పొరునై సాహిత్య వేడుక అభినందనీయం
పొరునై సాహిత్య వేడుకలు అభినందనీయమని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. తిరునెల్వేలి జిల్లా పాళైయంకోట్టైలో రెండు రోజుల ఈ వేడుకలు శనివారం ప్రారంభం అయ్యాయి.
ముఖ్యమంత్రి స్టాలిన్
జిన్నా జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం
చెన్నై, న్యూస్టుడే: పొరునై సాహిత్య వేడుకలు అభినందనీయమని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. తిరునెల్వేలి జిల్లా పాళైయంకోట్టైలో రెండు రోజుల ఈ వేడుకలు శనివారం ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం శుభాకాంక్షల సందేశాన్ని విడుదల చేశారు. అందులో... సాహిత్య పరిపక్వత, సాంస్కృతిక ఔన్నత్యాన్ని తమిళ సమాజం చేరుకుందని తెలిపారు. కీళడి, శివకళై, కొర్కైలోని పురావస్తు పరిశోధనలు మన ప్రాచీన ఔన్నత్యానికి శాస్త్రీయ నిదర]్శనాలని పేర్కొన్నారు. ఈ గొప్పతనాన్ని తర్వాతి తరాలకు తీసుకెళ్లి శాస్త్రీయ సమాజాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ వేడుకలు జరగనున్నాయని తెలిపారు. తమిళ జాతి సంపన్నమైన సాహిత్య విలువలను కీర్తించేలా పొరునై, వైగై, కావేరి, సిరువాణి, చెన్నై సాహిత్య వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని పేర్కొన్నారు. భారత ఉప ఖండం చరిత్ర తమిళ నేల నుంచి రాయాలని ఆకాంక్షించారు.
పోరాటంలో ప్రాణత్యాగం వద్దు
చెన్నై, న్యూస్టుడే: పోరాటంలో ఇంకెవరూ ప్రాణత్యాగానికి పాల్పడొద్దని సీఎం స్టాలిన్ కోరారు. శనివారం ఆయన విడుదల చేసిన ఓ ప్రకటనలో... హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలకు వ్యతిరేకంగా సేలం జిల్లాలో తంగవేల్ ఆత్మాహుతికి పాల్పడినట్లు వచ్చిన సమాచారంతో దిగ్భ్రాంతి చెందానని తెలిపారు. ఆయనకు వీర వందనాలని పేర్కొన్నారు. ఈ విషయంలో రాజకీయ, ప్రజాస్వామ్య విధానంలో పోరాటం కొనసాగిద్దామని తెలిపారు. ఇప్పటికే పలువురు యోధులను కోల్పోయామని, ఇకపై కోల్పోకూడదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ హృదయాన్ని కదిలించే వరకు విశ్రమించబోమని చెప్పారు. తంగవేల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కప్ను స్టాలిన్కు చూపుతున్న సమణ
ఇళంగోవన్ మనవరాలికి అభినందన
చెన్నై, న్యూస్టుడే: టీఎన్సీసీ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ మనవరాలు సమణ గుర్రపుస్వారీలో కప్ సాధించిన నేపథ్యంలో ఆమెను ముఖ్యమంత్రి అభినందించారు. బెంగళూరులో గతవారం జరిగిన ఎఫ్ఈఐ వరల్డ్ ఇక్వెస్ట్రయిన్ డ్రెసెజ్ ఛాలెంజ్-2022 గుర్రపు స్వారీ పోటీల్లో జాతీయ స్థాయిలో జూనియర్ ఛాంపియన్గా సమణ నిలిచారు. ఆమె తన తాత, తండ్రియైన ఎమ్మెల్యే తిరుమగన్లతో కలిసి సీఎంను క్యాంపు కార్యాలయంలో శనివారం కలిశారు. కప్ను చూపించగా, సీఎం అభినందించారు. వెంట సమణ తల్లి పూర్ణిమ, కోచ్ కిశోర్ ఉన్నారు.
దేశాన్ని నడిపించడానికి ప్రతిజ్ఞ చేద్దాం
చెన్నై, న్యూస్టుడే: దేశాన్ని ముందుకు నడిపించడానికి ప్రతిజ్ఞ చేద్దామంటూ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఆయన ప్రకటన విడుదల చేశారు. సమానత్వం, సౌభ్రాతృత్వం, సెక్యులరిజం తదితర విలువలతో కూడిన రాజ్యాంగాన్ని ఉన్నతంగా నిలుపుదామని తెలిపారు. రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ అంబేడ్కర్ వంటి మేధావుల ఆకాంక్ష మేరకు దేశాన్ని ముందుకు నడిపించడానికి ప్రతిజ్ఞ చేద్దామని కోరారు.
మాజీ ఎమ్మెల్యే సతీమణి మృతికి సంతాపం
చెన్నై, న్యూస్టుడే: నాగర్కోవిల్ మాజీ ఎమ్మెల్యే బాలన్ సతీమణి వసంతా బాలన్ మృతికి ముఖ్యమంత్రి సంతాపం ప్రకటించారు. బాలన్ కుటుంబ సభ్యులు, బంధువులకు సానుభూతి తెలిపారు.
పుస్తకావిష్కరణ
చెన్నై, న్యూస్టుడే: మాజీ ఎంపీ దివంగత జిన్నా జీవిత చరిత్ర పుస్తకాన్ని అన్నా అరివాలయంలో ముఖ్యమంత్రి శనివారం ఆవిష్కరించారు. ద్రావిడర్ కళగం అధ్యక్షుడు వీరమణి, మంత్రులు దురైమురుగన్, కేఎన్ నెహ్రూ, ఎంపీ టీఆర్ బాలు, మాజీ ఎంపీలు ఆర్ఎస్.భారతి, టీకేఎస్ ఇళంగోవన్, ఇదయతుల్లా జిన్నా తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
[ 25-04-2024]
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. -
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
[ 25-04-2024]
శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. -
మహిళల పాలిట రక్తపోటు
[ 25-04-2024]
అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి. -
ఆధారాలున్నా ఓటరు పేర్లు గల్లంతు
[ 25-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బర్డ్ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక బృందాలు
[ 25-04-2024]
తమిళనాడులో బర్డ్ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. -
జూన్లో కొత్త రోడ్లు
[ 25-04-2024]
కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
తమిళ అభిమానులకు కృతజ్ఞతలు
[ 25-04-2024]
ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష
[ 25-04-2024]
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్ బిస్కెట్ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. -
మత ఘర్షణలు సృష్టించేలా ప్రధాని ప్రచారం
[ 25-04-2024]
మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
మోదీ పాలనలో మైనారిటీలు ఇబ్బంది పడలేదు: ఓ పన్నీర్సెల్వం
[ 25-04-2024]
మోదీ పాలనలో మైనారిటీ ప్రజలు ఇబ్బంది పడలేదని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం తెలిపారు. మదురై తిరుప్పరకుండ్రం సుబ్రమణిస్వామి ఆలయంలో మంగళవారం మురుగన్ను దర్శించుకున్నారు. -
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ చర్యలు: స్టాలిన్
[ 25-04-2024]
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
[ 25-04-2024]
హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?