ఎయిమ్స్ వ్యవహారంలో కేంద్రం నాటకాలు
ఎయిమ్స్ నిర్మాణం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పళనివేల్ త్యాగరాజన్ అన్నారు.
మంత్రి పళనివేల్ త్యాగరాజన్
రేషన్ దుకాణాన్ని ప్రారంభిస్తున్న పళనివేల్ త్యాగరాజన్
ఆర్కేనగర్, న్యూస్టుడే: ఎయిమ్స్ నిర్మాణం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పళనివేల్ త్యాగరాజన్ అన్నారు. మదురైలోని సుందరరాజపురంలో రేషన్ దుకాణాన్ని, సుబ్రమణ్యపురంలో కౌన్సిలర్ కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజలకు ఉచితాలు ఇవ్వడం, నిధుల వనరుల గురించి సుప్రీంకోర్టు 2013లో తీర్పుకు, ఎన్నికల కమిషన్ లేఖకు ఒకదానికొకటి వైరుధ్యం ఉందన్నారు. ఒకే సమయంలో ప్రకటించిన రెండు ఎయిమ్స్ నిర్మాణాల్లో ఒకటి ప్రారంభించబోతున్నారని చెప్పారు. మరోచోట గోడ కూడా నిర్మించలేదన్నారు. ఎయిమ్స్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో తీసుకొస్తున్న పథకాలకు కేంద్రం పేరు మారుస్తుందని పేర్కొన్నారు. జీఎస్టీ కౌన్సిల్ సమవేశం రాష్ట్రంలో జరుగుతుందని ప్రకటించారని, కానీ గుర్రపు పందేలు, ఆన్లైన్ క్రీడలు, క్యాసినోలను పన్ను పరిధిలోకి తీసుకురావడానికి సంబంధించిన నివేదిక సిద్ధం కానందున కౌన్సిల్ సమావేశాన్ని జరపలేకపోతున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారని చెప్పారు. సమావేశాన్ని త్వరగా జరపాలని వారికి విన్నవించినట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నటుడు విజయ్ కుమారుడు కొత్త సినిమా.. హీరోగా కాదు!
[ 29-03-2024]
నటుడు విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ 2009లో విడుదలైన ‘వేట్టైక్కారన్’ చిత్రంలోని ‘నా అడిచ్చా తంగమాట్ట’ పాటలో తన డ్యాన్స్ ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. -
అంతు చిక్కని ఓటరు నాడి!
[ 29-03-2024]
ఎన్నికల ఫలితాలు దేశమంతా ఒకలా ఉంటే.. తమిళనాడులో మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి. లోక్సభ ఎన్నికల్లో ఓ తరహా తీర్పు, అసెంబ్లీ ఎన్నికల్లో మరో రకమైన తీర్పు ఇక్కడే కనిపిస్తుంటుంది. -
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
[ 29-03-2024]
రామనాథపురంలో ఐదుగురు ఓ పన్నీర్సెల్వంల నామినేషన్లు ఆమోదించారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కృతుడైన మాజీ సీఎం ఓ.పన్నీర్సెల్వం అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పునరుద్ధరణ కమిటీ పేరుతో పనిచేస్తున్నారు. -
ప్రాణస్నేహితుల్లా మెలిగాం
[ 29-03-2024]
డీఎంకేపై వ్యరేతికతతో పార్టీలో చేరిన గణేశమూర్తి ఎంపీ అయ్యారని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో గుర్తు చేశారు. ఆయన కోవై విమానాశ్రయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. -
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె శివగంగైలో నామినేషన్
[ 29-03-2024]
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె స్వతంత్ర అభ్యర్థిగా శివగంగై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు నామినేషన్ దాఖలు చేయడం కలకలం సృష్టించింది. -
ప్రధాని నాటకాలు ప్రజలకు తెలుసు
[ 29-03-2024]
ప్రధాని మోదీ ఎన్నికల నాటకాలు ప్రజలకు తెలుసని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్లో డీఎంకే ఎన్నికల ప్రచార సమావేశం బుధవారం రాత్రి జరిగింది. -
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదు : కనిమొళి
[ 29-03-2024]
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదని డీఎంకే ఎంపీ కనిమొళి పేర్కొన్నారు. కరూర్ వెంగమేడు అన్నా విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జ్యోతిమణికి మద్దతుగా గురువారం ఆమె ప్రచారం చేశారు. -
కవిన్ డబ్బింగ్ పూర్తి
[ 29-03-2024]
బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి ‘టాటా’ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన నటుడు కవిన్. ఆ చిత్రం విజయం తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఇళనుడన్ దర్శకత్వంలోని ‘స్టార్’ చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్