4 వేల కిలోల బంగారం డిపాజిట్
రాష్ట్రంలోని ఆలయాలన పునరుద్ధరించేందుకు 4 వేల కిలోల బంగారం బ్యాంకుల్లో డిపాజిట్ చేయనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి శేఖర్బాబు తెలిపారు.
మంత్రి శేఖర్బాబు
కీళ్పాక్కం పాతాళ పొన్నియమ్మన్ ఆలయంలో పనులు ప్రారంభిస్తున్న శేఖర్బాబు
సైదాపేట, న్యూస్టుడే: రాష్ట్రంలోని ఆలయాలన పునరుద్ధరించేందుకు 4 వేల కిలోల బంగారం బ్యాంకుల్లో డిపాజిట్ చేయనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి శేఖర్బాబు తెలిపారు. చెన్నై మండల పరిధిలోని నాలుగు ఆలయాల్లో రూ.1.48 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పునరుద్ధరణ పనులను ఆదివారం ఆయన ప్రారంభించారు. చెన్నై పెరంబూర్ సెంబియం లక్ష్మీ అమ్మాళ్, వ్యాసార్పాడి రవీశ్వరర్, కొరుక్కుపేట్టై పెరియనాయకి, కీళ్పాక్కం పాతాళ పొన్నియమ్మన్ ఆలయం తదితర ఆలయాల్లో ఈ పనులు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పెరియపాళైయత్తమ్మన్ ఆలయ నగలు స్వచ్ఛమైన బంగారంగా మార్చి 98 కిలోల బంగారు నిధిని డిపాజిట్ చేసినట్లు తెలిపారు. తద్వారా ఏడాదికి రూ.1.5 కోట్ల వడ్డీ వస్తుందన్నారు. అలాగే ఇరుక్కన్గుడి మారియమ్మన్ ఆలయ బంగారానికి 38 లక్షల వడ్డీ వస్తుందని పేర్కొన్నారు. ఈ మొత్తం ఆయా ఆలయాల అభివృద్ధికి ఉపయోగిస్తామని తెలిపారు. తిరువేర్కాడు, మాంగాడు అమ్మన్ ఆలయాల్లో ఉపయోగించేందుకు పనికిరాని ఆభరణాలను న్యాయమూర్తి ఎదుట గణించి స్వచ్ఛమైన బంగారంగా మార్చేందుకు ముంబయికి తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా