తమిళుల గుర్తింపు దాచలేరు
తమిళుల గుర్తింపుని కొందరు వారి అవసరాల కోసం దాచే ప్రయత్నం చేస్తున్నారని పుదుచ్చేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు.
తమిళిసై
విలేకరులతో మాట్లాడుతున్న తమిళసై
కోయంబత్తూరు, న్యూస్టుడే: తమిళుల గుర్తింపుని కొందరు వారి అవసరాల కోసం దాచే ప్రయత్నం చేస్తున్నారని పుదుచ్చేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. కోయంబత్తూరు అవినాశిలింగం మహిళా యూనివర్సిటీలో జరగనున్న స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఆమె గురువారం విమానంలో కోయంబత్తూరు చేరుకున్నారు. విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ... పుదుచ్చేరి వెలుగులోనే ఉందని, చీకటిలో మునిగిపోలేదన్నారు. నాలుగు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా నిలిచిందన్నారు. కొంత మంది వల్ల కోత ఏర్పడినా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారన్నారు. విద్యుత్బోర్డు సిబ్బంది ఆందోళన విరమించుకోవడం సంతోషకరమన్నారు. విద్యుత్తుబోర్డు ప్రైవేటీకరణ అంటే పూర్తిగా ప్రైవేటుపరం చేయడం కాదన్నారు. దీని వలన సిబ్బంది, అధికారుల పదోన్నతుల్లో ఎలాంటి నష్టం ఉండదన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చర్చించి నిర్ణయాలు తీసుకుంటారన్నారు. రాజరాజచోళన్ గురించి డైరెక్టరు వెట్రిమారన్ చేసిన వ్యాఖ్యలకు కమల్హాసన్ మద్దతు తెలపడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... తమిళుల గుర్తింపును కొందరు తమ అవసరాల కోసం దాచే ప్రయత్నం చేస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలన్నారు. శైవం, వైష్ణవ మతాలు హిందుత్వ గుర్తింపు అని, వాటిని దాచడానికి ప్రయత్నించడం సరైనది కాదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని