ఆడ శిశువులకు శ్రీరామరక్ష
లింగ వివక్షను నిరోధించి భ్రూణ హత్యలకు పాల్పడకుండా ఆడ శిశువులను కాపాడాలని గాంధీగ్రాం ట్రస్టు పిలుపునిచ్చింది. అందుకోసం తనవంతు సాయం అందిస్తోంది.
గాంధీగ్రాం ట్రస్టు సేవలు
వడపళని, న్యూస్టుడే: లింగ వివక్షను నిరోధించి భ్రూణ హత్యలకు పాల్పడకుండా ఆడ శిశువులను కాపాడాలని గాంధీగ్రాం ట్రస్టు పిలుపునిచ్చింది. అందుకోసం తనవంతు సాయం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు అవగాహన కల్పించి ఆడ శిశువులకు రక్షణ కల్పించడం అవసరమని ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ కె.శివకుమార్ అన్నారు. డాక్టర్ సౌంద్రం అమ్మ మెటర్నటీ బెనిఫిట్ స్కీంను మహిళలు, సౌభాగ్య పథకం ఆడ శిశువులకు ఇటీవల ప్రారంభించినట్టు ఆదివారం తెలిపారు. రెడింగ్టన్ ఫౌండేషన్ సంస్థ సహకారంతో వీటిని మొదలుపెట్టామన్నారు. ఆసుపత్రి జనరల్ వార్డులో ఉచిత చికిత్స, వైద్యుడి ఫీజు, ఇతర ఛార్జీలను ట్రస్టు భరిస్తుందన్నారు. రూ. 8 వేల నుంచి రూ.10 వేల నామమాత్రపు రుసుము వసూలు చేస్తామన్నారు. ఆడ శిశువులు కుటుంబాలకు ఒక వర ప్రసాదమని, భారంగా భావించకూడదనే ఆశయంతోనే సౌభాగ్య పథకాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2011 గణాంకాల మేరకు 7.21 కోట్ల జనాభాలో ప్రతి వెయ్యి మందికి 996 మంది బాలికలున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ‘ఊయల బేబీ పథకం’ (క్రెడిల్ బేబీ స్కీం)ను 1992లో సేలం జిల్లాలో ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో భ్రూణ హత్యలు బాగా తగ్గాయని, అనంతరం ఆ పథకం మదురై, తేని, దిండిగల్లు, ధర్మపురి జిల్లాలకు విస్తరించిందని శివకుమార్ గుర్తు చేశారు. 2011 గణాంకాల మేరకు కడలూరు, అరియలూరు, పెరంబలూరు, విల్లుపురం, తిరువణ్ణామలై జిల్లాల్లో ఆర్థిక కారణాలతో బాలికల సంఖ్య తగ్గినట్టు చెప్పారు. ఊయల బేబీ పథకాన్ని గాంధీగ్రాం ట్రస్టు నిర్వహిస్తోందని, ప్రభుత్వ గుర్తింపు పొందామన్నారు. 75వ వసంతం సందర్భంగా ఆడ శిశువులకు జన్మనిచ్చిన తల్లులకు ప్రసవ ఖర్చులు భరించామని చెప్పారు. డాక్టర్ సౌంద్రం అమ్మ మెటర్నిటీ స్కీంను కూడా ప్రభుత్వం గుర్తించి ప్రతి ఆడశిశువుకు రూ.2,500 చొప్పున ఆర్థిక సాయం చేయాలని వినతిపత్రం సమర్పించామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతలు ఏం చేస్తున్నారో!
[ 24-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఫలితాలు వచ్చి ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేసేవరకు ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుంది. అప్పటి వరకు రాజకీయ నేతల సందడి పెద్దగా ఉండకపోవచ్చు. -
అత్యాశతోనే భాజపాలోకి విజయధరణి
[ 24-04-2024]
అత్యాశతోనే విజయధరణి భాజపాలో చేరారని తమిళనాడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు హసీనా సయ్యద్ ఆరోపించారు. దిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఆమెకు సోమవారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో పార్టీ మహిళా విభాగం తరఫున ఘనస్వాగతం పలికారు. -
ఓట్ల కోసం మతవిద్వేష ప్రచారాలు తగదు
[ 24-04-2024]
రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఓట్ల కోసం మత విద్వేష ప్రసంగాలు చేయరాదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. -
కన్నగికి ప్రభుత్వ నివాళి
[ 24-04-2024]
తమిళుల సాంస్కృతిక చిహ్నంగా విరాజిల్లుతున్న కన్నగి విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నివాళులర్పించింది. -
పుస్తకాలను ప్రేమించండి : ముఖ్యమంత్రి పిలుపు
[ 24-04-2024]
పుస్తకాలు చదవాలని, ప్రేమించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఆయన ఓ సందేశ ప్రకటన విడుదల చేశారు. -
వర్షపాతం పెరిగినా భూమిలో నీరేది!
[ 24-04-2024]
ఈ ఏడాది రాష్ట్రంలో వర్షపాతం పెరిగినా భూమిలో నీరు మాత్రం అప్పుడే అడుగంటింది. చెన్నైలో రుతుపవనాల వర్షాల తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో భూగర్భ జలాలు 8 అడుగుల మేర తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి
[ 24-04-2024]
పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని తమిళనాడు ప్రజా సంబంధాల శాఖ తెలిపింది. -
‘ఇంగ నాన్తాన్ కింగు’ మోషన్ పోస్టర్ విడుదల
[ 24-04-2024]
ఆనంద్ నారాయణ్ దర్శకత్వంలో నటుడు సంతానం నటించిన చిత్రం ‘ఇంగ నాన్తాన్ కింగు’. కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు ఎళిచ్చుర్ అరవిందన్. గోపురం ఫిలిం ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రంలో మనోబాలా, తంబి రామయ్య, మునిశ్కాంత్, బాల శరవణన్ తదితరులు నటించారు. -
అన్నాడీఎంకే నేత ఎస్టేట్లో వన్యప్రాణుల వేట
[ 24-04-2024]
అన్నాడీఎంకే నేత సజీవన్కు చెందిన సిల్వర్ క్లైవ్డ్ ఎస్టేట్ కూడలూర్లో ఉంది. ఇక్కడ వన్యప్రాణులను వేటాడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఎస్టేట్లో పనిచేస్తున్న ఫైజల్, సాబు జాకబ్ అనే వ్యక్తుల వద్ద దర్యాప్తు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్