అతివలకు అనువైన మార్గాలు!
మహిళలు తిరిగేందుకు చెన్నై దారులు ఎంత సురక్షితం? పలానా దారి మంచిదా కాదా, వెళ్తే తగిన భద్రత ఉంటుందా? లేదా? ఇలా మహిళలు, యువతుల్లో ఎన్నో సందేహాలు.
స్త్రీలు వెళ్లేందుకు సురక్షితంగా నగర దారులు
పకడ్బందీ ఏర్పాట్లకు జీసీసీ ప్రతిపాదనలు
అధునాతన సాంకేతికత వినియోగం
ఈనాడు-చెన్నై
మహిళలు తిరిగేందుకు చెన్నై దారులు ఎంత సురక్షితం? పలానా దారి మంచిదా కాదా, వెళ్తే తగిన భద్రత ఉంటుందా? లేదా? ఇలా మహిళలు, యువతుల్లో ఎన్నో సందేహాలు. వీటిని నివృత్తి చేసేలా నగరంలోని చాలా మార్గాల్ని అత్యంత సురక్షితంగా మార్చే ప్రాజెక్టును గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ తీసుకొస్తోంది.
చెన్నై నగరంలో ఇప్పటికీ కొన్ని మార్గాలు మహిళల రాకపోకలకు అనువుగా లేవు. ఈ విషయాన్ని నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు కీలక మార్పులు తెస్తూ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఓ స్టార్టప్తో కలిసి మహిళలకు అనువుగా రోడ్లను మార్చేలా ప్రాజెక్టు తీసుకొస్తోంది. వారికి సురక్షిత దారుల్ని కానుకగా ఇవ్వాలని యోచిస్తోంది. ఇందులో ఆ స్టార్టప్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్ని అమల్లోకి తెస్తోంది.
యాప్లో సమగ్ర సమాచారం
చెన్నైలో ఏ మార్గాన్ని చూసినా.. అందులోని లోపాలు స్పష్టంగా కనిపించేలా ఓ యాప్ను తయారుచేశారు. క్షేత్రస్థాయి పరిశీలనలు, ఇతర డేటా సేకరణ సాంకేతికతను మ్యాపింగ్కు అనుసంధానించి అధికారులకు ఎప్పటికప్పుడు తెలిసేలా చేస్తున్నారు. నగరంలో ఏ రోడ్డును ఆ మ్యాప్లో చూసినా.. మహిళల రాకపోకలకు తగ్గట్లు వెలుతురు ఎలా ఉంది, విద్యుద్దీపాల సౌకర్యాలు ఎలా ఉన్నాయి, నిర్ణీత సమయం దాకా ప్రజా రవాణా ఉందా? లేదా? నడకబాటల పరిస్థితేంటి, ఆయా మార్గాల్లో పోలీసు భద్రత ఏ విధంగా ఉంది.. ఇలాంటి సమగ్ర సమాచారం వివిధ శాఖల ఉన్నతాధికారులకు తెలిసేలా వివరాల్ని అందులో పొందుపరుస్తున్నారు.
ఎప్పటికప్పుడు పనులు
స్టార్టప్ సంస్థ ఇచ్చిన సాంకేతికత సమాచారాన్ని, వారిచ్చే నివేదికల్ని అనుసరించి.. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల్ని బేరీజు వేసుకుని అధికారులు నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే పలు దారుల్ని ఎంపికచేసే పనిలో జీసీసీ జోన్లలోని అధికారులున్నారు. వీటిపై పాలకమండలిలో ఇప్పటికే చర్చ జరిగింది. పనులు వెంటనే జరిగేలా వారినుంచి యంత్రాంగానికి ఆదేశాలు కూడా వెళ్లాయి.
రాత్రివేళ సైకిల్పై వీధుల్లో తిరుగుతూ పరిశీలిస్తున్న జీసీసీ మేయర్ ప్రియ (పాతచిత్రం)
నడకదారులే కాస్త ఇబ్బంది
ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన స్టార్టప్ గతేడాది పలు సాంకేతికతలను వినియోగించి నగరంలో సర్వేలు చేసింది. తండియార్పేటలో పాఠశాలలు, కళాశాలలున్న మార్గాల్లో ఆడపిల్లలకు అనువుగా ఆయా మార్గాలు ఉన్నాయా? లేవా? అనేది ఆడిట్ నిర్వహించారు. అక్కడ 60 శాతం దారులు ప్రజలు తిరిగేందుకు బాగున్నాయని, 85 శాతం ప్రజారవాణా అందుబాటులో ఉందని, 91 శాతం దారుల్లో వెలుతురు బాగుందని నివేదిక ఇచ్చారు. కానీ నడకమార్గాలు మాత్రం బాగా ఇబ్బందిగా ఉన్నట్లు నివేదికలో తెలిపారు. ఇదే తరహా సర్వేను సెమ్మంచ్చేరిలోనూ నిర్వహించారు. ఇలా బయటపడిన లోపాల్ని కార్పొరేషన్కు నివేదిక ఇచ్చి.. అక్కడ పరిష్కారమయ్యేలా చూస్తున్నారు. పనులు పూర్తయ్యాక ఆయా మార్గాలు సురక్షితమని ప్రకటిస్తారు.
సింగార చెన్నై లక్ష్యంగా..
‘సింగార చెన్నై 2.0’ ప్రాజెక్టులో భాగంగా గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నగరాన్ని మరింత ఆరోగ్యకరంగా మార్చేందుకు పలు ప్రతిపాదనలు చేసింది. 10 జోన్లలో పెద్దఎత్తున పార్కులు, క్రీడా మైదానాలు నిర్మించాలని పాలకమండలి ఆమోదం తెలిపింది. ఇందులో మహిళలకు ప్రత్యేక స్థానాన్నీ ఇవ్వనున్నారు. రూ.50 కోట్లతో 150 పార్కులు, 50 మైదానాలు వచ్చేలా అంచనాలు వేస్తున్నారు. దీనికి సబంధించి ఇదివరకే ప్రతిపాదనల్ని తమిళనాడు అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీయూఎఫ్ఐడీసీవో)కు జీసీసీ అధికారులు సమర్పించారు. మొదటి విడతలో జోన్ 1-4, 7-9, 10, 13, 14లో 45 పార్కులు, 13 మైదానాల్ని ఏర్పాటుచేయనున్నారు.
‘నిర్భయ’ ప్రాజెక్టు జోరు
నిర్భయ పథకం కింద చెన్నైకి ఇదివరకే రూ.425 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. పాఠశాలల్లో భద్రత, పరిశుభ్రత, వివిధ ప్రాంతాల్లో విద్యుద్దీపాల కోసం, దివ్యాంగులకు షెల్టర్లు, మొబైల్ మరుగుదొడ్లు, పాతవాటికి మరమ్మతులు, పాఠశాలల్లో క్రీడల వృద్ధి, విద్యుద్దీపాల్ని రిమోట్ కంట్రోల్ ద్వారా నిర్వహించడం, ప్రత్యేకించి జెండర్ల్యాబ్ ఏర్పాటు.. ఇలా పలురకాల పనులకోసం నిధులు ఇచ్చారు. వీటిలో కొన్ని ప్రాజెక్టులు పూర్తవగా మరికొన్ని చివరిదశకు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళల పాలిట రక్తపోటు
[ 25-04-2024]
అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి. -
ఆధారాలున్నా ఓటరు పేర్లు గల్లంతు
[ 25-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బర్డ్ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక బృందాలు
[ 25-04-2024]
తమిళనాడులో బర్డ్ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. -
జూన్లో కొత్త రోడ్లు
[ 25-04-2024]
కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
తమిళ అభిమానులకు కృతజ్ఞతలు
[ 25-04-2024]
ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష
[ 25-04-2024]
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్ బిస్కెట్ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. -
మత ఘర్షణలు సృష్టించేలా ప్రధాని ప్రచారం
[ 25-04-2024]
మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
మోదీ పాలనలో మైనారిటీలు ఇబ్బంది పడలేదు: ఓ పన్నీర్సెల్వం
[ 25-04-2024]
మోదీ పాలనలో మైనారిటీ ప్రజలు ఇబ్బంది పడలేదని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం తెలిపారు. మదురై తిరుప్పరకుండ్రం సుబ్రమణిస్వామి ఆలయంలో మంగళవారం మురుగన్ను దర్శించుకున్నారు. -
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?
[ 25-04-2024]
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. -
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ చర్యలు: స్టాలిన్
[ 25-04-2024]
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. -
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
[ 25-04-2024]
శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
[ 25-04-2024]
హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?