logo

ఈరోడ్‌ జిల్లాలో భారీవర్షం

ఈరోడ్‌ జిల్లాలోని పలు ప్రాంతాలలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది.

Published : 29 Nov 2022 00:28 IST

కాజ్‌వేపై పారుతున్న జలాలు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ఈరోడ్‌ జిల్లాలోని పలు ప్రాంతాలలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. అత్తాని-సత్యమంగళం రోడ్డులోని కొండైయంపాళయం పంచాయతీ సంత సమీపంలో కాజ్‌వే నీట మునిగింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అందియూర్‌ నుంచి సత్యమంగళం వెళ్లే వాహనాలను కళ్లిపట్లి వైపు మళ్లించారు. వరి పంట నీటమునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని