logo

మొసలి దాడిలో యువకుడి దుర్మరణం

కొళ్లిడం నదిలో స్నానం చేయడానికి వెళ్లిన యువకుడిని మొసలి చంపేసింది. కడలూరు జిల్లా చిదంబరం వద్ద ఉన్న ఉత్తర వెళక్కుడికి చెందిన పక్కిరి కుమారుడు తిరుమలై (18).

Published : 29 Nov 2022 00:28 IST

ప్యారిస్‌, న్యూస్‌టుడే: కొళ్లిడం నదిలో స్నానం చేయడానికి వెళ్లిన యువకుడిని మొసలి చంపేసింది. కడలూరు జిల్లా చిదంబరం వద్ద ఉన్న ఉత్తర వెళక్కుడికి చెందిన పక్కిరి కుమారుడు తిరుమలై (18). అతను స్నేహితులతో కలిసి ఇంటి వద్ద ఉన్న పాత కుట్రాలం నదిలో స్నానం చేయడానికి వెళ్లాడు. అకస్మాత్తుగా మొసలి అతని చేయి పట్టుకొని లాక్కెళ్లింది. స్నేహితులు భయంతో ఒడ్డుకు వచ్చారు. స్థానికులతో కలిసి మొసలిని తరిమారు. అయినప్పటికీ తిరుమలైను విడిచిపెట్టలేదు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి తిరుమలై కోసం గాలించారు. చిదంబరం సబ్‌ కలెక్టరు సువేత సుమన్‌, డీఎస్పీ రఘుపతి తదితరులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎమ్మెల్యే పాండియన్‌ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు పరిశీలించారు. ఈ నేపథ్యంలో అతని మృతదేహం తీరానికి చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని