రాష్ట్రానికి పూర్వ వైభవం: రాబోతోంది స్టాలిన్
రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు డీఎంకే ప్రభుత్వం కృషి చేస్తోందని, పాలన ఎలా ఉండకూడదు, ముఖ్యమంత్రి ఎలా వ్యవరించకూడదు అనే దానికి గత అన్నాడీఎంకే ప్రభుత్వం, చక్కని పాలనకు నేటి డీఎంకే ప్రభుత్వం ఉదాహరణలని ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు.
పలు పథకాల శిలాఫలకాలను ఆవిష్కరిస్తున్న సీఎం. చిత్రంలో మంత్రులు కేఎన్ నెహ్రూ, పన్నీర్సెల్వం, రఘుపతి, శివశంకర్ తదితరులు
ప్యారిస్, న్యూస్టుడే: రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు డీఎంకే ప్రభుత్వం కృషి చేస్తోందని, పాలన ఎలా ఉండకూడదు, ముఖ్యమంత్రి ఎలా వ్యవరించకూడదు అనే దానికి గత అన్నాడీఎంకే ప్రభుత్వం, చక్కని పాలనకు నేటి డీఎంకే ప్రభుత్వం ఉదాహరణలని ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. అరియలూరు జిల్లాలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్ పాల్గొని రూ.30.26 కోట్ల వ్యయంతో చేపట్టిన 51 పథకాల పనులను ప్రారంభించారు. అదేవిధంగా రూ.1.56 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మూడు పథక పనులకు శంకుస్థాపన చేశారు. 27,070 మంది లబ్ధిదారులకు రూ.52 కోట్ల వ్యయంతో సంక్షేమ సాయం అందజేశారు. ముందుగా మాళిగైమేడులో పురాతన తవ్వకాల్లో బయటపడిన వస్తువుల ప్రదర్శనను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పోటీపడి పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నట్లు తెలిపారు. ఎగుమతిలో అగ్రస్థానంలో రాష్ట్రం ఉందన్నారు. అన్ని రంగాల్లో ప్రగతి బాటలో పయనిస్తున్నామన్నారు. వ్యవసాయ ఉత్పత్తి ఎక్కువగా ఉందన్నారు. పాఠశాల విద్యలో పలు అవార్డులు దక్కాయన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించి లబ్ధి చేకూర్చామని తెలిపారు. పదిహేను నెలల్లో ఒకటిన్నర లక్షల ఉచిత వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చినట్లు చెప్పారు. ఇటీవల రిజర్వు బ్యాంకు విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో ఎక్కువ పరిశ్రమలు ఉన్న రాష్ట్రంగా మొదటి స్థానంలో తమిళనాడు ఉందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నాశనం చేసేందుకు కొందరు ప్రణాళిక చేస్తున్నారన్నారు. తమిళనాడు కోల్పోయిన వైభవాన్ని తిరిగి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
మృతుల కుటుంబాలకు సాయం ప్రకటన
చెన్నై, న్యూస్టుడే: చెంగల్పట్టు జిల్లా కన్నగపట్టు కొలనులో ప్రమాదవశాత్తు మునిగి విద్యార్థులు మురుగేశ్, ఉదయకుమార్, విజయ్ మరణించడంపై ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి రూ.2 లక్షలు చొప్పున సీఎం జనరల్ ఫండ్ నుంచి అందజేయాలని అధికారులను ఆదేశించారు.
జాలర్లను విడుదలకు కేంద్రానికి లేఖ
చెన్నై, న్యూస్టుడే: శ్రీలంక జైళ్లలో ఉన్న రాష్ట్రానికి చెందిన 23 మంది జాలర్లను విడిపించడానికి వెంటనే చర్యలు చేపట్టాలంటూ కేంద్రాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్కు లేఖ రాశారు. 5 ఫిషింగ్ బోట్లు సహా 23 మంది తమిళులను శ్రీలంక నావికా దళం సోమవారం అరెస్టు చేసిందన్నారు. ఈ ఏడాదిలో 221 మంది తమిళ జాలర్లను అరెస్టు చేశారని పేర్కొన్నారు. 105 బోట్లు శ్రీలంక ఆధీనంలో ఉన్నాయని తెలిపారు. శ్రీలంక చెరలోని జాలర్లను, బోట్లను వెంటనే విడిపించడానికి అవసరమైన చర్యలను చేపట్టాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కదిలొచ్చిన ఓటర్లు
[ 20-04-2024]
ఓటు వేసేందుకు పెద్దఎత్తున ప్రజలు ముందుకొచ్చారు. ఇండియా, ఎన్డీయే, అన్నాడీఎంకే కూటముల మధ్య జరిగే ప్రధాన పోరులో అభ్యర్థుల్ని శాసించేందుకు ఓటర్లు తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. -
డీఎంకే డబ్బుతో గెలవాలనుకుంటోంది: అన్నామలై
[ 20-04-2024]
డబ్బు ఎరచూపి కోవైని సొంతం చేసుకోవాలనుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కోవై లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి అన్నామలై ఆరోపించారు. ఆయన శుక్రవారం కరూర్ జిల్లా అరవక్కురిచ్చిలోని పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
సింగపూర్ నుంచి వచ్చి..
[ 20-04-2024]
పుదుచ్చేరిలో లోక్సభ ఎన్నికల పోలింగ్ శుక్రవారం 7 గంటలకే ప్రారంభమైంది. పుదుచ్చేరి కిరుమాంబాక్కం పోలింగ్బూత్లో సింగపూర్ నుంచి వచ్చిన భారత పౌరహక్కు పొందిన యువ ఓటరు ఆర్ముగం పువియరసి(18)తన తల్లి ఆర్ముగం మాలతితో వచ్చి తొలిఓటు హక్కు వినియోగించుకున్నారు. -
40 స్థానాల్లో ఇండియా కూటమిదే గెలుపు: పి.చిదంబరం
[ 20-04-2024]
తమిళనాడు, పుదుచ్చేరిలోని 40 నియోజకవర్గాల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు. శివగంగై జిల్లా కారైక్కుడి వద్ద ఉన్న కండనూర్ సిట్టాళ్ ఆచ్చి హైస్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. -
అట్టడుగుకు రాజధాని
[ 20-04-2024]
చెన్నై జిల్లాలో కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా శుక్రవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మిగతా నియోజకవర్గాలతో పోల్చితే రాజధాని చెన్నైలో పోలింగ్శాతం అట్టడుగుకు చేరింది. -
మా బాధ్యత నెరవేర్చాం.. మరి మీరు!
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి తమ ప్రజాస్వామ్య బాధ్యతను నెరవేర్చడానికి సినీ తారలు పోలింగ్ బూత్లకు తరలివచ్చారు. క్యూలో నిలబడి తమ వంతురాగానే ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
ప్రశాంతంగా ముగిసిన సార్వత్రిక పోరు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో మొదటి విడతలో పోలింగ్ జరిగిన తమిళనాడులో ఓటర్లు, సినీ, రాజకీయ ప్రముఖులు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
పనసపండు గుర్తు ఎక్కడ?
[ 20-04-2024]
స్వతంత్ర అభ్యర్థుల మధ్య చిక్కుకున్న మాజీ సీఎం ఓ.పన్నీర్సెల్వాన్ని గుర్తించలేక ఓటర్లు తికమకపడ్డారు. రామనాథపురం లోక్సభ నియోజకవర్గంలో భాజపా కూటమి మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా మాజీ సీఎం బరిలో ఉన్నారు. -
ఇక్కట్లు తీరలేదని ఎన్నికల బహిష్కరణ
[ 20-04-2024]
కృష్ణగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వేప్పన్హళ్లి అసెంబ్లీ నియోజకవర్గం మేడ అగ్రహారం పంచాయతీలోని కడవరహళ్లి గ్రామంలోని 450 మందికి పైగా ఓటర్లు, కరుక్కన్అళ్లి గ్రామంలో 1,050 మంది ఓటర్లు, తేన్గనికోట్టై సమీపంలోని కారండఅళ్లి పంచాయతీ కచ్చువాడి గ్రామంలో 961 మంది ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు