సిద్ధాంతాలు, విజయాలే డీఎంకే ఆయుధాలు: స్టాలిన్
సిద్ధాంతాలు, విజయాలే డీఎంకే ఆయుధాలని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని డీఎంకే శ్రేణులకు పిలుపునిచ్చారు.
చెన్నై, న్యూస్టుడే: సిద్ధాంతాలు, విజయాలే డీఎంకే ఆయుధాలని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని డీఎంకే శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యకర్తలకు ఆయన రాసిన లేఖలో... రాష్ట్ర స్థాయిని పెంచడానికి, హక్కులు తిరిగి పొందేందుకు నిరంతరం శ్రమిస్తున్నానని తెలిపారు. ఎవరినీ వదలకుండా అన్నివర్గాల ప్రజల జీవన స్థాయిని కచ్చితంగా పెంచాలంటే అన్ని జిల్లాలకు ఏకీకృత అభివృద్ధిని సాధించాలని పేర్కొన్నారు. దానికోసం ఈ ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తోందని తెలిపారు. ఆదర్శంగా కొనసాగుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతిభద్రతల సమస్యలు, గందరగోళాలు సష్టించడానికి రాజకీయ ప్రత్యర్థులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత డీఎంకేలోని ప్రతి కార్యకర్తకు ఉందన్నారు. ప్రత్యర్థుల ఆరోపణాస్త్రాలు తిప్పికొట్టేందుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలోని అన్ని విభాగాలకు నిర్వాహకులను వారి అర్హతలను పరిశీలించి నియమించినట్టు తెలిపారు. కష్టించేవారికి పదవులు రాకుంటే తర్వాతి అవకాశాల్లో వారి నిరీక్షణకు తప్పకుండా ఫలితం లభిస్తుందని తెలిపారు. వేల సంవత్సరాలుగా ఆర్య-ద్రావిడ సంస్కృతి యుద్ధంలో ప్రజాస్వామ్య విధానంలో డీఎంకే పోరాడుతోందని పేర్కొన్నారు. జాతి, భాష, రాష్ట్ర హక్కులపై ప్రకటించిన యుద్ధాన్ని నిజాయతీగా ఎదుర్కొంటున్నామని తెలిపారు. అందులో విజయం కూడా సాధించామని పేర్కొన్నారు. సిద్ధాంతాలు, విజయాలే తమకు కత్తి, డాలుగా తెలిపారు.
అన్బళగన్ విద్యా ప్రాంగణంగా డీపీఐ
చెన్నై, న్యూస్టుడే: డీపీఐ ప్రాంగణాన్ని ఇకపై అన్బళగన్ విద్యా ప్రాంగణంగా పిలువనున్నట్టు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. బుధవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో... రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషి చేసిన ఉత్తమ విద్యావేత్త అన్బళగన్ను కీర్తించేలా ఆయన శతజయంతి వేడుకలు పురస్కరించుకుని పాఠశాల విద్యాశాఖ తరఫున రూ.7,500 కోట్ల వ్యయంతో పాఠశాల అభివృద్ధి పథకాన్ని ప్రకటించినట్టు తెలిపారు. దాని కోసం ప్రస్తుత ఏడాది రూ.1,400 కోట్లను కేటాయంచినట్టు పేర్కొన్నారు. అన్బళగన్ శతజయంతిని స్మరించేలా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కొనసాగే డీపీఐ ప్రాంగణంలో ఆయనకు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆ ప్రాంగణాన్ని ‘పేరాసిరియర్ అన్బళగన్ కల్వి వళాగం’ (ఆచార్యులు అన్బళగన్ విద్యా ప్రాంగణం)గా పిలువనున్నట్టు తెలిపారు. బోధన, ఉపాధ్యాయ నైపుణ్యాభివృద్ధి, నాయకత్వం, విద్యార్థి అభివృద్ధి తదితర బహుముఖ అభివృద్ధిని ఆవిష్కరించే ఉత్తమ పాఠశాలలకు అన్బళగన్ పేరిట పురస్కారం కూడా అందించనున్నట్టు పేర్కొన్నారు..
క్రికెట్ విజయోత్సవాలకు ఆహ్వానం
సీఎంకు జ్ఞాపిక అందజేస్తున్న కృష్ణమాచారి శ్రీకాంత్
చెన్నై, న్యూస్టుడే: భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ను తొలిసారి గెలిచి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించే సంబరాలకు ముఖ్యమంత్రి స్టాలిన్కు ఆహ్వానం అందింది. భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిశారు. భారత క్రికెట్జట్టు ప్రపంచ కప్ను 1983లో గెలిచి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించే వేడుకలకు స్టాలిన్ను ఆహ్వానించారు. వేడుకను పురస్కరించుకుని ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను ముఖ్యమంత్రికి అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
[ 25-04-2024]
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. -
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
[ 25-04-2024]
శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. -
మహిళల పాలిట రక్తపోటు
[ 25-04-2024]
అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి. -
ఆధారాలున్నా ఓటరు పేర్లు గల్లంతు
[ 25-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బర్డ్ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక బృందాలు
[ 25-04-2024]
తమిళనాడులో బర్డ్ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. -
జూన్లో కొత్త రోడ్లు
[ 25-04-2024]
కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
తమిళ అభిమానులకు కృతజ్ఞతలు
[ 25-04-2024]
ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష
[ 25-04-2024]
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్ బిస్కెట్ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. -
మత ఘర్షణలు సృష్టించేలా ప్రధాని ప్రచారం
[ 25-04-2024]
మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
మోదీ పాలనలో మైనారిటీలు ఇబ్బంది పడలేదు: ఓ పన్నీర్సెల్వం
[ 25-04-2024]
మోదీ పాలనలో మైనారిటీ ప్రజలు ఇబ్బంది పడలేదని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం తెలిపారు. మదురై తిరుప్పరకుండ్రం సుబ్రమణిస్వామి ఆలయంలో మంగళవారం మురుగన్ను దర్శించుకున్నారు. -
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ చర్యలు: స్టాలిన్
[ 25-04-2024]
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
[ 25-04-2024]
హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?