పదేళ్లలో పెరగనున్న విద్యుత్తు డిమాండు
రానున్న పదేళ్లలో రాష్ట్రానికి 28,291 మెగావాట్ల విద్యుత్తు అవసరం కానుంది. ‘సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ’ (సీఈఏ) విడుదల చేసిన విశ్లేషణాత్మక నివేదిక (అనలిటికల్ రిపోర్ట్)లో తమిళనాడుకు విద్యుత్తు అవసరం ఎక్కువ కానుందని పేర్కొంది.
విద్యుత్తు కేంద్రం
వడపళని, న్యూస్టుడే: రానున్న పదేళ్లలో రాష్ట్రానికి 28,291 మెగావాట్ల విద్యుత్తు అవసరం కానుంది. ‘సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ’ (సీఈఏ) విడుదల చేసిన విశ్లేషణాత్మక నివేదిక (అనలిటికల్ రిపోర్ట్)లో తమిళనాడుకు విద్యుత్తు అవసరం ఎక్కువ కానుందని పేర్కొంది. 2021-22లో 16,889 మెగావాట్ల మేరకు విద్యుత్తు డిమాండు ఉంది. దీన్ని ఆధారంగా వేసిన అంచనా మేరకు రానున్న పదేళ్లలో 28,291 మెగావాట్ల విద్యుత్తు అవసరం ఉంటుందని నివేదికలో వెల్లడించింది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కూడా డిమాండు పెరిగే అవకాశాలున్నాయి. ప్రతి ఐదేళ్లకోసారి సీఈఏ విద్యుత్తు వినియోగం, అవసరాలపై ప్రత్యేకంగా సర్వే నిర్వహిస్తోంది. సర్వేలో మధ్య తరహా, దీర్ఘకాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వినియోగావసరాలపై అంచనా వేస్తోంది. తాజాగా 20వ సారి సీఈఏ బృందం రాష్ట్రంలోనూ సర్వే నిర్వహించింది. గతంలో చేపట్టిన సర్వే నివేదికను 2017 జనవరిలో విడుదల చేసింది. 2021-22లో ఉన్న విద్యుత్తు డిమాండుతో పోల్చుకుంటే 2031-32 నాటికి గరిష్ఠంగా 28,291 మెగావాట్ల విద్యుత్తు అవసరం ఏర్పడనుంది. గృహాలకు వినియోగించే విద్యుత్తు 61,575 మిలియన్ యూనిట్లకు చేరుకోగలదు. ప్రస్తుతం 31,606 మిలియన్ యూనిట్లుగా ఉంది. ప్రస్తుతం 34 శాతంగా ఉన్న డిమాండు పదేళ్ల తర్వాత 38 శాతానికి చేరుకోనుంది. రాష్ట్రంలోని పరిశ్రమల్లో 2021-22 కాలంలో 18 శాతం మేరకు డిమాండు కనిపించింది. ఇది కూడా 2031-32 నాటికి 19 శాతానికి పెరిగే అవకాశాలున్నాయి. 2031-32 నాటికి రాష్ట్రానికి 1,75,391 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అవసరం ఉండొచ్చని భావిస్తోంది. గరిష్ఠ డిమాండు 26,662 మెగావాట్లుగా ఉండనుంది. ఇంధన విభాగం పేర్కొన్న మేరకు 2022-23లో 16,652.20 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉండాలి. అయితే టాన్జెడ్కో 4,320 మెగావాట్ల సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉత్పత్తి స్థాయి 6,972 మెగావాట్లుగానూ ఉంది. దీనిపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడుతూ.. 2030లోగా విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని 20 వేల మెగావాట్లకు పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతలు ఏం చేస్తున్నారో!
[ 24-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఫలితాలు వచ్చి ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేసేవరకు ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుంది. అప్పటి వరకు రాజకీయ నేతల సందడి పెద్దగా ఉండకపోవచ్చు. -
అత్యాశతోనే భాజపాలోకి విజయధరణి
[ 24-04-2024]
అత్యాశతోనే విజయధరణి భాజపాలో చేరారని తమిళనాడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు హసీనా సయ్యద్ ఆరోపించారు. దిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఆమెకు సోమవారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో పార్టీ మహిళా విభాగం తరఫున ఘనస్వాగతం పలికారు. -
ఓట్ల కోసం మతవిద్వేష ప్రచారాలు తగదు
[ 24-04-2024]
రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఓట్ల కోసం మత విద్వేష ప్రసంగాలు చేయరాదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. -
కన్నగికి ప్రభుత్వ నివాళి
[ 24-04-2024]
తమిళుల సాంస్కృతిక చిహ్నంగా విరాజిల్లుతున్న కన్నగి విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నివాళులర్పించింది. -
పుస్తకాలను ప్రేమించండి : ముఖ్యమంత్రి పిలుపు
[ 24-04-2024]
పుస్తకాలు చదవాలని, ప్రేమించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఆయన ఓ సందేశ ప్రకటన విడుదల చేశారు. -
వర్షపాతం పెరిగినా భూమిలో నీరేది!
[ 24-04-2024]
ఈ ఏడాది రాష్ట్రంలో వర్షపాతం పెరిగినా భూమిలో నీరు మాత్రం అప్పుడే అడుగంటింది. చెన్నైలో రుతుపవనాల వర్షాల తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో భూగర్భ జలాలు 8 అడుగుల మేర తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి
[ 24-04-2024]
పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని తమిళనాడు ప్రజా సంబంధాల శాఖ తెలిపింది. -
‘ఇంగ నాన్తాన్ కింగు’ మోషన్ పోస్టర్ విడుదల
[ 24-04-2024]
ఆనంద్ నారాయణ్ దర్శకత్వంలో నటుడు సంతానం నటించిన చిత్రం ‘ఇంగ నాన్తాన్ కింగు’. కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు ఎళిచ్చుర్ అరవిందన్. గోపురం ఫిలిం ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రంలో మనోబాలా, తంబి రామయ్య, మునిశ్కాంత్, బాల శరవణన్ తదితరులు నటించారు. -
అన్నాడీఎంకే నేత ఎస్టేట్లో వన్యప్రాణుల వేట
[ 24-04-2024]
అన్నాడీఎంకే నేత సజీవన్కు చెందిన సిల్వర్ క్లైవ్డ్ ఎస్టేట్ కూడలూర్లో ఉంది. ఇక్కడ వన్యప్రాణులను వేటాడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఎస్టేట్లో పనిచేస్తున్న ఫైజల్, సాబు జాకబ్ అనే వ్యక్తుల వద్ద దర్యాప్తు చేశారు.