Anushka Kolla: బాల మేధావి: 12 ఏళ్లకే కోడింగ్పై పట్టు.. ఉచిత బోధన!
బాల మేధావి అనుష్క కొల్లా భారతీయ నౌకాదళ కమాండర్ కేపీ శబరీష్, కేఎస్ రేణుక దంపతులకు 2009 సెప్టెంబరు 2న జన్మించింది. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న అనుష్క చిన్నతనం నుంచి ఎంతో హుషారుగా ప్రతి పనిలోనూ అంకితభావం ప్రదర్శించేది.
తల్లిదండ్రులు, చెల్లితో అనుష్క
చెన్నై (సాంస్కృతికం), న్యూస్టుడే: బాల మేధావి అనుష్క కొల్లా భారతీయ నౌకాదళ కమాండర్ కేపీ శబరీష్, కేఎస్ రేణుక దంపతులకు 2009 సెప్టెంబరు 2న జన్మించింది. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న అనుష్క చిన్నతనం నుంచి ఎంతో హుషారుగా ప్రతి పనిలోనూ అంకితభావం ప్రదర్శించేది. అనుష్క చురుకుదనాన్ని గమనించిన తల్లిదండ్రులు కోడింగ్ ప్రాముఖ్యతను వివరించారు.
రాబోయే రోజుల్లో ఉజ్వల భవిష్యత్తుకు కోడింగ్ మరింత ప్రాముఖ్యత సంతరించుకుంటుందని విద్యావేత్తలు చెబుతున్నారు. కోడింగ్ ఆవశ్యకతను గుర్తించిన అనుష్క రెండేళ్లుగా అంతర్జాలం ద్వారా ఎనిమిది నుంచి పదిహేను సంవత్సరాల వయస్సుగల విద్యార్థులకు కోడింగ్పై ఉచిత శిక్షణనిస్తోంది. వారానికి ఓ గంటపాటు తరగతులు నిర్వహిస్తోంది. మొదటి స్థాయిలో బేసిక్స్, రెండవ స్థాయిలో యాప్ డెవలప్మెంట్, మూడో లెవల్లో వృత్తిపరమైన విధానాలను బోధిస్తోంది. తన దగ్గర నేర్చుకుంటున్న విద్యార్థుల నైపుణ్యతను పరీక్షించేందుకు ప్రశ్నావళి కూడా రూపొందించారు.
కోడింగ్ ద్వారా మన సంస్కృతి, చరిత్ర, పురాణ కథలను కూడా పరిచయం చేశారు. ఏ విద్యనైనా నేర్చుకోవడం ఓ ఎత్తు అయితే.. ఇతరులకు నేర్పడం మరొక ఎత్తు. ఈ రెండింటిలోనూ అనుష్క సవ్యసాచి. ఇప్పటిదాకా దాదాపు 500 మంది విద్యార్థులకు కోడింగ్ నేర్పించింది. ఈ బాలిక సేవలను గుర్తించి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్) తాము నిర్వహించిన కార్యక్రమాల్లో అనుష్కను బాల ఉపాధ్యాయ, బాల ద్రోణాచార్య, హాల్ ఆఫ్ ఫేమ్ వంటి పురస్కారాలతో సత్కరించాయి. ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (అవోపా) తరఫున బాలికను ఉగాది పురస్కారంతో సత్కరించారు.
ఆనంద్శ్రీ ఫౌండేషన్ (ముంబయి) మహాత్మాగాంధీ అవార్డుతో సత్కరించింది. అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఓఎంజీ బుక్ ఆఫ్ రికార్డ్స్ అతి పిన్న వయసు బోధకురాలిగా గుర్తించి అనుష్కకు ధ్రువపత్రాలు అందించాయి. విద్యా రంగంలో అనుష్క అందిస్తున్న సేవను గుర్తించి నలంద విశ్వవిద్యాలయం ఈ ఏడాది ఫిబ్రవరిలో అందించిన గౌరవ డాక్టర్ అనుష్క కీర్తికిరీటంలో మరో కలికితురాయి. ప్రముఖ పారిశ్రామివేత్త, జయరాజ్ ఇంటర్నేషనల్ అధినేత తాడేపల్లి రాజశేఖర్ రూ.10 వేల నగదు బహుమతితో సత్కరించారు. కోడింగ్తో సరిపెట్టుకోకుండా కర్ణాటక సంగీతం, పాశ్చాత్య సంగీతంతోపాటు ఫుట్బాల్, స్కేటింగ్, సైక్లింగ్, రన్నింగ్లలో కూడా ప్రవేశం సంపాదించుకున్నారు. వీటిల్లో కూడా తన సత్తా చూపి తానేమిటో నిరూపించేందుకు అంకితభావంతో కృషి చేస్తోంది.
అందుకున్న పురస్కారాలతో...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరూరులో.. 4 ఈవీఎంలు!
[ 18-04-2024]
లోక్సభ సమరంలో ఓటువేసే తేదీ వచ్చేసింది. 19.. అంటే రేపే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకు తగ్గ ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ పూర్తిచేసింది. ఓటింగ్ యంత్రాల తరలింపు ప్రక్రియలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. -
ఓటు భావితరాన్ని కాపాడాలి: స్టాలిన్
[ 18-04-2024]
ప్రజల ఓటు భావితరాన్ని కాపాడాలంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. డీఎంకే ఎంపీ అభ్యర్థులు కళానిధి వీరాసామి(ఉత్తర చెన్నై), దయానిధి మారన్(మధ్య చెన్నై), తమిళచ్చి తంగపాండియన్(దక్షిణ చెన్నై)కు మద్దతుగా.. -
సమస్యలు పరిష్కరించండి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలకు కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. అన్నానగర్లోని ‘ఫెడరేషన్ ఆఫ్ అన్నానగర్ రెసిడెంట్్స అసోసియేషన్స్’ (ఎఫ్ఏఎన్ఆర్ఏ) తమ డిమాండ్లను సెంట్రల్ చెన్నై లోక్సభ అభ్యర్థుల ముందుంచారు. -
తెన్కాశిలో నెగ్గేదెవరు?
[ 18-04-2024]
పశ్చిమ కనుమల్లోని తెన్కాశి నియోజకవర్గం పునర్విభజనకు ముందు పూర్తిగా తిరునెల్వేలి జిల్లాలో ఉండేది. ఆ తర్వాత తెన్కాశి, కడైయనల్లూర్, వాసుదేవనల్లూర్(రిజర్వు), శంకరన్కోవిల్(రిజర్వు), విరుదునగర్లోని శ్రీవిల్లిపుత్తూర్(రిజర్వు), -
దూరదృష్టితో అభివృద్ధి ప్రణాళికలు
[ 18-04-2024]
దూరదృష్టితో అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తానని అన్నాడీఎంకే దక్షిణ చెన్నై అభ్యర్థి జయవర్ధన్ తెలిపారు. శ్రీరామనవమి పురస్కరించుకుని అయోధ్యకుప్పంలోని రాముడి ఆలయంలో పూజల అనంతరం బుధవారం ప్రచారం చేశారు. -
ప్రజాసేవకు వచ్చాం: ప్రేమలత
[ 18-04-2024]
ప్రజలకు సేవ చేసేందుకు తాము వచ్చామని ప్రేమలతా విజయకాంత్ అన్నారు. విరుదునగర్ లోక్సభ స్థానంలో పోటీచేస్తున్న కుమారుడు విజయ ప్రభాకరన్కి మద్దతుగా డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలతా బుధవారం -
ఇండియా కూటమిని గెలిపిస్తే అందరికీ సమాన విద్య
[ 18-04-2024]
అందరికీ సమానమైన విద్య అందించేందుకు ఇండియా కూటమికి ఓటు వేయాలని కనిమొళి తెలిపారు. డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి, తూత్తుక్కుడి అభ్యర్థి కనిమొళి బుధవారం తిరుచ్చెందూర్ ప్రచారంలో మాట్లాడుతూ. -
మూడో ప్రయత్నంలో 871వ ర్యాంకు
[ 18-04-2024]
సివిల్ సర్వీసెస్ పరీక్షలో పీఎఫ్ కార్యాలయంలో సహాయకురాలిగా పనిచేస్తున్న ఇన్బ 851వ ర్యాంకు సాధించారు. ఆమె మాట్లాడుతూ.. నా సొంతూరు తెన్కాశి జిల్లా వాసుదేవనల్లూర్. -
డీఎంకే, భాజపాకు ఓటు వేయటం ఒకటే: ఈపీఎస్
[ 18-04-2024]
డీఎంకే, భాజపాలకు ఓటేయటం ఒకటేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో...
తాజా వార్తలు (Latest News)
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్