logo

మైలు రాయికి ఆయుధ పూజ

మైలు రాయికి ఆయుధపూజ చేసిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కోయంబత్తూరు తొండాముత్తూర్‌ వద్ద పూలువపట్టిలో హైవేశాఖ అధికారులు కొత్తగా మైలురాయిని ఏర్పాటు చేశారు

Published : 05 Oct 2022 01:27 IST

మైలురాయి

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: మైలు రాయికి ఆయుధపూజ చేసిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కోయంబత్తూరు తొండాముత్తూర్‌ వద్ద పూలువపట్టిలో హైవేశాఖ అధికారులు కొత్తగా మైలురాయిని ఏర్పాటు చేశారు. దానిపై సిరువాణి 20 కిలోమీటర్లు అని ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు మైలురాయిని నీళ్లతో కడిగి, పూల మాల వేసి అలంకరించి ఆయుధపూజ చేశారు. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని