కార్తిక మహాదీపోత్సవాలకు శ్రీకారం నేడు
తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో కార్తిక మహాదీపోత్సవాలు ఆదివారం ధ్వజారోహణతో ప్రారంభం కానున్నాయి. పది రోజులుపాటు వేడుకలు కొనసాగుతాయి.
అరుణాచలేశ్వరాలయంలో ఏర్పాట్లు పూర్తి
పెద్దసంఖ్యలో తరలిరానున్న భక్తులు
చంద్రశేఖరస్వామి, ఉన్నాములై ఉత్సవమూర్తులు
తిరువణ్ణామలై, న్యూస్టుడే: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో కార్తిక మహాదీపోత్సవాలు ఆదివారం ధ్వజారోహణతో ప్రారంభం కానున్నాయి. పది రోజులుపాటు వేడుకలు కొనసాగుతాయి. అణ్ణామలైయ్యన్ పరమ పవిత్ర నివాస స్థానమైన తిరువణ్ణామలై క్షేత్రం ప్రస్తుతం జిల్లా కేంద్రంగా ఉంది. ఈ పట్టణం విల్లుపురం-కాట్పాడి రైలు మార్గంలో చెన్నైకి 226 కిలోమీటర్ల దూరంలో నెలవైంది. చెన్నై నుంచి తిరువణ్ణామలై చేరడానికి బస్సు సౌకర్యం కూడా ఉంది. ఈ ఆలయంలో కార్తిక మాసంలో మహాదీపోత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి. ఇక్కడ పర్వతమే అణ్ణాళ్ మలై.. అదే కాలక్రమంలో అణ్ణామలైగా మార్పు చెందింది. ఈ పుణ్యక్షేత్రంలోనే శివుడు అగ్నిరూపం దాల్చి ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ కారణంగానే ఈ క్షేత్రానికి ఇంత కీర్తి. తమిళంలో గల ఒక మహిత సూక్తిననుసరించి తిరువారూర్లో జన్మిస్తే, కాశిలో మరణిస్తే, తిల్లైని (చిదంబరాన్ని) దర్శిస్తే, తిరువణ్ణామలైని తలిస్తే ముక్తి తథ్యం, మోక్షం ఖాయమని భక్తుల నమ్మకం. ప్రకృతి శోభతో అలరారే అణ్ణామలై పట్టణంలో ప్రవేశించినవారికి తొలుత 65 మీటర్ల ఎత్తున నిలిచిన రమణీయమైన రాజగోపురం కనువిందు చేస్తుంది. ఇది విజయనగర ప్రభువుల శివభక్తికి, లలిత కళాసక్తి ఉజ్వల నిర్మాణ శక్తికి దర్పణం పడుతుంది. ఆలయ ఆవరణలోని వెయ్యి స్తంభాల వైభవ మండపం నైరుతి మూలలో పాతాళ (భూగర్భ) లింగ ప్రతిష్ఠతమై ఉంది. మహాత్ముడైన రమణ మహర్షి చాలాకాలం కఠోర తపమాచరించి దివ్యజ్ఞానసిద్ధిని ఇక్కడే పొందారు. ఈ ఆలయం 24 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. కార్తిక మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం రోజున ఈ ఉత్సవాలు ప్రారంభమై భరణి నక్షత్రం రోజున ముగుస్తాయి. చివరిరోజు 2,668 అడుగుల కొండపై మహాదీపం వెలిగిస్తారు. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు సమర్పణ జ్యోతులను వెలిగించే ఆచారం ఉంది.
వాహన సేవల వివరాలు...
* ఆదివారం వేకువజామున 5.30 నుంచి 7 గంటలలోగా వృశ్చిక లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. ఉదయం పంచమూర్తులను వెండి వాహనంలో ఊరేగిస్తారు. రాత్రి వెండి అధికార నంది, హంస వాహనాలలో పంచమూర్తుల ఊరేగింపు ఉంటుంది.
* 28న ఉదయం బంగారు సూర్యప్రభ వాహనంపై చంద్రశేఖరస్వామి, రాత్రి పంచమూర్తులను వెండి ఇంద్ర విమానంలో ఊరేగిస్తారు.
* 29వ తేదీన ఉదయం భూత వాహనంపై చంద్రశేఖరస్వామి, రాత్రి పంచమూర్తులను సింహ వాహనం, వెండి హంస వాహనాలలో ఊరేగిస్తారు.
* 30న ఉదయం సర్ప వాహనంలో చంద్రశేఖరస్వామి, రాత్రి పంచమూర్తులను వెండి కామధేను, కర్పక వృక్ష వాహనాలలో ఊరేగిస్తారు.
* డిసెంబరు 1న ఉదయం అద్దాల వృషభ వాహనంలో చంద్రశేఖరస్వామి, రాత్రి వెండి పెద్ద వృషభ వాహనాలలో పంచమూర్తుల ఊరేగింపు ఉంటుంది.
* 2న ఉదయం గజ వాహనంపై చంద్రశేఖరస్వామిని, ఆ తర్వాత 63 నాయన్మారుల ఊరేగింపు జరుగుతుంది. ఆ రోజు రాత్రి వెండి రథం, వెండి విమానాలపై ఊరేగిస్తారు.
* 3న ఉదయం నుంచి రాత్రి వరకు పంచమూర్తుల రథోత్సవం ఉంటుంది.
* 4న ఉదయం అశ్వ వాహనంలో చంద్రశేఖరస్వామి, సాయంత్రం 4 గంటలకు బిచ్చాండవర్ ఉత్సవం, రాత్రి అశ్వవాహనంపై పంచమూర్తుల ఊరేగింపు జరుగుతుంది.
* 5న పురుష ముని వాహనంపై చంద్రశేఖరస్వామిని, రాత్రి పంచమూర్తులను కైలాస వాహనం, కామధేను వాహనాలలో ఊరేగిస్తారు.
* 6న వేకువజాము 4 గంటలకు భరణి దీపం, సాయంత్రం 6 గంటలకు మహాకొండపై కార్తిక మహాదీపాన్ని వెలిగిస్తారు. ఆ రోజు రాత్రి బంగారు వృషభ వాహనాలలో పంచమూర్తుల ఊరేగింపు జరుగుతుంది.
ఆలయం
అయ్యన్గుంట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
[ 25-04-2024]
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. -
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
[ 25-04-2024]
శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. -
మహిళల పాలిట రక్తపోటు
[ 25-04-2024]
అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి. -
ఆధారాలున్నా ఓటరు పేర్లు గల్లంతు
[ 25-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బర్డ్ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక బృందాలు
[ 25-04-2024]
తమిళనాడులో బర్డ్ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. -
జూన్లో కొత్త రోడ్లు
[ 25-04-2024]
కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
తమిళ అభిమానులకు కృతజ్ఞతలు
[ 25-04-2024]
ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష
[ 25-04-2024]
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్ బిస్కెట్ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. -
మత ఘర్షణలు సృష్టించేలా ప్రధాని ప్రచారం
[ 25-04-2024]
మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
మోదీ పాలనలో మైనారిటీలు ఇబ్బంది పడలేదు: ఓ పన్నీర్సెల్వం
[ 25-04-2024]
మోదీ పాలనలో మైనారిటీ ప్రజలు ఇబ్బంది పడలేదని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం తెలిపారు. మదురై తిరుప్పరకుండ్రం సుబ్రమణిస్వామి ఆలయంలో మంగళవారం మురుగన్ను దర్శించుకున్నారు. -
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ చర్యలు: స్టాలిన్
[ 25-04-2024]
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
[ 25-04-2024]
హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం