Jayalalithaa: వేలిముద్ర వేయడం చూడలేదు: జయ మృతి వ్యవహారంలో అధికారుల వెల్లడి
దివంగత ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో ఉండగా వేలిముద్ర తీసుకున్న విషయాన్ని ముందుగా తమకు చెప్పలేదని, తమ సమక్షంలో వేలిముద్ర తీసుకోలేదని ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపినట్టు జస్టిస్ ఆరుముగస్వామి విచారణ కమిషన్ నివేదిక వెల్లడించింది.
సమగ్ర విచారణ అవసరం లేదన్న కమిషన్
చెన్నై, న్యూస్టుడే: దివంగత ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో ఉండగా వేలిముద్ర తీసుకున్న విషయాన్ని ముందుగా తమకు చెప్పలేదని, తమ సమక్షంలో వేలిముద్ర తీసుకోలేదని ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపినట్టు జస్టిస్ ఆరుముగస్వామి విచారణ కమిషన్ నివేదిక వెల్లడించింది. దీనిపై కమిషన్ ఒకింత విస్మయాన్ని వ్యక్తం చేసినా సమగ్ర విచారణ అవసరంలేదని భావించింది. జయలలిత ఆస్పత్రిలో ఉండగా జరిగిన తిరుప్పరంకుండ్రం, అరవకురిచ్చి, తంజావూర్ శాసనసభ ఎన్నికల్లో జయలలిత బొటనవేలి ముద్రలతో ఉన్న ఏ, బి ఫారాలను ఎన్నికల అధికారులకు అన్నాడీఎంకే అభ్యర్థులు సమర్పించడం అప్పట్లో వివాదాస్పదమైంది. సంతకాలు లేకుండా వేలిముద్రలు ఉండటం పలు అనుమానాలను రేకెత్తించింది. వేలిముద్రలు తీసుకునేటప్పుడు ఆమె ప్రాణాలతో ఉండే అవకాశంలేదంటూ తిరుప్పరంకుండ్రం డీఎంకే అభ్యర్థి డాక్టర్ పి.శరవణన్ బహిరంగ ఆరోపణలు చేశారు. ఇదే విషయమై మద్రాసు హైకోర్టులోనూ పిటిషన్ వేశారు. ఎన్నికల కమిషన్కు సమర్పించిన ఫారాల్లోని వేలిముద్రలను బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలు రిజిస్టర్లో ఉన్న జయలలిత వేలిముద్రలతో సరిపోల్చాలనీ డిమాండ్ చేశారు. తన విచారణలో భాగంగా ఈ వ్యవహారంపై కూడా జస్టిస్ ఆరుముగస్వామి కమిషన్ విచారించింది. ఎన్నికల కమిషన్ అనుమతితో జయలలిత వేలిముద్రను ఏ, బీ ఫారాల్లో తీసుకున్నట్టు అన్నాడీఎంకే తరఫున ఆరుముగస్వామి విచారణ కమిషన్కు వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందే ముఖ్యమంత్రి దగ్గర వేలిముద్ర తీసుకునే ప్రతిసారి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి లేక ప్రభుత్వ అధికారులైన ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శులకు తెలియజేయాలి. జయలిత వ్యవహారంలో అలా జరగలేదనే విషయం విచారణలో స్పష్టమైంది.
అధికారులకు ముందుగా చెప్పలేదు
జయలలిత నుంచి వేలిముద్రలు తీసుకోవడం గురించి తనకు ముందుగా చెప్పలేదని నాటి స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ షీలా బాలకృష్ణన్ తెలిపారు. జయలలిత నుంచి సంతకం చేయించుకోవడం నాటి క్యాంపు కార్యాలయ కార్యదర్శి రామలింగం బాధ్యత అని, సంతకం పొందడానికి ఆయనకు రాతపూర్వకంగా ఎలాంటి అనుమతి ఇవ్వలేదని నాటి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్ పి.రామమోహన్రావు వెల్లడించారు. వేలిముద్రల గురించి ఎవరూ అలాంటి అనుమతి కోరలేదని, అందువల్ల ఎలాంటి అనుమతి ఇవ్వలేదని జయలలిత వ్యక్తిగత కార్యదర్శి కేఎన్ వెంకట్రామణన్ తెలిపారు. వేలిముద్ర తీసుకోవడం గురించి తనకు ఎవరూ వెల్లడించలేదని జయలలిత క్యాంపు కార్యాలయ కార్యదర్శి రామలింగం పేర్కొన్నారు. దీంతో జయలలిత నుంచి వేలిముద్ర తీసుకోవడం గురించి ముందుగా ప్రభుత్వ సంబంధిత అధికారులు ఎవరికీ తెలియదనే విషయాన్ని కమిషన్ గ్రహించింది.
పలువురికి మొట్టికాయలు
జయలలిత మృతిపై విచారించిన జస్టిస్ ఆరుముగస్వామి కమిషన్ తన నివేదికలో పలువురికి మొట్టికాయలు వేసింది. జయలలితకు బాగోలేదని తెలిసిన వెంటనే ఆమెను వ్యక్తిగత వైద్యుడిగా ఉన్న శివకుమార్ పరీక్షించి ఉండాల్సిందని కమిషన్ అభిప్రాయపడింది. ఇది కమిషన్ దృష్టిలో నిర్లక్ష్యంగా తెలిపింది. అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలితకు ‘సెప్సిస్’పై మాత్రమే దృష్టి సారించి 2016 సెప్టెంబరు 27 అర్ధరాత్రి వరకు దానికి చికిత్సలు అందించారని, ఆమె ఆరోగ్యం క్షీణించడానికి కారణమైన హృద్రోగానికి చికిత్సలు అందించడం మరిచారని తెలిపింది. అపోలోకు ఐదుసార్లు విచ్చేసిన ఎయిమ్స్ బృందం ఎలాంటి చికిత్సలు సిఫారసు చేయలేదని పేర్కొంది. నాటి ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ సాక్ష్యం తిరస్కరించేలా, బాధ్యతారాహిత్యంగా ఉండటం బాధాకరమని తెలిపింది. మెరుగైన చికిత్సలు కోసం జయలలితను విదేశాలకు తీసుకెళ్లకపోవడాన్ని ప్రశ్నించగా... ఆ చర్యలు భారతీయ వైద్యులను అవమానించేలా ఉంటాయని సమాధానం ఇవ్వడంపై విస్మయాన్ని వ్యక్తం చేసింది. అలాంటప్పుడు చికిత్సలు కోసం లండన్ నుంచి వైద్యులను, సింగపూర్ నుంచి ఫిజియోథెరఫిస్ట్ను అపోలోకు ఎందుకు రప్పించినట్టని ప్రశ్నించింది. ఆ చర్యలు భారతీయ వైద్యులను అవమానించేలా లేవా? అనీ ప్రశ్నించింది. వెటర్నరీ వైద్యుడైన ఆయన ఆరోగ్యశాఖ కార్యదర్శి అర్హత ప్రాతిపదికన తనను వైద్యుడిగా చెప్పకపోవడమే శ్రేష్టమని వ్యాఖ్యానించింది. జయలలిత పూర్తిగా కోలుకున్నారని, డిశ్చార్జి కావడం ఆమె నిర్ణయంపై ఆధారపడిందంటూ అపోలో ఆస్పత్రి సంస్థల ఛైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి అప్పట్లో విలేకర్లకు వెల్లడించడాన్ని విమర్శించింది. ఆ వ్యాఖ్యలు వాస్తవదూరమనే విషయం విచారణలో తెలిసిందని పేర్కొంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆస్పత్రి ఛైర్మన్ ఇలా మీడియాతో బాధ్యతారాహిత్య అభిప్రాయాన్ని వెల్లడించడం ఆశ్చర్యాన్ని కలిగించిందని తెలిపింది. జయలలితను బాగు చేయాలని భావించడం వాస్తవమైతే తొరసిక్ నిపుణులను నియమించి, వారి సూచనల మేరకు చికిత్సలు అందించి ఉంటారని, ఇది మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉందని అపోలో ఆస్పత్రి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. జయలలితకు నమ్మిన బంటుగా ఉన్న ఓ.పన్నీర్సెల్వం సైతం ఆమె మృతిని రాజకీయ లబ్ధికి వాడుకున్నట్టు కమిషన్ అభిప్రాయపడింది.
పొంతనలేని సమాధానం: 2016 అక్టోబరు 27 సాయంత్రం 6.30 గంటలకు జయలలిత నుంచి వేలిముద్రలు తీసుకున్నట్టు అపోలో ఆస్పత్రి అనుసంధాన అధికారిగా ప్రభుత్వం నియమించిన డాక్టర్ పి.బాలాజీ కమిషన్కు మొదట్లో వెల్లడించారు. వేలిముద్ర తీసుకున్నట్టు ఆయన చెప్పిన సమయంలో జయలలిత నిద్రపోతున్నట్టు ఆస్పత్రి చార్ట్లో నమోదైంది. ఆ రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఆమె నిద్రించినట్టు చార్ట్లో ఉంది. దీనిపై క్రాస్ ఎగ్జామిన్ చేయడంతో వేలిముద్ర తీసుకున్న సమయాన్ని సాయంత్రం 6 గంటలుగా బాలాజీ సవరించారని కమిషన్ నివేదిక పేర్కొంది. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా జయలలిత నుంచి వేలిముద్ర తీసుకున్న విషయాన్ని అన్నాడీఎంకే సీనియర్ నేత తంబిదురైను కమిషన్ ప్రశ్నించింది. ఆమె పార్టీ ప్రధానకార్యదర్శిగా ఉండటంతో వేలి ముద్రలు తీసుకోవడానికి ఎవరి అనుమతి తీసుకోవాల్సిన ఆవశ్యకత లేదని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో కమిషన్ ఏకీభవించింది. వేలిముద్రలు తమకు తెలియకుండా తీసుకున్నారని నాటి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, స్పెషల్ డ్యూటీ ఆఫీసర్, వ్యక్తిగత కార్యదర్శి వెల్లడించినా కమిషన్ పరిధి పరిమితుల దృష్ట్యా దీనిపై సమగ్ర అధ్యయనం అనవసరమని జరపాల్సిన ఆవశ్యకతలేదని భావించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
[ 25-04-2024]
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. -
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
[ 25-04-2024]
శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. -
మహిళల పాలిట రక్తపోటు
[ 25-04-2024]
అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి. -
ఆధారాలున్నా ఓటరు పేర్లు గల్లంతు
[ 25-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బర్డ్ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక బృందాలు
[ 25-04-2024]
తమిళనాడులో బర్డ్ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. -
జూన్లో కొత్త రోడ్లు
[ 25-04-2024]
కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
తమిళ అభిమానులకు కృతజ్ఞతలు
[ 25-04-2024]
ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష
[ 25-04-2024]
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్ బిస్కెట్ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. -
మత ఘర్షణలు సృష్టించేలా ప్రధాని ప్రచారం
[ 25-04-2024]
మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
మోదీ పాలనలో మైనారిటీలు ఇబ్బంది పడలేదు: ఓ పన్నీర్సెల్వం
[ 25-04-2024]
మోదీ పాలనలో మైనారిటీ ప్రజలు ఇబ్బంది పడలేదని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం తెలిపారు. మదురై తిరుప్పరకుండ్రం సుబ్రమణిస్వామి ఆలయంలో మంగళవారం మురుగన్ను దర్శించుకున్నారు. -
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ చర్యలు: స్టాలిన్
[ 25-04-2024]
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
[ 25-04-2024]
హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్