త్వరలో అందుబాటులోకి ‘ఓఎన్వోసీ’
ప్రయాణికులకు సులువైన ప్రయాణం కల్పించేందుకు సీఎంఆర్ఎల్ ‘వన్ నేషన్ వన్ కార్డ్’ (ఓఎన్వోసీ)ను వచ్చే నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
మెట్రో స్టేషను
వడపళని, న్యూస్టుడే: ప్రయాణికులకు సులువైన ప్రయాణం కల్పించేందుకు సీఎంఆర్ఎల్ ‘వన్ నేషన్ వన్ కార్డ్’ (ఓఎన్వోసీ)ను వచ్చే నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. అధునాతన సాంకేతిక విధానంతో కూడిన స్మార్డ్ కార్డుతో బస్సు, సబర్బన్, పార్కింగు ఫీజులు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. చెన్నైలోనే కాకుండా ఇతర నగరాల్లో ఈ కార్డుతో ప్రయాణాలు, షాపింగు, పార్కింగులకు వీలుంటుందని మెట్రో అధికారులు పేర్కొన్నారు. కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ఈ పథకంలో భాగంగా ‘నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్సీఎంసి) మూడేళ్ల క్రితం ప్రారంభమైంది. ఇప్పటికే ఎన్సీఎంసీ ప్రయాణికులు గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. కార్డు బ్యాంకుతో లింకు చేయాల్సి ఉందని, బ్యాంకులతో కొన్ని రకాల పనులున్నాయని, వాటి కోసం కొంత సమయం తీసుకోవాల్సి వస్తోందని అధికారులు చెప్పారు. ‘వీఎన్వీసీ’ కార్డు ప్రవేశపెట్టే ముందుగా సీఎంఆర్ఎల్ బృందం అన్ని రకాల మౌలిక సదుపాయాలను పరిశీలించింది. ఆ పనులు పూర్తయ్యాక ‘నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ నుంచి (ఎన్పీసీఐ) సీఎంఆర్ఎల్కు ధ్రువపత్రం కూడా అందింది. మెట్రో మొదటి దశ ఎక్స్టెన్షన్లోని వాషర్మెన్పేట నుంచి వింకోనగర్ వరకు ‘ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్’ (ఏఎఫ్సి) గేట్ల వద్ద ఎన్సీఎంసీ, క్యూఆర్ కోడ్ విధానంతో టిక్కెట్లు పనిచేసేందుకు సాంకేతిక మార్పులు చేయనున్నారు. కొన్ని స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ ఉన్నందుకు అదనపు గేట్ల అవసరం కూడా ఉందన్నారు. ఇందుకోసం టెండర్లను ఆహ్వానించామని, త్వరలోనే ఆ పనులు కూడా పూర్తి చేస్తామని సీఎంఆర్ఎల్ ఉన్నతాధికారి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపరాష్ట్రపతి కావొచ్చనే ఉద్దేశంతో తమిళిసై రాజీనామా: మంత్రి అనితా రాధాకృష్ణన్
[ 19-03-2024]
ఎన్నికల ఫలితాలు మారితే ఉపరాష్ట్రపతి కావొచ్చని తమిళిసై భావిస్తున్నారని మంత్రి అనితా రాధాకృష్ణన్ విమర్శించారు. -
నోట్ల తరలింపుపై నిఘా
[ 19-03-2024]
వాహనాల్లో వెతికేకొద్దీ డబ్బులు దొరుకుతున్నాయి. ఎక్కడివివీ? అంటే కార్లలో ఉన్నవారి నుంచి సమాధానం ఉండట్లేదు. -
మహిళలు తమ గుర్తింపు చాటాలి
[ 19-03-2024]
మహిళలు తమకు దక్కాల్సిన గుర్తింపు కోసం పురుషుల కంటే 50 శాతం అదనంగా శ్రమించాల్సి ఉందని ప్రముఖ సినీనటుడు సూర్య పేర్కొన్నారు. -
హైకోర్టులో ఓ పన్నీర్సెల్వానికి ఎదురుదెబ్బ
[ 19-03-2024]
అన్నాడీఎంకే పేరు, జెండా, చిహ్నం మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వం ఉపయోగించకుండా శాశ్వతంగా నిషేధం విధిస్తూ మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. -
మహా నేతలకు కేరాఫ్ దక్షిణ చెన్నై
[ 19-03-2024]
భారత మాజీ రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి, మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై, కేంద్ర మాజీ మంత్రులు మురసొలి మారన్, టీఆర్ బాలు వంటి ఉద్ధండులను లోక్సభకు పంపిన నియోజకవర్గంగా దక్షిణ చెన్నైకు గుర్తింపు ఉంది. -
కాంగ్రెస్ పోటీ చేసే స్థానాల ప్రకటన
[ 19-03-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసే నియోజకవర్గాలను ప్రకటించారు. -
అధిష్ఠానం ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ
[ 19-03-2024]
పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానని కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ పేర్కొన్నారు. -
తిరుచ్చి నుంచి బరిలోకి దురై వైగో
[ 19-03-2024]
డీఎంకే కూటమిలో ఎండీఎంకేకు తిరుచ్చి లోక్సభ నియోజకవర్గాన్ని కేటాయించారు. -
ఎన్ని ప్రయత్నాలు చేసినా తమిళనాట భాజపా గెలవదు
[ 19-03-2024]
తమిళనాడులో భాజపా కాలు మోపడానికి మోదీ ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి, పార్టీ తమిళనాడు విభాగ ఇన్ఛార్జి నారాయణ పేర్కొన్నారు. -
దివ్యాంగులకు ప్రత్యేక వీల్ఛైర్
[ 19-03-2024]
దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ‘న్యూస్టాండ్’ ఎలక్ట్రిక్ స్టాండింగ్ వీల్ ఛైర్ బుధవారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ మద్రాస్ (ఐఐటీఎం) లాంఛనంగా ఆవిష్కరించనుంది. -
మైలాడుదురై బరిలో ప్రవీణ్ చక్రవర్తి?
[ 19-03-2024]
డీఎంకే కూటమిలో మైలాడుదురై లోక్సభ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు.
తాజా వార్తలు (Latest News)
-
నాడు హిట్లర్ను అరెస్టు చేసిన జాన్.ఎఫ్. కెనడీ.. వైరల్ అవుతున్న ఈసీ పోస్ట్
-
IPL: ఐపీఎల్ 2024 సీజన్. కోహ్లీ కొత్త హెయిర్స్టైల్ అదుర్స్.. ఫొటోలు వైరల్
-
Nalgonda: ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి.. పెళ్లి చూపుల్లో బయటపడిన యువతి మోసం
-
NDA: ఎన్డీఏ ‘మహా’ వ్యూహం.. ఉద్ధవ్కు చెక్ పెట్టేందుకు రంగంలోకి రాజ్..!
-
Stock market: భారీ నష్టాల్లో సూచీలు.. సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్
-
India- China: ఎన్నిసార్లు వాదించినా వాస్తవాలు మారవు.. చైనాకు భారత్ కౌంటర్