లైఫ్గార్డ్ యూనిట్’ను డీజీపీ శైలేంద్రబాబు మెరీనా బీచ్లో శనివారం లాంఛనంగా ప్రారంభించారు. మెరీనాకు వచ్చే పర్యాటకులు ప్రమాదవశాత్తు సముద్రంలో గల్లంతైతే వారిని కాపాడే చర్యలపై ప్రత్యేకంగా మాక్ డ్రిల్ నిర్వహించారు.
జెండా ఊపి వాహనాన్ని ప్రారంభిస్తున్న శైలేంద్ర బాబు
వడపళని, న్యూస్టుడే: ‘మెరీనా లైఫ్గార్డ్ యూనిట్’ను డీజీపీ శైలేంద్రబాబు మెరీనా బీచ్లో శనివారం లాంఛనంగా ప్రారంభించారు. మెరీనాకు వచ్చే పర్యాటకులు ప్రమాదవశాత్తు సముద్రంలో గల్లంతైతే వారిని కాపాడే చర్యలపై ప్రత్యేకంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. మెరీనాలో ఈ తరహా యూనిట్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్టు గత ఏడాది అసెంబ్లీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ప్రత్యేక సిబ్బంది, వాహనాల కొనుగోలు, ఇతర పరికరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2.60 కోట్లు కేటాయించింది. తీర గస్తీ దళం, తమిళనాడు స్పెషల్ పోలీసు, గ్రేటర్ చెన్నై పోలీసు, ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ విభాగాల నుంచి ప్రత్యేకంగా శిక్షణ పొందిన వారితో పాటు జాలర్ల వాలంటీర్లు విధుల్లో ఉంటారు. ‘తమిళనాడు అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ కార్పొరేషన్’ ఆధ్వర్యంలో నాలుగు చక్రాల వాహనాలు, రెండు మినీ ట్రాక్టర్లు, ఓ ప్రొటో టైప్ డ్రోన్ కూడా సేవలందించనుంది. అత్యవసర సమయాల్లో రక్షించేందుకు ఎనిమిది మంది జాలర్లను కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు. ఈ సందర్భంగా ఎనిమిది మంది జాలర్ల చేత ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహించారు. వీరు బీచ్ సందర్శనార్థం వచ్చే పర్యాటకులు ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతైతే రక్షిస్తారు. అదేవిధంగా ప్రత్యేక తీర గస్తీ బృందం ఫైబర్ పడవల్లో వేటకు వెళ్లిన జాలర్లు సముద్ర జలాల్లో చిక్కుకుపోతే జెట్ స్కైస్ ద్వారా రక్షిస్తుంది. 1093 హెల్ప్లైన్కు సమాచారం అందగానే అగ్నిమాపక దళం, తీర గస్తీ దళం స్కూబా డైవర్ల సాయంతో నీట మునిగిన వారిని రక్షించేందుకు చర్యలు చేపడుతుంది. ఈ సమాచారాన్ని ‘మారి టైం రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్’కు చేరవేస్తామని తీర గస్తీ బృంద అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు సందీప్ మిట్టల్ పేర్కొన్నారు. కార్యక్రమానికి కార్పొరేషన్ కమిషనరు గగన్దీప్ సింగ్ బేడీ, పోలీసు కమిషనర్ శంకర్ జివాల్, తమిళనాడు, పుదుచ్చేరి నావల్ ఏరియా ఫ్లాగ్ ఆఫీసర్ రియర్ అడ్మిరల్ ఎస్. వెంకట్రామన్ తదితరులు హాజరయ్యారు.
తీర గస్తీ దళం మాక్ డ్రిల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
[ 19-04-2024]
వేలూర్ నియోజక వర్గ స్వతంత్ర అభ్యర్థి, నటుడు మన్సూర్ అలీఖాన్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ప్రచారానికి చివరిరోజు కావడంతో ముమ్మరంగా ఓట్లు అభ్యర్థించారు. -
పాదచారుల సబ్వే త్వరగా తెరవండి
[ 19-04-2024]
పాదచారుల కోసం నిర్మించిన రైల్వే సబ్వే తిరిగి తెరవాలని తాంబరం వాసులు డిమాండు చేస్తున్నారు. తూర్పు, పడమర తాంబరాన్ని అనుసంధానం చేసే రైల్వే సబ్వేను 2018లో లాంఛనంగా ప్రారంభించారు. -
ఓటేద్దాం.. పదండి
[ 19-04-2024]
పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీపడుతున్న అభ్యర్థుల భవితవ్యం ఈరోజు ఈవీఎంల్లో భద్రంగా నమోదవనుంది. తొలివిడత ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లోనూ శుక్రవారం పోలింగ్ నిర్వహించనున్నారు. -
ఓటేసేందుకు 25 కి.మీ. నడక
[ 19-04-2024]
తిరునెల్వేలి జిల్లాకు చెందిన కొందరు ఓటేసేందుకు కి.మీ. కొద్దీ నడిచివెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఇంజిక్కుళి గ్రామస్థులు సుమారు 60 ఏళ్ల కింద పశ్చిమ కనుమలపైనున్న అటవీ ప్రాంతంలో స్థిరపడ్డారు. -
గోట్లో విజయకాంత్
[ 19-04-2024]
నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్ ‘గోట్’ సినిమాలో అతిథిపాత్రలో కనిపించే అవకాశం ఉంది. ఆయన చనిపోయారు కదా అనే కదా మీ ప్రశ్న. కృత్రిమ మేథ పరిజ్ఞానంతో ఆ చిత్రంలో ఆయన రూపాన్ని సృష్టించడానికి నిర్ణయించారు. -
మద్యం తాగడానికి డబ్బుల్లేవని బిడ్డ చేతిని బ్లేడుతో కోసి, సిగరెట్తో కాల్చిన తండ్రి
[ 19-04-2024]
తంజావూర్ జిల్లా కీళతోట్టం గ్రామానికి చెందిన బాలసుబ్రమణ్యం, శివరంజని భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. కుటుంబ పోషణ కోసం శివరంజని మలేషియాకు వెళ్లింది. -
పర్యాటకంపై పెరిగిన ఆసక్తి
[ 19-04-2024]
నగరంలో లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో వేసవి సెలవులు గడిపేందుకు దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు విదేశాలకు వెళ్లేందుకు ప్రయాణికులు సిద్ధమవుతున్నారు. -
శ్రీలంక తమిళ మహిళ ఓటరు కార్డు రద్దు
[ 19-04-2024]
శ్రీలంక తమిళుల పునరావాస శిబిరంలో ఉన్న మహిళకు ఇచ్చిన ఓటరు కార్డును రద్దు చేసినట్లు ఎన్నికల అధికారి, తిరుచ్చి కలెక్టర్ ప్రదీప్కుమార్ ప్రకటించారు. తిరుచ్చి జిల్లా కొట్టపట్టు ప్రాంతంలో శ్రీలంక తమిళుల పునరావాస శిబిరం ఉంది. -
రోడ్డులేక.. నడకమార్గంలో..
[ 19-04-2024]
నామక్కల్ జిల్లా రాశిపురం తాలూకా వెణ్ణత్తూర్ పంచాయతీ యూనియన్ పరిధిలోని బోదమలై 7 కి.మీ. ఎత్తులో ఉంది. ఇక్కడి కీళూర్, మేలూర్, కెడమలై గ్రామాల్లో 1,500 మందికి పైగా జనాభా ఉన్నారు. -
నయినార్ నాగేంద్రన్పై చర్యలు చేపట్టాలి
[ 19-04-2024]
భాజపా అభ్యర్థి నయినార్ నాగేంద్రన్పై చర్యలు చేపట్టాలని ఎన్నికల కమిషన్కు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈనెల 6న తాంబరం రైల్వేస్టేషన్లో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టగా తిరునెల్వేలి భాజపా అభ్యర్థి నయినార్ నాగేంద్రన్ కారు డ్రైవరు సతీష్, సహాయకుడి నుంచి రూ.4 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
20 మంది ఎమ్మెల్యేలు సహా.. 4 లక్షల ఓటర్లలో ఒక్కరూ ఓటెయ్యలేదు!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు