logo

Kushboo: ‘ఖుష్బూ మనసు గాయపడి ఉంటే క్షమాపణ చెబుతున్నా’

ఖుష్బూకు డీఎంకే అధిష్ఠాన వక్త సైదై సాదిక్‌ క్షమాపణ చెప్పారు. భాజపాలోని ఖుష్బూ తదితర నటీమణులను కించపరిచేలా సైదై సాదిక్‌ మాట్లాడారంటూ ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Updated : 29 Oct 2022 07:24 IST

చెన్నై, న్యూస్‌టుడే: ఖుష్బూకు డీఎంకే అధిష్ఠాన వక్త సైదై సాదిక్‌ క్షమాపణ చెప్పారు. భాజపాలోని ఖుష్బూ తదితర నటీమణులను కించపరిచేలా సైదై సాదిక్‌ మాట్లాడారంటూ ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఖుష్బూ ఓ ట్వీట్‌ను ఎంపీ కనిమొళికి ట్యాగ్‌ చేశారు. దానికి ఆమె క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైదై సాదిక్‌ కూడా ఖుష్బూకు ట్విట్టర్‌లో క్షమాపణ చెప్పారు. తన ప్రసంగాన్ని వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారని వివరణ ఇచ్చారు. అయినా ఖుష్బూ మనసు గాయపడి ఉంటే క్షమాపణ చెబుతున్నట్టు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని