చెన్నైలో మెగా జౌళి పార్కు
అంతర్జాతీయ ప్రమాణాలతో మెగా జౌళి పార్కును నగరంలో ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. మామల్లపురంలో చేనేత మ్యూజియం, పలు నగరాల్లో ఎగుమతి కేంద్రాలు కూడా నెలకొల్పనున్నట్లు పేర్కొన్నారు.
మామల్లపురంలో చేనేత మ్యూజియం
ముఖ్యమంత్రి స్టాలిన్ వెల్లడి
వీసీ ద్వారా ప్రసంగిస్తున్న స్టాలిన్
చెన్నై, న్యూస్టుడే: అంతర్జాతీయ ప్రమాణాలతో మెగా జౌళి పార్కును నగరంలో ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. మామల్లపురంలో చేనేత మ్యూజియం, పలు నగరాల్లో ఎగుమతి కేంద్రాలు కూడా నెలకొల్పనున్నట్లు పేర్కొన్నారు. ‘టెక్నికల్ టెక్స్టైల్స్’ పేరిట రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు నగరంలో శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రతిరంగం అభివృద్ధి చెందాలని అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రభుత్వం సన్నాహాలను చేస్తోందన్నారు. అందులో పరిశ్రమల రంగం ముందంజలో ఉందని తెలిపారు. పలు అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఇలాంటి సదస్సులు అవసరమని తెలిపారు. ప్రభుత్వం రూ.2.50 కోట్ల రాయితీతో చిన్నస్థాయి జౌళి పార్కులను ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు. జౌళిశాఖ కింద కొనసాగే 6 సహకార టైక్స్టైల్స్లలోని శాశ్వత సిబ్బందికి రూ.2,500 చొప్పున వేతన పెంపునకు జీవో విడుదల కానుందని తెలిపారు. ప్రత్యేక విద్యుత్తు ఫీడర్ లైన్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేసినట్టు, జౌళి విధానాలు రూపకల్పనకు అవసరమైన చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. యంత్రాల కొనుగోళ్లకు రూ.29.34 కోట్ల వ్యయంతో కార్యాచరణ పథకం రూపొందిస్తున్నామని చెప్పారు. విరుదునగర్ జిల్లా కుమారలింగపురంలో 1,500 ఎకరాల్లో భారీ జౌళి పార్కు ఏర్పాటుకు సిప్కాట్ ద్వారా భూసమీకరణ జరిగిందని వివరించారు. అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని, అందులో కొత్తదనం చొప్పించాలని, ఉన్నత సాంకేతికతను ఉపయోగించాలనే విధానాలను రూపొందిస్తున్నామని వెల్లడించారు. దేశంలోని జౌళి మిల్లుల్లో 55శాతం, మరమగ్గాల్లో 23శాతం రాష్ట్రంలోనే ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని జౌళి రంగం 31 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని పేర్కొన్నారు. ఈ రంగం భవిష్యత్తు ‘టెక్నికల్ టెక్స్టైల్స్’పై ఆధారపడి ఉందని, అందుకే దానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెగా జౌళి నగరాన్ని చెన్నైలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మామల్లపురంలో రూ.30 కోట్ల వ్యయంతో చేనేత మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. రూ.10 కోట్లతో డిజైన్ అండ్ ఇంకుబేషన్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. రాష్ట్రంలోని జౌళి ఎగుమతులను పలురెట్లు పెంచడానికి కరూరు, తిరుప్పూరు, కాంచీపురం వంటి నగరాల్లో ఎక్స్పోర్ట్ హబ్లు ఏర్పాటు చేసే పనులను త్వరితగతిన చేపట్టినట్టు తెలిపారు. సదస్సులో మంత్రులు తంగం తెన్నరసు, అన్బరసన్, గాంధీ, చేనేత, టెక్స్టైల్స్, ఖాదీశాఖ ముఖ్యకార్యదర్శి ధర్మేంద్ర ప్రతాప్ యాదవ్, కేంద్ర చేనేత మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ రాజీవ్ సక్సేనా, టెక్స్టైల్స్ శాఖ కమిషనరు వళ్లలార్, సీఐఐ తమిళనాడు ఛైర్మన్ సత్యకం ఆర్య, వైస్ ఛైర్మన్ శంకర్ వానవరాయర్, డైరెక్టరు తులసిరాజ్, సీఐఐ తమిళనాడు జౌళి కమిటీ కన్వీనరు గోపీకుమార్, రిలయన్స్ సంస్థ పాలిస్టర్ విభాగం ఛైర్మన్ ఉదేశి, శివా టెక్స్ యాన్స్ సంస్థ ఎండీ సుందరరామన్ తదితరులు పాల్గొన్నారు.
రచయితకు శుభాకాంక్షలు
చెన్నై, న్యూస్టుడే: ‘కువెంపు రాష్ట్రీయ పురస్కార్’కు ఎంపికైన రచయిత ఇమైయానికి ముఖ్యమంత్రి స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ట్వీట్లో... ఈ పురస్కారం పొందడం సంతోషకరమని తెలిపారు. ద్రావిడ పార్టీ ప్రభావశీల రచయితల వరుసలో నడుస్తున్న ఆయన బాటలో మరిన్ని ప్రశంసాహారాలు వెల్లువెత్తాలని ఆకాంక్షించారు.
జైళ్లలో గదులు ప్రారంభం
చెన్నై, న్యూస్టుడే: జైళ్లలో నిర్మించిన గుర్తింపు పరేడ్ కోసం నిర్మించిన గదులను ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించారు. 12 జిల్లా జైళ్లలో రూ.2.51 కోట్ల వ్యయంతో వీటిని నిర్మించారు. శుక్రవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి ఆరంభించారు. కార్యక్రమంలో మంత్రి రఘుపతి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇరైయన్బు, ప్రొహిబిషన్, ఎక్సైజ్శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఫణీంద్ర రెడ్డి, డీజీపీ శైలేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
సీఎంకు నివేదికల సమర్పణ
చెన్నై, న్యూస్టుడే: రాష్ట్ర ప్రణాళిక కమిషన్ ముఖ్యమంత్రి స్టాలిన్కు రెండు నివేదికలు సమర్పించింది. సచివాలయంలో సీఎంను కమిషన్ వైస్ ఛైర్మన్ జయరంజన్ శుక్రవారం కలిశారు. ప్రభుత్వ సాధారణ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ లబ్ధి, జిల్లాల మధ్య అభివృద్ధి వ్యత్యాసాలపై నివేదికలను అందించారు.
డీఎంకే విద్యార్థి విభాగంలో నియామకాలు
చెన్నై, న్యూస్టుడే: డీఎంకే విద్యార్థి విభాగం నిర్వాహకులను ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. రాష్ట్ర అధ్యక్షుడిగా రాజీవ్గాంధీ, కార్యదర్శిగా ఎమ్మెల్యే ఎళిలరసన్, సంయుక్త కార్యదర్శులుగా జెరాల్డ్, మోహన్, ఉపకార్యదర్శులుగా చోళరాజన్, తమిళరసన్, సెంథిల్కుమార్, అముదరసన్, ఆనంద్, పొన్రాజ్, గోకుల్, పూర్ణ సంగీత, వీరమణిలను నియమించినట్టు పార్టీ ప్రధానకార్యదర్శి దురైమురుగన్ ఓ ప్రకటనలో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా