హైకోర్టులో వాదన భాషగా తమిళానికి అవకాశం
భవిష్యత్తులో మద్రాసు హైకోర్టులో వాదన భాషగా తమిళం ఉంటుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు హామీ ఇచ్చారు.
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
విద్యార్థినికి పట్టా ప్రదానం చేస్తున్న దృశ్యం
ప్యారిస్, న్యూస్టుడే: భవిష్యత్తులో మద్రాసు హైకోర్టులో వాదన భాషగా తమిళం ఉంటుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు హామీ ఇచ్చారు. చెన్నైలోని తమిళనాడు డాక్టర్ అంబేెడ్కర్ న్యాయ విశ్వవిద్యాలయం 12వ స్నాతకోత్సవం శుక్రవారం జరిగింది. ఇందులో గవర్నర్ ఆర్ఎన్ రవితో కలిసి కేంద్ర మంత్రి పాల్గొన్నారు. అప్పుడు ఆయన మాట్లాడుతూ..... ప్రజలు న్యాయశాఖను సులభంగా సంప్రదించేందుకు ప్రాంతీయ భాషల్లో విచారణ అవసరం అన్నారు. ప్రధాని మోదీ మన సంస్కృతి, భాషతో దేశాన్ని అభివృద్ధి చేయాలని నిశ్చయించుకున్నారని తెలిపారు. కోర్టు విచారణలు, న్యాయశాఖలో భవిష్యత్తులో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో మాట్లాడానని చెప్పారు. తమిళం ఉత్తమ భాష అన్నారు. ఒక భాషను మాత్రమే బలవంతంగా రుద్దే ప్రయత్నాలను తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. గవర్నర్ ఆర్ఎన్ రవి మాట్లాడుతూ.... మోదీ వంటి బలమైన నాయకుడు ఉండడంతో దేశం అభివృద్ధి మార్గంలో పయనిస్తోందన్నారు. దీనిని నాశనం చేయడానికి మతం, జాతి, కులం పేరుతో గొడవలు జరగవచ్చన్నారు. మనం వాటిని ఎదుర్కొని అభివృద్ధి మార్గంలో వెళ్లాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నటుడు విజయ్ కుమారుడు కొత్త సినిమా.. హీరోగా కాదు!
[ 29-03-2024]
నటుడు విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ 2009లో విడుదలైన ‘వేట్టైక్కారన్’ చిత్రంలోని ‘నా అడిచ్చా తంగమాట్ట’ పాటలో తన డ్యాన్స్ ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. -
అంతు చిక్కని ఓటరు నాడి!
[ 29-03-2024]
ఎన్నికల ఫలితాలు దేశమంతా ఒకలా ఉంటే.. తమిళనాడులో మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి. లోక్సభ ఎన్నికల్లో ఓ తరహా తీర్పు, అసెంబ్లీ ఎన్నికల్లో మరో రకమైన తీర్పు ఇక్కడే కనిపిస్తుంటుంది. -
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
[ 29-03-2024]
రామనాథపురంలో ఐదుగురు ఓ పన్నీర్సెల్వంల నామినేషన్లు ఆమోదించారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కృతుడైన మాజీ సీఎం ఓ.పన్నీర్సెల్వం అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పునరుద్ధరణ కమిటీ పేరుతో పనిచేస్తున్నారు. -
ప్రాణస్నేహితుల్లా మెలిగాం
[ 29-03-2024]
డీఎంకేపై వ్యరేతికతతో పార్టీలో చేరిన గణేశమూర్తి ఎంపీ అయ్యారని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో గుర్తు చేశారు. ఆయన కోవై విమానాశ్రయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. -
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె శివగంగైలో నామినేషన్
[ 29-03-2024]
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె స్వతంత్ర అభ్యర్థిగా శివగంగై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు నామినేషన్ దాఖలు చేయడం కలకలం సృష్టించింది. -
ప్రధాని నాటకాలు ప్రజలకు తెలుసు
[ 29-03-2024]
ప్రధాని మోదీ ఎన్నికల నాటకాలు ప్రజలకు తెలుసని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్లో డీఎంకే ఎన్నికల ప్రచార సమావేశం బుధవారం రాత్రి జరిగింది. -
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదు : కనిమొళి
[ 29-03-2024]
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదని డీఎంకే ఎంపీ కనిమొళి పేర్కొన్నారు. కరూర్ వెంగమేడు అన్నా విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జ్యోతిమణికి మద్దతుగా గురువారం ఆమె ప్రచారం చేశారు. -
కవిన్ డబ్బింగ్ పూర్తి
[ 29-03-2024]
బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి ‘టాటా’ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన నటుడు కవిన్. ఆ చిత్రం విజయం తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఇళనుడన్ దర్శకత్వంలోని ‘స్టార్’ చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ