సమైక్యతను విచ్ఛిన్నం చేసిన ఆంగ్లేయులు
భారతీయుల సంస్కృతి, ఆధ్యాత్మిక సమైక్యతను ఆంగ్లేయులు విచ్ఛిన్నం చేశారని గవర్నర్ ఆర్ఎన్ రవి తెలిపారు. మైలాపూర్లోని భారతీయ విద్యా భవన్ ఆడిటోరియంలో జరిగిన ‘భవన్స్ కల్చరల్ ఫెస్టివల్-2022’ ప్రారంభోత్సవంలో గవర్నర్ రవి, ఆయన సతీమణి లక్ష్మి పాల్గొన్నారు.
వాణీ జయరామ్కు పురస్కారం ప్రదానం చేస్తున్న గవర్నర్ రవి
చెన్నై, న్యూస్టుడే: భారతీయుల సంస్కృతి, ఆధ్యాత్మిక సమైక్యతను ఆంగ్లేయులు విచ్ఛిన్నం చేశారని గవర్నర్ ఆర్ఎన్ రవి తెలిపారు. మైలాపూర్లోని భారతీయ విద్యా భవన్ ఆడిటోరియంలో జరిగిన ‘భవన్స్ కల్చరల్ ఫెస్టివల్-2022’ ప్రారంభోత్సవంలో గవర్నర్ రవి, ఆయన సతీమణి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. సంగీత రంగంలో విశేష సేవలు అందించినందుకు ‘భవన్స్ లెజండరీ అవార్డు’ను ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరామ్కు గవర్నర్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వాణిజ్యం పేరిట దేశంలోకి ప్రవేశించిన ఆంగ్లేయులు రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మికపరంగా దేశాన్ని విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు. కాశి, తమిళనాడుకు మధ్య సత్సంబంధాలనూ తెంచేశారని పేర్కొన్నారు. ఆంగ్లేయుల హయాంలో కోల్పోయిన వాటిని పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. కార్యక్రమంలో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనితా సుమంత్, పారిశ్రామికవేత్త నల్లి కుప్పుస్వామి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపరాష్ట్రపతి కావొచ్చనే ఉద్దేశంతో తమిళిసై రాజీనామా: మంత్రి అనితా రాధాకృష్ణన్
[ 19-03-2024]
ఎన్నికల ఫలితాలు మారితే ఉపరాష్ట్రపతి కావొచ్చని తమిళిసై భావిస్తున్నారని మంత్రి అనితా రాధాకృష్ణన్ విమర్శించారు. -
నోట్ల తరలింపుపై నిఘా
[ 19-03-2024]
వాహనాల్లో వెతికేకొద్దీ డబ్బులు దొరుకుతున్నాయి. ఎక్కడివివీ? అంటే కార్లలో ఉన్నవారి నుంచి సమాధానం ఉండట్లేదు. -
మహిళలు తమ గుర్తింపు చాటాలి
[ 19-03-2024]
మహిళలు తమకు దక్కాల్సిన గుర్తింపు కోసం పురుషుల కంటే 50 శాతం అదనంగా శ్రమించాల్సి ఉందని ప్రముఖ సినీనటుడు సూర్య పేర్కొన్నారు. -
హైకోర్టులో ఓ పన్నీర్సెల్వానికి ఎదురుదెబ్బ
[ 19-03-2024]
అన్నాడీఎంకే పేరు, జెండా, చిహ్నం మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వం ఉపయోగించకుండా శాశ్వతంగా నిషేధం విధిస్తూ మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. -
మహా నేతలకు కేరాఫ్ దక్షిణ చెన్నై
[ 19-03-2024]
భారత మాజీ రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి, మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై, కేంద్ర మాజీ మంత్రులు మురసొలి మారన్, టీఆర్ బాలు వంటి ఉద్ధండులను లోక్సభకు పంపిన నియోజకవర్గంగా దక్షిణ చెన్నైకు గుర్తింపు ఉంది. -
కాంగ్రెస్ పోటీ చేసే స్థానాల ప్రకటన
[ 19-03-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసే నియోజకవర్గాలను ప్రకటించారు. -
అధిష్ఠానం ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ
[ 19-03-2024]
పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానని కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ పేర్కొన్నారు. -
తిరుచ్చి నుంచి బరిలోకి దురై వైగో
[ 19-03-2024]
డీఎంకే కూటమిలో ఎండీఎంకేకు తిరుచ్చి లోక్సభ నియోజకవర్గాన్ని కేటాయించారు. -
ఎన్ని ప్రయత్నాలు చేసినా తమిళనాట భాజపా గెలవదు
[ 19-03-2024]
తమిళనాడులో భాజపా కాలు మోపడానికి మోదీ ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి, పార్టీ తమిళనాడు విభాగ ఇన్ఛార్జి నారాయణ పేర్కొన్నారు. -
దివ్యాంగులకు ప్రత్యేక వీల్ఛైర్
[ 19-03-2024]
దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ‘న్యూస్టాండ్’ ఎలక్ట్రిక్ స్టాండింగ్ వీల్ ఛైర్ బుధవారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ మద్రాస్ (ఐఐటీఎం) లాంఛనంగా ఆవిష్కరించనుంది. -
మైలాడుదురై బరిలో ప్రవీణ్ చక్రవర్తి?
[ 19-03-2024]
డీఎంకే కూటమిలో మైలాడుదురై లోక్సభ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు.
తాజా వార్తలు (Latest News)
-
IPL: ఐపీఎల్ 2024 సీజన్. కోహ్లీ కొత్త హెయిర్స్టైల్ అదుర్స్.. ఫొటోలు వైరల్
-
Nalgonda: ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి.. పెళ్లి చూపుల్లో బయటపడిన యువతి మోసం
-
NDA: ఎన్డీఏ ‘మహా’ వ్యూహం.. ఉద్ధవ్కు చెక్ పెట్టేందుకు రంగంలోకి రాజ్..!
-
Stock market: భారీ నష్టాల్లో సూచీలు.. సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్
-
India- China: ఎన్నిసార్లు వాదించినా వాస్తవాలు మారవు.. చైనాకు భారత్ కౌంటర్
-
CAA: సీఏఏపై స్టే కోరుతూ పిటిషన్లు.. కేంద్రానికి మూడు వారాల గడువిచ్చిన సుప్రీం