logo

‘రాజకీయాల్లో మఠాధిపతుల జోక్యం తగదు’

ఆధీనాలు, మఠాధిపతులు రాజకీయాల్లో జోక్యం చేసుకోకూడదని కర్ణాటకకు చెందిన యదుగిరి యతిరాజ నారాయణ రామానుజ జీయర్‌ పేర్కొన్నారు.

Published : 29 Nov 2022 00:28 IST

యదుగిరి యతిరాజ నారాయణ రామానుజ జీయర్‌

వేలచ్చేరి, న్యూస్‌టుడే: ఆధీనాలు, మఠాధిపతులు రాజకీయాల్లో జోక్యం చేసుకోకూడదని కర్ణాటకకు చెందిన యదుగిరి యతిరాజ నారాయణ రామానుజ జీయర్‌ పేర్కొన్నారు. కన్యాకుమారిలో ఆయన సోమవారం విలేకర్లతో మాట్లాడుతూ.. రామానుజాచార్యుల బోధనలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. ఆయన తన మద్దతుదారులలో విభేదాలు ఉండకూడదని కోరుకొనేవారని గుర్తు చేశారు. కశ్మీరులో పండితుల గ్రంథాలను సేకరించి కంప్యూటరీకరణ చేసే పనులు జరుగుతున్నాయని తెలిపారు. తనకు రాజకీయాలు మాట్లాడటం ఇష్టం లేదన్నారు. ఆధీనాలు, మఠాధిపతులు రాజకీయాల్లో జోక్యం చేసుకోకూడదని కోరారు. తాము సన్యాసులమని గుర్తుంచుకుని దైవసేవ చేయడంపై దృష్టి సారించాలని హితవు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని