పదేళ్లలో పెరగనున్న విద్యుత్తు డిమాండు
రానున్న పదేళ్లలో రాష్ట్రానికి 28,291 మెగావాట్ల విద్యుత్తు అవసరం కానుంది. ‘సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ’ (సీఈఏ) విడుదల చేసిన విశ్లేషణాత్మక నివేదిక (అనలిటికల్ రిపోర్ట్)లో తమిళనాడుకు విద్యుత్తు అవసరం ఎక్కువ కానుందని పేర్కొంది.
విద్యుత్తు కేంద్రం
వడపళని, న్యూస్టుడే: రానున్న పదేళ్లలో రాష్ట్రానికి 28,291 మెగావాట్ల విద్యుత్తు అవసరం కానుంది. ‘సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ’ (సీఈఏ) విడుదల చేసిన విశ్లేషణాత్మక నివేదిక (అనలిటికల్ రిపోర్ట్)లో తమిళనాడుకు విద్యుత్తు అవసరం ఎక్కువ కానుందని పేర్కొంది. 2021-22లో 16,889 మెగావాట్ల మేరకు విద్యుత్తు డిమాండు ఉంది. దీన్ని ఆధారంగా వేసిన అంచనా మేరకు రానున్న పదేళ్లలో 28,291 మెగావాట్ల విద్యుత్తు అవసరం ఉంటుందని నివేదికలో వెల్లడించింది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కూడా డిమాండు పెరిగే అవకాశాలున్నాయి. ప్రతి ఐదేళ్లకోసారి సీఈఏ విద్యుత్తు వినియోగం, అవసరాలపై ప్రత్యేకంగా సర్వే నిర్వహిస్తోంది. సర్వేలో మధ్య తరహా, దీర్ఘకాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వినియోగావసరాలపై అంచనా వేస్తోంది. తాజాగా 20వ సారి సీఈఏ బృందం రాష్ట్రంలోనూ సర్వే నిర్వహించింది. గతంలో చేపట్టిన సర్వే నివేదికను 2017 జనవరిలో విడుదల చేసింది. 2021-22లో ఉన్న విద్యుత్తు డిమాండుతో పోల్చుకుంటే 2031-32 నాటికి గరిష్ఠంగా 28,291 మెగావాట్ల విద్యుత్తు అవసరం ఏర్పడనుంది. గృహాలకు వినియోగించే విద్యుత్తు 61,575 మిలియన్ యూనిట్లకు చేరుకోగలదు. ప్రస్తుతం 31,606 మిలియన్ యూనిట్లుగా ఉంది. ప్రస్తుతం 34 శాతంగా ఉన్న డిమాండు పదేళ్ల తర్వాత 38 శాతానికి చేరుకోనుంది. రాష్ట్రంలోని పరిశ్రమల్లో 2021-22 కాలంలో 18 శాతం మేరకు డిమాండు కనిపించింది. ఇది కూడా 2031-32 నాటికి 19 శాతానికి పెరిగే అవకాశాలున్నాయి. 2031-32 నాటికి రాష్ట్రానికి 1,75,391 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అవసరం ఉండొచ్చని భావిస్తోంది. గరిష్ఠ డిమాండు 26,662 మెగావాట్లుగా ఉండనుంది. ఇంధన విభాగం పేర్కొన్న మేరకు 2022-23లో 16,652.20 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉండాలి. అయితే టాన్జెడ్కో 4,320 మెగావాట్ల సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉత్పత్తి స్థాయి 6,972 మెగావాట్లుగానూ ఉంది. దీనిపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడుతూ.. 2030లోగా విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని 20 వేల మెగావాట్లకు పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపరాష్ట్రపతి కావొచ్చనే ఉద్దేశంతో తమిళిసై రాజీనామా: మంత్రి అనితా రాధాకృష్ణన్
[ 19-03-2024]
ఎన్నికల ఫలితాలు మారితే ఉపరాష్ట్రపతి కావొచ్చని తమిళిసై భావిస్తున్నారని మంత్రి అనితా రాధాకృష్ణన్ విమర్శించారు. -
నోట్ల తరలింపుపై నిఘా
[ 19-03-2024]
వాహనాల్లో వెతికేకొద్దీ డబ్బులు దొరుకుతున్నాయి. ఎక్కడివివీ? అంటే కార్లలో ఉన్నవారి నుంచి సమాధానం ఉండట్లేదు. -
మహిళలు తమ గుర్తింపు చాటాలి
[ 19-03-2024]
మహిళలు తమకు దక్కాల్సిన గుర్తింపు కోసం పురుషుల కంటే 50 శాతం అదనంగా శ్రమించాల్సి ఉందని ప్రముఖ సినీనటుడు సూర్య పేర్కొన్నారు. -
హైకోర్టులో ఓ పన్నీర్సెల్వానికి ఎదురుదెబ్బ
[ 19-03-2024]
అన్నాడీఎంకే పేరు, జెండా, చిహ్నం మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వం ఉపయోగించకుండా శాశ్వతంగా నిషేధం విధిస్తూ మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. -
మహా నేతలకు కేరాఫ్ దక్షిణ చెన్నై
[ 19-03-2024]
భారత మాజీ రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి, మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై, కేంద్ర మాజీ మంత్రులు మురసొలి మారన్, టీఆర్ బాలు వంటి ఉద్ధండులను లోక్సభకు పంపిన నియోజకవర్గంగా దక్షిణ చెన్నైకు గుర్తింపు ఉంది. -
కాంగ్రెస్ పోటీ చేసే స్థానాల ప్రకటన
[ 19-03-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసే నియోజకవర్గాలను ప్రకటించారు. -
అధిష్ఠానం ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ
[ 19-03-2024]
పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానని కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ పేర్కొన్నారు. -
తిరుచ్చి నుంచి బరిలోకి దురై వైగో
[ 19-03-2024]
డీఎంకే కూటమిలో ఎండీఎంకేకు తిరుచ్చి లోక్సభ నియోజకవర్గాన్ని కేటాయించారు. -
ఎన్ని ప్రయత్నాలు చేసినా తమిళనాట భాజపా గెలవదు
[ 19-03-2024]
తమిళనాడులో భాజపా కాలు మోపడానికి మోదీ ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి, పార్టీ తమిళనాడు విభాగ ఇన్ఛార్జి నారాయణ పేర్కొన్నారు. -
దివ్యాంగులకు ప్రత్యేక వీల్ఛైర్
[ 19-03-2024]
దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ‘న్యూస్టాండ్’ ఎలక్ట్రిక్ స్టాండింగ్ వీల్ ఛైర్ బుధవారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ మద్రాస్ (ఐఐటీఎం) లాంఛనంగా ఆవిష్కరించనుంది. -
మైలాడుదురై బరిలో ప్రవీణ్ చక్రవర్తి?
[ 19-03-2024]
డీఎంకే కూటమిలో మైలాడుదురై లోక్సభ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు.
తాజా వార్తలు (Latest News)
-
నాడు హిట్లర్ను అరెస్టు చేసిన జాన్.ఎఫ్. కెనడీ.. వైరల్ అవుతున్న ఈసీ పోస్ట్
-
IPL: ఐపీఎల్ 2024 సీజన్. కోహ్లీ కొత్త హెయిర్స్టైల్ అదుర్స్.. ఫొటోలు వైరల్
-
Nalgonda: ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి.. పెళ్లి చూపుల్లో బయటపడిన యువతి మోసం
-
NDA: ఎన్డీఏ ‘మహా’ వ్యూహం.. ఉద్ధవ్కు చెక్ పెట్టేందుకు రంగంలోకి రాజ్..!
-
Stock market: భారీ నష్టాల్లో సూచీలు.. సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్
-
India- China: ఎన్నిసార్లు వాదించినా వాస్తవాలు మారవు.. చైనాకు భారత్ కౌంటర్