సురక్షిత నీటి సరఫరాలో భేష్!
యావత్తు దేశానికి గ్రామీణ ప్రాంతాలలో సురక్షిత నీటి సరఫరాలో దక్షిణాదిన ఉన్న తమిళనాడు, పుదుచ్చేరి ఆదర్శంగా నిలిచాయి. ఇక్కడి చర్యలపై అన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఆసక్తి చూపుతున్నాయి. ఈ రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దీనికోసం అమలయ్యే ప్రణాళికల్లోని విషయాల్ని కేంద్ర ప్రభుత్వం తన నివేదికలో వెల్లడించింది.
జాతీయస్థాయిలో రాష్ట్రానికి ప్రథమ స్థానం
ప్రతి గ్రామంలో ప్రత్యేక పథకాలకు ప్రణాళిక
- ఈనాడు, చెన్నై
యావత్తు దేశానికి గ్రామీణ ప్రాంతాలలో సురక్షిత నీటి సరఫరాలో దక్షిణాదిన ఉన్న తమిళనాడు, పుదుచ్చేరి ఆదర్శంగా నిలిచాయి. ఇక్కడి చర్యలపై అన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఆసక్తి చూపుతున్నాయి. ఈ రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దీనికోసం అమలయ్యే ప్రణాళికల్లోని విషయాల్ని కేంద్ర ప్రభుత్వం తన నివేదికలో వెల్లడించింది.
జల్ జీవన్ మిషన్ ఆధ్వర్యంలోని ఆరు బృందాలు ఈ ఏడాది మార్చి 9 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు వేర్వేరు జిల్లాల్లో సర్వేలు నిర్వహించాయి. గ్రామాల్లోని ఇళ్లు, పైపులైన్ల నుంచి నీటి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపాయి. వాటి ఫలితాలు, స్థానికంగా నిర్వహించిన సర్వేలోని వివరాల ఆధారంగా ర్యాంకుల్ని కేటాయించారు. ప్రత్యేకించి నీటి కనెక్షన్ల కవరేజీ 60 శాతంకన్నా తక్కువగా ఉన్న కేటగిరీలో తమిళనాడు దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. 60శాతం కన్నా ఎక్కువగా ఉన్న కేటగిరీలో పుదుచ్చేరి 1వ ర్యాంకును సాధించింది. తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 124లక్షల గృహాలుండగా.. అందులో 69 లక్షల ఇళ్లకు తాగునీటి పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు.
భారీగా ప్రాజెక్టులు..
స్థానికంగా నీటి వనరులు లేని గ్రామాలకు ప్రత్యేక తాగునీటి ప్రాజెక్టుల ద్వారా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే చాలా అందుబాటులోకి వచ్చాయని, మరిన్ని నిర్మాణంలో ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం జల్జీవన్మిషన్ పథకంలో భాగంగా రూ.18వేల కోట్లతో 42 కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు మరో 56 చోట్ల మరమ్మతులు చేపడుతున్నట్లుగా వెల్లడిస్తున్నారు. మరిన్ని భారీ ప్రాజెక్టులకు కేంద్ర సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.
ఏడాదిలో ఎంతో మార్పు
ఒక్క ఏడాదిలోనే గ్రామీణ తాగునీటి సరఫరాలో భారీ పురోగతి సాధించినట్లుగా కేంద్ర ప్రభుత్వం నివేదికలో వెల్లడించారు. సరఫరా చేసే నీటిలో తాగునీటికి యోగ్యంగా 90శాతానికి మించి ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడును ప్రత్యేకంగా చూపారు. ఈ రాష్ట్రంలో 97శాతం గృహాల్లో సురక్షిత నీరు పైపులైన్ల ద్వారా సరఫరా అవుతున్నట్లు వెల్లడించారు. తమిళనాడులో ఈ పరిస్థితి గతంలో 54శాతం గృహాలకే ఉండగా.. ఇప్పుడు 97శాతానికి వెళ్లిందని, ర్యాంకుల్లో ఏకంగా 18స్థానాలు పైకి వెళ్లినట్లుగా తెలిపారు.
ప్రజల్లో సంతృప్తి
గ్రామాల్లో 82 శాతం గృహాల్లో తాగునీటి సరఫరా చాలా బాగున్నట్లుగా కేంద్ర నివేదికలో పేరొన్నారు. మొత్తంగా తమిళనాడులో నీటిసరఫరా సంతృప్తికరంగా మెరుగైనట్లుగా తెలిపారు. 2020-21లో కేవలం 39 శాతం గృహాల్లో మాత్రమే ఇది ఉండగా, ఇప్పుడది 86 శాతానికి చేరింది. రోజువారీగా సరఫరా అయ్యే మోతాదులో 88 నుంచి 94 శాతం గృహాలకు పెరిగింది. సమయానుకూలంగా సరఫరాలో 84 నుంచి 93 శాతం చేరింది. ఈ కేటగిరిలో ఏకంగా 20స్థానాల ముందుకు తమిళనాడు వెళ్లింది. జాతీయ ప్రమాణాలకు తగ్గట్లు 95శాతం గృహాలకు తాగునీరు అందుతోంది. 73శాతం గ్రామాల్లో నాణ్యతాపరీక్షల కిట్లు అందుబాటులో ఉన్నట్లు నివేదికలో తెలిపారు.
స్థానికంగానే నిల్వ
రాష్ట్రంలో 98శాతం గ్రామాల్లో అందుబాటులో నీటి నిల్వలు ఉన్నట్లుగా తెలిపారు. గ్రామాల్లోనే స్థానికంగా నీటిపథకాల్ని వృద్ధి చేసుకున్న జాబితాలో తెలంగాణతో కలిపి తమిళనాడులో దేశంలోనే టాప్గా ఉంది. ఓవరాల్గా రాష్ట్రం మెరుగైన ప్రతిభ కనబరిచింది. గృహాల్లో 93శాతం, హర్ఘర్ జల్ గ్రామాల్లో 95 శాతం బాగున్నట్లుగా తెలిపారు.
ప్రభావిత జిల్లాల్లో ఇలా..
జపనీస్ ఎన్సెఫాలిటీ అక్యూట్ ఎన్సెఫాలిటీస్ సిండ్రోమ్ (జేఈ-ఏఈఎస్) ప్రభావిత జిల్లాల్లో తాగునీటి సరఫరా చాలా మెరుగ్గా ఉన్నట్లుగా నివేదించారు. వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి ఇతరత్రా ప్రభావాలకు లోనైన గ్రామాల్లోనూ సర్వే బృందాలు పరిశీలించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ లక్ష్యాల్ని అధిగమిస్తున్నట్లు, సురక్షిత నీటిని సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.
పుదుచ్చేరిలో 99 శాతం
60శాతం మించి తాగునీటి సరఫరా కవరేజీ ఉన్న రాష్ట్రాల కేటగిరీలో పుదుచ్చేరి మొదటిర్యాంకులో నిలిచింది. ఇక్కడ తాగునీటి కనెక్షన్లలో, సరఫరా మొతాదులో 100శాతం గృహాలకు నీరందుతోంది. క్రమం తప్పకుండా నీరివ్వడం, రక్షిత నీటిలో సరఫరా అవుతుండటంలో 99శాతం గృహాలు ముందున్నట్లుగా చూపారు. ఓవరాల్గా 88శాతం సంతృప్తి స్థాయిని ఈ కేంద్రపాలిత ప్రాంతం అందుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరూరులో.. 4 ఈవీఎంలు!
[ 18-04-2024]
లోక్సభ సమరంలో ఓటువేసే తేదీ వచ్చేసింది. 19.. అంటే రేపే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకు తగ్గ ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ పూర్తిచేసింది. ఓటింగ్ యంత్రాల తరలింపు ప్రక్రియలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. -
ఓటు భావితరాన్ని కాపాడాలి: స్టాలిన్
[ 18-04-2024]
ప్రజల ఓటు భావితరాన్ని కాపాడాలంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. డీఎంకే ఎంపీ అభ్యర్థులు కళానిధి వీరాసామి(ఉత్తర చెన్నై), దయానిధి మారన్(మధ్య చెన్నై), తమిళచ్చి తంగపాండియన్(దక్షిణ చెన్నై)కు మద్దతుగా.. -
సమస్యలు పరిష్కరించండి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలకు కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. అన్నానగర్లోని ‘ఫెడరేషన్ ఆఫ్ అన్నానగర్ రెసిడెంట్్స అసోసియేషన్స్’ (ఎఫ్ఏఎన్ఆర్ఏ) తమ డిమాండ్లను సెంట్రల్ చెన్నై లోక్సభ అభ్యర్థుల ముందుంచారు. -
తెన్కాశిలో నెగ్గేదెవరు?
[ 18-04-2024]
పశ్చిమ కనుమల్లోని తెన్కాశి నియోజకవర్గం పునర్విభజనకు ముందు పూర్తిగా తిరునెల్వేలి జిల్లాలో ఉండేది. ఆ తర్వాత తెన్కాశి, కడైయనల్లూర్, వాసుదేవనల్లూర్(రిజర్వు), శంకరన్కోవిల్(రిజర్వు), విరుదునగర్లోని శ్రీవిల్లిపుత్తూర్(రిజర్వు), -
దూరదృష్టితో అభివృద్ధి ప్రణాళికలు
[ 18-04-2024]
దూరదృష్టితో అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తానని అన్నాడీఎంకే దక్షిణ చెన్నై అభ్యర్థి జయవర్ధన్ తెలిపారు. శ్రీరామనవమి పురస్కరించుకుని అయోధ్యకుప్పంలోని రాముడి ఆలయంలో పూజల అనంతరం బుధవారం ప్రచారం చేశారు. -
ప్రజాసేవకు వచ్చాం: ప్రేమలత
[ 18-04-2024]
ప్రజలకు సేవ చేసేందుకు తాము వచ్చామని ప్రేమలతా విజయకాంత్ అన్నారు. విరుదునగర్ లోక్సభ స్థానంలో పోటీచేస్తున్న కుమారుడు విజయ ప్రభాకరన్కి మద్దతుగా డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలతా బుధవారం -
ఇండియా కూటమిని గెలిపిస్తే అందరికీ సమాన విద్య
[ 18-04-2024]
అందరికీ సమానమైన విద్య అందించేందుకు ఇండియా కూటమికి ఓటు వేయాలని కనిమొళి తెలిపారు. డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి, తూత్తుక్కుడి అభ్యర్థి కనిమొళి బుధవారం తిరుచ్చెందూర్ ప్రచారంలో మాట్లాడుతూ. -
మూడో ప్రయత్నంలో 871వ ర్యాంకు
[ 18-04-2024]
సివిల్ సర్వీసెస్ పరీక్షలో పీఎఫ్ కార్యాలయంలో సహాయకురాలిగా పనిచేస్తున్న ఇన్బ 851వ ర్యాంకు సాధించారు. ఆమె మాట్లాడుతూ.. నా సొంతూరు తెన్కాశి జిల్లా వాసుదేవనల్లూర్. -
డీఎంకే, భాజపాకు ఓటు వేయటం ఒకటే: ఈపీఎస్
[ 18-04-2024]
డీఎంకే, భాజపాలకు ఓటేయటం ఒకటేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో...
తాజా వార్తలు (Latest News)
-
బేబీ ఫుడ్లో చక్కెర.. వివరణ ఇచ్చిన నెస్లే ఇండియా
-
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
-
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!