logo

ఘంటసాల శతజయంతి వేడుకలు రేపు

ప్రముఖ గాయకుడు ఘంటసాల శతజయంతి వేడుకలు చెన్నైలో ఆదివారం జరుగనున్నాయి.

Published : 03 Dec 2022 00:31 IST

వేడుకల లోగో

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ప్రముఖ గాయకుడు ఘంటసాల శతజయంతి వేడుకలు చెన్నైలో ఆదివారం జరుగనున్నాయి. కళా ప్రసాదిని, ఘంటసాల కుటుంబసభ్యులు సంయుక్తంగా సాయంత్రం 4 గంటల నుంచి నిర్వహించే ఈ కార్యక్రమానికి నగరంలోని మ్యూజిక్‌ అకాడమీ వేదిక కానుంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. రాష్ట్ర మంత్రులు పీకే శేఖర్‌బాబు, మనో తంగరాజ్‌, సంగీత్‌ నాటక అకాడమీ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ సంధ్య తదితరులు హాజరవుతారు. కార్యక్రమంలో భాగంగా వంద మంది చొప్పున చిన్నారులు, కళాకారులతో సాంస్కృతిక వేడుకలు ఉంటాయి. నృత్యరూప భగవద్గీత సిరీస్‌ను కూడా ప్రారంభించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని