మైనర్లకు మద్యం విక్రయించలేదని చెప్పగలరా?
పాఠశాల విద్యార్థులకు మద్య విక్రయించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పగలదా? అని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ప్రశ్నించింది.
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మదురై ధర్మాసనం
ప్యారిస్, న్యూస్టుడే: పాఠశాల విద్యార్థులకు మద్య విక్రయించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పగలదా? అని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్రంలో మద్యం విక్రయ సమయాన్ని తగ్గించాలని, పాఠశాల విద్యార్థులకు విక్రయించడాన్ని అడ్డుకోవాలని ఇద్దరు వ్యక్తులు పిటిషన్లు దాఖలు చేశారు. ఇవి సోమవారం విచారణకు వచ్చాయి. అప్పుడు ప్రభుత్వం తరఫున....దక్షిణాదిన నాలుగు రాష్ట్రాల కంటే తమిళనాడులో తక్కువ సమయమే టాస్మాక్ దుకాణాలు తెరుస్తున్నారని పేర్కొన్నారు. అప్పుడు జోక్యం చేసుకున్న న్యాయమూర్తులు.. తక్కువ సమయం తెరిచినప్పటికీ విక్రయాలలో మొదటిస్థానంలో ఎందుకు ఉందన్నారు. మద్యం పరిమాణం తక్కువగా, ధరలు ఎక్కువగా నిర్ణయించినట్లు ప్రభుత్వం తరఫున తెలిపారు. మధ్యాహ్నం 2 - రాత్రి 8 గంటల వరకు తెరిచే సమయం మార్చేందుకు ఎందుకు పరిశీలించకూడదని కోర్టు పేర్కొంది. పాఠశాల విద్యార్థులకు మద్యం విక్రయించడం లేదని ప్రభుత్వం చెప్పగలదా? అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. అందుకు ప్రభుత్వం తరఫున ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని పాఠశాల విద్యాశాఖతో చర్చించి చర్యలు చేపడతామన్నారు. అనంతరం 21 ఏళ్ల లోపువారికి మద్యం విక్రయించడాన్ని అడ్డుకోవడానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి, ఈ విషయమై ప్రభుత్వానికి వచ్చిన సిఫారసుల గురించి నివేదిక దాఖలు చేయాలని ఆదేశిస్తూ డిసెంబరు ఒకటో తేదీకి వాయిదా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరూరులో.. 4 ఈవీఎంలు!
[ 18-04-2024]
లోక్సభ సమరంలో ఓటువేసే తేదీ వచ్చేసింది. 19.. అంటే రేపే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకు తగ్గ ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ పూర్తిచేసింది. ఓటింగ్ యంత్రాల తరలింపు ప్రక్రియలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. -
ఓటు భావితరాన్ని కాపాడాలి: స్టాలిన్
[ 18-04-2024]
ప్రజల ఓటు భావితరాన్ని కాపాడాలంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. డీఎంకే ఎంపీ అభ్యర్థులు కళానిధి వీరాసామి(ఉత్తర చెన్నై), దయానిధి మారన్(మధ్య చెన్నై), తమిళచ్చి తంగపాండియన్(దక్షిణ చెన్నై)కు మద్దతుగా.. -
సమస్యలు పరిష్కరించండి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలకు కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. అన్నానగర్లోని ‘ఫెడరేషన్ ఆఫ్ అన్నానగర్ రెసిడెంట్్స అసోసియేషన్స్’ (ఎఫ్ఏఎన్ఆర్ఏ) తమ డిమాండ్లను సెంట్రల్ చెన్నై లోక్సభ అభ్యర్థుల ముందుంచారు. -
తెన్కాశిలో నెగ్గేదెవరు?
[ 18-04-2024]
పశ్చిమ కనుమల్లోని తెన్కాశి నియోజకవర్గం పునర్విభజనకు ముందు పూర్తిగా తిరునెల్వేలి జిల్లాలో ఉండేది. ఆ తర్వాత తెన్కాశి, కడైయనల్లూర్, వాసుదేవనల్లూర్(రిజర్వు), శంకరన్కోవిల్(రిజర్వు), విరుదునగర్లోని శ్రీవిల్లిపుత్తూర్(రిజర్వు), -
దూరదృష్టితో అభివృద్ధి ప్రణాళికలు
[ 18-04-2024]
దూరదృష్టితో అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తానని అన్నాడీఎంకే దక్షిణ చెన్నై అభ్యర్థి జయవర్ధన్ తెలిపారు. శ్రీరామనవమి పురస్కరించుకుని అయోధ్యకుప్పంలోని రాముడి ఆలయంలో పూజల అనంతరం బుధవారం ప్రచారం చేశారు. -
ప్రజాసేవకు వచ్చాం: ప్రేమలత
[ 18-04-2024]
ప్రజలకు సేవ చేసేందుకు తాము వచ్చామని ప్రేమలతా విజయకాంత్ అన్నారు. విరుదునగర్ లోక్సభ స్థానంలో పోటీచేస్తున్న కుమారుడు విజయ ప్రభాకరన్కి మద్దతుగా డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలతా బుధవారం -
ఇండియా కూటమిని గెలిపిస్తే అందరికీ సమాన విద్య
[ 18-04-2024]
అందరికీ సమానమైన విద్య అందించేందుకు ఇండియా కూటమికి ఓటు వేయాలని కనిమొళి తెలిపారు. డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి, తూత్తుక్కుడి అభ్యర్థి కనిమొళి బుధవారం తిరుచ్చెందూర్ ప్రచారంలో మాట్లాడుతూ. -
మూడో ప్రయత్నంలో 871వ ర్యాంకు
[ 18-04-2024]
సివిల్ సర్వీసెస్ పరీక్షలో పీఎఫ్ కార్యాలయంలో సహాయకురాలిగా పనిచేస్తున్న ఇన్బ 851వ ర్యాంకు సాధించారు. ఆమె మాట్లాడుతూ.. నా సొంతూరు తెన్కాశి జిల్లా వాసుదేవనల్లూర్. -
డీఎంకే, భాజపాకు ఓటు వేయటం ఒకటే: ఈపీఎస్
[ 18-04-2024]
డీఎంకే, భాజపాలకు ఓటేయటం ఒకటేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో...
తాజా వార్తలు (Latest News)
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?