పరిశ్రమల్లో అగ్రస్థానం
నివేదిక ప్రకారం దేశం మొత్తమ్మీద రాష్ట్రంలోనే 15.7 శాతం పరిశ్రమలు ఉన్నట్లు వెల్లడించారు. ఇక్కడ పారిశ్రామిక విప్లవం పెద్దఎత్తున కొనసాగుతున్నట్లుగా తెలిపారు.
జాతీయస్థాయిలో సత్తా చాటిన రాష్ట్రం
తాజా నివేదికలో ఆర్బీఐ వెల్లడి
కృష్ణగిరిలోని పారిశ్రామిక వాడ నమూనా
రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం విస్తరిస్తోంది. ఇది యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సైతం రాష్ట్రంలోని వ్యవస్థలపై ప్రశంసలు కురిపిస్తోంది. ఇతర రాష్ట్రాలకన్నా భిన్నంగా పెట్టుబడుల్ని కూడా ఆకర్షిస్తున్నట్లు తెలిపింది. దేశంలోని పరిశ్రమల స్థితిగతులపై ఆర్బీఐ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. అందులో తమిళనాడుకు సంబంధించిన ఆసక్తికర అంశాలున్నాయి.
ఈనాడు, చెన్నై
నివేదిక ప్రకారం దేశం మొత్తమ్మీద రాష్ట్రంలోనే 15.7 శాతం పరిశ్రమలు ఉన్నట్లు వెల్లడించారు. ఇక్కడ పారిశ్రామిక విప్లవం పెద్దఎత్తున కొనసాగుతున్నట్లుగా తెలిపారు. తద్వారా జాతీయస్థాయిలో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రం తర్వాత గుజరాత్లో 11.5శాతం, మహారాష్ట్రలో 10.3శాతం, ఆంధ్రప్రదేశ్లో 6.8శాతం, ఉత్తరప్రదేశ్లో 6.5శాతం పరిశ్రమలున్నట్లు వెల్లడించారు. దీంతో దేశంలోని అందరి చూపూ మరోసారి తమిళనాడువైపు పడింది.
* భారీగా పెరుగుదల
గతం నుంచీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ పరిశ్రమలకు పెద్దపీట వేశాయి. తాజా డీఎంకే ప్రభుత్వ బడ్జెట్లోనూ ఇది ప్రస్ఫుటంగా కనిపించింది. దీనికి తగ్గట్లే ప్రతిపాదనలు పెట్టడం, విదేశీ పర్యటనలు చేసి అక్కడి ప్రభుత్వాల్ని, ఆయా దేశాల సంస్థల్ని తమిళనాడుకు ఆహ్వానించడం తరచూ కనిపిస్తోంది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. 2020-21లో తమిళనాడులో 38,837 పరిశ్రమలున్నట్లు రికార్డుల ద్వారా తెలిసిందని వెల్లడించింది. అంతకుముందు సంవత్సరంకన్నా 45 శాతం ఇవి పెరిగినట్లుగా పేర్కొంది.
*విధానాలు ఆదర్శం
దక్షిణాది రాష్ట్రాల పారిశ్రామిక విధానాలే దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. అందులోనూ ఒక్క తమిళనాడు నుంచి పెద్ద ఆశలే ఉన్నాయి. తాజాగా ఆర్బీఐ నివేదికలో ఓ అంశం ఆసక్తికరంగా మారింది. పెట్టుబడుల పరంగా దేశంలో 2030కి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థను తెచ్చే సూచనలున్నాయని వెల్లడించింది. ఇందులో ఒక్క తమిళనాడులోనే ఒకటిలో 5వ వంతు ఉంటుందని అంచనాలు వేసింది. ఇది ప్రభుత్వాలకు మార్గనిర్దేశం చేసినట్లుగానూ ఉన్నట్లు కనిపిస్తోంది.
* సంస్కరణలే కీలకం
తమిళనాడును అగ్రస్థానం నిలుపుతున్నది పకడ్బందీ ప్రణాళికలేనని స్పష్టమవుతోంది. పరిశ్రమలు, పెద్ద సంస్థల్ని ఆకర్షించేందుకు తగిన వనరుల్ని సమకూర్చడం, వారికి అనువైన వాతావరణాన్ని కల్పించడంపై ఇక్కడి ప్రభుత్వం దృష్టిపెట్టింది. పరిశ్రమల అనుమతుల కోసం తమిళనాడులో మంచి వ్యవస్థ ఉందని ఆర్బీఐ తెలిపింది. ప్రత్యేకించి ఏకగవాక్ష విధానాన్ని తీసుకురావడం, అది ప్రభావమంతంగా పనిచేయడం శుభపరిణామమని చెప్పింది. దీంతోపాటు పరిశ్రమలకు అవసరమైన 24 గంటల విద్యుత్తును అందించడం, పరిశ్రమల్ని ఆకర్షించే రాయితీల కల్పన ప్రత్యేకమని తెలిపింది.
కార్మికులూ ఎక్కువే..
దేశంలో కీలకంగా మారిన ఈ రాష్ట్రంలో ఎక్కువభాగం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలే ఉన్నాయి. ఆర్బీఐ కూడా ఇదే విషయాన్నే తెలిపింది. దీంతో కార్మికుల అవసరం అవసరం బాగా పెరిగిందని వివరించింది. దీనికి తగ్గట్లు ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసుకున్నారని తెలిపింది. మానవ వనరులపరంగా రాష్ట్రం చాలా మందుందని వెల్లడించింది. ఏకంగా 22.09 లక్షల మంది కార్మికులు వివిధ పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నట్లు నివేదికలో తెలిపింది.
భవిష్యత్తు ఆశలు
పారిశ్రామికాభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయం
* ప్రత్యేకించి రాష్ట్రం ఆటోమొబైల్స్ తయారీ పరంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ రంగంలో భారీ పెట్టుబడులు రావొచ్చని ఆర్బీఐ అధికారులు చెప్పారు.* దీని తర్వాత ఎలక్ట్రానిక్స్ రంగం పెట్టుబడులు తీసుకొచ్చే దిశగా వృద్ధి చెందుతోందని వెల్లడించారు. ఈ రంగంలో పాట్రగాన్, యాపిల్, ఫాక్స్కాన్ లాంటి మొబైల్ తయారీ పరిశ్రమలు పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి.* రసాయనాలు, చర్మ, ఇతర పరిశ్రమలు 2023 ఆర్థిక సంవత్సరానికి 320.3 బిలియన్ డాలర్ల జీడీపీకి చేరుకునే అవకాశముందని చెప్పారు. ఈ రంగాలు రాబోయే 8 ఏళ్లలో 40శాతంపైగా పెట్టుబడుల్ని సాధించే దిశగా వెళ్తున్నాయని వివరించారు.* కృత్రిమ మేధ, యంత్రాలు తయారీ సాంకేతికతల్లో తమిళనాడు ఆకర్షిస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే 8 ఏళ్లలో ఈ రంగాల విస్తరణ మరింత మెరుగ్గా ఉంటుందని అంచనా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
[ 25-04-2024]
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. -
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
[ 25-04-2024]
శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. -
మహిళల పాలిట రక్తపోటు
[ 25-04-2024]
అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి. -
ఆధారాలున్నా ఓటరు పేర్లు గల్లంతు
[ 25-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బర్డ్ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక బృందాలు
[ 25-04-2024]
తమిళనాడులో బర్డ్ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. -
జూన్లో కొత్త రోడ్లు
[ 25-04-2024]
కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
తమిళ అభిమానులకు కృతజ్ఞతలు
[ 25-04-2024]
ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష
[ 25-04-2024]
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్ బిస్కెట్ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. -
మత ఘర్షణలు సృష్టించేలా ప్రధాని ప్రచారం
[ 25-04-2024]
మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
మోదీ పాలనలో మైనారిటీలు ఇబ్బంది పడలేదు: ఓ పన్నీర్సెల్వం
[ 25-04-2024]
మోదీ పాలనలో మైనారిటీ ప్రజలు ఇబ్బంది పడలేదని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం తెలిపారు. మదురై తిరుప్పరకుండ్రం సుబ్రమణిస్వామి ఆలయంలో మంగళవారం మురుగన్ను దర్శించుకున్నారు. -
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ చర్యలు: స్టాలిన్
[ 25-04-2024]
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
[ 25-04-2024]
హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం