విదేశాల్లో మన రైల్వేకు డిమాండ్
వందేభారత్ లాంటి అద్భుత హైస్పీడ్ రైలు ఆవిష్కరణ.. దేశంలోని పట్టాలపై రివ్వుమని పరుగులు తీస్తోంది. దేశానికి అవసరమైన రైళ్లనే కాదు, విదేశాలకు అవసరమైన రైళ్లనూ తయారుచేసి ఇవ్వడంలో భారతీయ రైల్వే జోరుగా కదులుతోంది.
ఐదేళ్లలో పెరిగిన ఆర్డర్లు
- ఈనాడు, చెన్నై
శ్రీలంకకు పంపిన తాజా డెమూ రైలు.. కోచ్లోని లోపలి భాగం
వందేభారత్ లాంటి అద్భుత హైస్పీడ్ రైలు ఆవిష్కరణ.. దేశంలోని పట్టాలపై రివ్వుమని పరుగులు తీస్తోంది. దేశానికి అవసరమైన రైళ్లనే కాదు, విదేశాలకు అవసరమైన రైళ్లనూ తయారుచేసి ఇవ్వడంలో భారతీయ రైల్వే జోరుగా కదులుతోంది. ఇప్పటికే సుమారు 20 నుంచి 25 దేశాలకు ఇక్కడి కోచ్లు, లోకోలు, వ్యాగన్లు వెళ్తున్నాయి. విదేశీయుల మనసు దోచుకుంటున్నాయి.
విదేశాలకు భారతీయ రైల్వేకోచ్లు వెళ్లడమనేది కొత్తమీ కాదు. కానీ భారత్లో రైల్వేపరంగా తీసుకొస్తున్న సాంకేతికత విదేశీ ప్రభుత్వాల్ని మరింతగా ఆకర్షిస్తున్నాయి. ప్రత్యేకించి ఎక్కువ సామర్థ్యం ఉన్న లోకో (రైల్వే ఇంజిన్లు), ఎల్హెచ్బీ ఏసీ, నాన్ఏసీ కోచ్లు, డెమూ రైళ్లకు బాగా డిమాండ్ వస్తోంది. ఈ తరహా ఆర్డర్లు గత 5 ఏళ్లలో పెరిగినట్లుగా రైల్వే అధికారులు స్పష్టత ఇస్తున్నారు. వందేభారత్ ఆవిష్కరణ తెచ్చిన చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) నుంచి గత రెండేళ్లలోనే ఏకంగా 200 కోచ్లు తయారై వెళ్లాయి. ఇవన్నీ శ్రీలంక ప్రభుత్వమే తీసుకుంది. ఈ దేశంతోపాటు నేపాల్, అంగోలా లాంటిచోట్లకు కోచ్లు పంపడంతో గత 4 ఏళ్లలో ఐసీఎఫ్కు రూ.450కోట్లు సమకూరినట్లుగా రైల్వే అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక్కడి నుంచి 1967లోనే కోచ్లు, లోకోలు, షెల్స్ విదేశాలకు తరలి వెళ్లడం మొదలవగా.. ఇప్పటిదాకా 15 దేశాల్లో ఐసీఎఫ్ రైళ్లు తిరుగుతున్నాయి. మొత్తం 875 కోచ్లు, 359 బోగీలు, 11 షెల్స్లను ఇక్కడి యంత్రాంగం తయారుచేసి ఎగుమతి చేసింది. అత్యధిక రైళ్లు తైవాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, వియత్నాం, అంగోలా తదితర దేశాలకు తరలించారు. తాజాగా బంగ్లాదేశ్ నుంచి మరిన్ని ఆర్డర్లు ఇచ్చేందుకు ఆ దేశ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది.
ఆఫ్రికా కోసం..
తూర్పు ఆఫ్రికా దేశమైన మొజాంబిక్కు మన దేశం నుంచి లోకోలు, కోచ్లు, వ్యాగన్లు తరలి వెళ్తున్నాయి. అక్కడి మొజాంబిక్ పోర్ట్స్ అండ్ రైల్వేస్ విభాగం భారత ప్రభుత్వ సహకారంతో ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి 95 మిలియన్ యూఎస్ డాలర్ల రుణాన్ని పొందింది. ఈ నిధులతో రైళ్ల తయారీకోసం గతేడాది కీలక ఒప్పందం చేసుకుంది. ఈ దేశం కోసం రాయ్బరేలీలోని మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ (ఎంసీఎఫ్) నుంచి 90 కోచ్లు, 30 డెమూ కోచ్లు తయారై వెళ్తున్నాయి. ఇందులో ఫస్ట్క్లాస్, సెకండ్క్లాస్ ఏసీ కోచ్లు, నాన్ఏసీ కోచ్లున్నాయి. ఇప్పటికే చాలా కోచ్ల్ని అక్కడికి ఎగుమతి చేశారు. ఇదే దేశం కోసం వారణాసి బనారస్ లోకోమోటివ్ వర్క్స్ (బీఎల్డబ్ల్యూ)లో 3 వేల హెచ్పీ సామర్థ్యమున్న లోకోలు తయారవుతున్నాయి. కపుర్తలలోని రైల్వేకోచ్ ఫ్యాక్టరీ (ఆర్సీఎఫ్) నుంచి బంగ్లాదేశ్కు 120 ఎల్హెచ్బీ కోచ్లు తయారై వెళ్లాయి. వీటి నుంచి రూ.367 కోట్లు సమకూరినట్లు అధికారులు తెలిపారు.
‘వందేభారత్’కు ప్రణాళిక
తాజాగా దేశవ్యాప్త చర్చగా ఉన్న హైస్పీడ్ రైలు వందేభారత్ను చెన్నై ఐసీఎఫ్ నుంచే విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తులు మొదలయ్యాయి. భారత అవసరాలకోసం సుమారు 400 వందేభారత్ రైళ్లను ఇవ్వడంతోపాటు ఈ తరహా సాంకేతికతను విదేశాలకు ఇచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు. ప్రత్యేకించి ఇతర దేశాలకోసం 2026-27 నుంచి తయారీ మొదలవవచ్చని ఐసీఎఫ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ రైలు తాజాగా గంటకి 180 కి.మీ. వేగాన్ని అందుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కదిలొచ్చిన ఓటర్లు
[ 20-04-2024]
ఓటు వేసేందుకు పెద్దఎత్తున ప్రజలు ముందుకొచ్చారు. ఇండియా, ఎన్డీయే, అన్నాడీఎంకే కూటముల మధ్య జరిగే ప్రధాన పోరులో అభ్యర్థుల్ని శాసించేందుకు ఓటర్లు తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. -
డీఎంకే డబ్బుతో గెలవాలనుకుంటోంది: అన్నామలై
[ 20-04-2024]
డబ్బు ఎరచూపి కోవైని సొంతం చేసుకోవాలనుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కోవై లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి అన్నామలై ఆరోపించారు. ఆయన శుక్రవారం కరూర్ జిల్లా అరవక్కురిచ్చిలోని పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
సింగపూర్ నుంచి వచ్చి..
[ 20-04-2024]
పుదుచ్చేరిలో లోక్సభ ఎన్నికల పోలింగ్ శుక్రవారం 7 గంటలకే ప్రారంభమైంది. పుదుచ్చేరి కిరుమాంబాక్కం పోలింగ్బూత్లో సింగపూర్ నుంచి వచ్చిన భారత పౌరహక్కు పొందిన యువ ఓటరు ఆర్ముగం పువియరసి(18)తన తల్లి ఆర్ముగం మాలతితో వచ్చి తొలిఓటు హక్కు వినియోగించుకున్నారు. -
40 స్థానాల్లో ఇండియా కూటమిదే గెలుపు: పి.చిదంబరం
[ 20-04-2024]
తమిళనాడు, పుదుచ్చేరిలోని 40 నియోజకవర్గాల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు. శివగంగై జిల్లా కారైక్కుడి వద్ద ఉన్న కండనూర్ సిట్టాళ్ ఆచ్చి హైస్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. -
అట్టడుగుకు రాజధాని
[ 20-04-2024]
చెన్నై జిల్లాలో కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా శుక్రవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మిగతా నియోజకవర్గాలతో పోల్చితే రాజధాని చెన్నైలో పోలింగ్శాతం అట్టడుగుకు చేరింది. -
మా బాధ్యత నెరవేర్చాం.. మరి మీరు!
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి తమ ప్రజాస్వామ్య బాధ్యతను నెరవేర్చడానికి సినీ తారలు పోలింగ్ బూత్లకు తరలివచ్చారు. క్యూలో నిలబడి తమ వంతురాగానే ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
ప్రశాంతంగా ముగిసిన సార్వత్రిక పోరు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో మొదటి విడతలో పోలింగ్ జరిగిన తమిళనాడులో ఓటర్లు, సినీ, రాజకీయ ప్రముఖులు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
పనసపండు గుర్తు ఎక్కడ?
[ 20-04-2024]
స్వతంత్ర అభ్యర్థుల మధ్య చిక్కుకున్న మాజీ సీఎం ఓ.పన్నీర్సెల్వాన్ని గుర్తించలేక ఓటర్లు తికమకపడ్డారు. రామనాథపురం లోక్సభ నియోజకవర్గంలో భాజపా కూటమి మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా మాజీ సీఎం బరిలో ఉన్నారు. -
ఇక్కట్లు తీరలేదని ఎన్నికల బహిష్కరణ
[ 20-04-2024]
కృష్ణగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వేప్పన్హళ్లి అసెంబ్లీ నియోజకవర్గం మేడ అగ్రహారం పంచాయతీలోని కడవరహళ్లి గ్రామంలోని 450 మందికి పైగా ఓటర్లు, కరుక్కన్అళ్లి గ్రామంలో 1,050 మంది ఓటర్లు, తేన్గనికోట్టై సమీపంలోని కారండఅళ్లి పంచాయతీ కచ్చువాడి గ్రామంలో 961 మంది ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు.